By: ABP Desam | Updated at : 05 Sep 2023 08:47 PM (IST)
హోంగార్డు రవీందర్
Home Guard Suicide Attempt: తెలంగాణలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు అందలేదు. దీంతో ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. కొందరు అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు. మరి కొందరు దాచుకున్న సొమ్ముతో నెలంతా లొక్కొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల నుంచి జీతాలు రావడంలేదని మనస్థాపం చెందిన ఓ హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గోశామహల్లో మంగళవారం చోటుచేసుకుంది.
హోంగార్డు రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. గత రెండు నెలల నుంచి రవీందర్కు జీతాలు రావడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి జీతం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి వివరించాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన రవీందర్ గోషామహల్లోని హోంగార్డుల హెడ్ ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
చుట్టుపక్కల గమనించి మంటలను ఆర్పివేశారు. రవీందర్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రవీందర్కు 55 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు.
Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి
Police Dance: గణేష్ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్
Weather Latest Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
/body>