అన్వేషించండి

DK Aruna On BJP Meeting : సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లికి బేడీలు వేశారు, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి - డీకే అరుణ

DK Aruna On BJP Meeting : జులై 3న సికింద్రాబాద్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారని విమర్శించారు.

DK Aruna On BJP Meeting : తెలంగాణ చరిత్రలోనే నిలిచిపోయే సభగా ప్రధాని మోదీ బహిరంగసభ నిలిచిపోతోందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ విధానాన్ని మోదీ ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ సభకు లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారని డీకే అరుణ విమర్శించారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నియంత మాదిరి పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మిగిలిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల‌ హామీలు అమలులో‌ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. 
 
బంగారు కుటుంబంగా మారింది  

'ప్రధాని మోదీ సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పాల్గొంటారు. కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ జరగనటువంటి సభను నిర్వహిస్తున్నాం. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది. తెలంగాణ వచ్చిన ఉద్దేశాన్ని మార్చి నియంతృత్వ పోకడలకు పోతున్నారు. బంగారు తెలంగాణ ఇవాళ లేదు. బంగారు కల్వకుంట్ల కుటుంబం మాత్రమే ఉంది. నీళ్లు, నిధులు , నియామకాలపై ఏర్పాటైన తెలంగాణలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. డబుల్ బెడ్ రూమ్  ఇళ్లు, నిరుద్యోగి భృతి, దళితులకు మూడెకరాల భూమి ఇలా ఎన్ని హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా కేసీఆర్ నెరవేర్చలేదు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. ప్రధాని మోదీ దేశంలో అట్టడుగు వర్గాల వారికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తుంది. ప్రపంచంలో భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు.' - డీకే అరుణ, మాజీ మంత్రి 

తెలంగాణ తల్లికి బేడీలు 

" తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారు. ఆమెకు స్వేచ్ఛ రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే. మనం కలలు కన్న తెలంగాణ రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. గ్రామ గ్రామాల్లో బీజేపీ పర్యటిస్తుంది. ప్రధాని మోదీ తెచ్చిన పథకాలను ప్రచారం చేస్తుంది. జులై 2,3 తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. జులై 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. అది కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. "
--డీకే అరుణ, మాజీ మంత్రి 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget