అన్వేషించండి

Hath se hath Jodo Yatra: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి ఎర్రబెల్లిపై విచారణ జరిపిస్తా- రేవంత్ రెడ్డి

Hath se hath Jodo Yatra: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని అడ్డం పెట్టుకొని భూములు కాజేసిన ఆయనపై విచారణ జరిపిస్తానన్నారు.

Hath se hath Jodo Yatra: టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే బాథ్ జోడో యాత్రం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విజయవంతంగా ముగిసింది. అయితే ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ధరణి పేరుతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భూదందాలు చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా రాని అతను.. రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఆయనకు ఏమైనా తెలుసని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని మోసం చేసి ఎర్రెబెల్లి కోవర్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. మంత్రి అక్రమాల నిగ్గు తేలుస్తామని రేవంత్ హెచ్చరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి ఎర్రబెల్లి భూ ఆక్రమణలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని వివరించారు.

పాలకుర్తి నియోజకవర్గంలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించిన రేవంత్ రెడ్డి.. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. బుధవాం రోజు దేవరుప్పల నుంచి పాలకుర్తి వరకు 18 కిలోమీటర్ల మేర నడక సాగించిన రేవంత్ రెడ్డి.. ఈరోజు ఐనవోలు, ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు మీదగా వర్ధన్నపేట వరకు యాత్ర కొనసాగించనున్నారు. మార్గమధ్యలో ఆయా గ్రామస్థులను కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాలకుల 24 గంటల కరెంట్ పరిస్థికి గురించి తెలుసుకునేందుకు ఐనవోలులోని సబ్ స్టేషన్ ను సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. మార్గమధ్యంలో ఓ ముదిరాజ్ యువకుడు రేవంత్ రెడ్డి కోసం వండి తెచ్చిన భోజనాన్ని తిని తెగ మురిసిపోయారు. ఈ విషయాన్ని తాను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని చెప్పారు. 
   

నిన్నటి పాదయాత్రలో రుణమాఫీ చేస్తామని హామీ..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. హాత్ సే హాత్ జోడు టిపిసిసి రేవంత్ రెడ్డి పాదయాత్ర జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం నుండి పాదయాత్రకు జన నీరాజనం పడుతూ రేవంత్ రెడ్డిని మంగళహారతులు ఇచ్చి, వీర తిలకంతో ఆహ్వానం పలికారు. ఈ పాదయాత్ర దేవరుప్పుల ధర్మపురం విసునూరు గ్రామాలలో కల్లుగీత కార్మికులను, గొల్ల కురుమలను కలిశారు. అదేవిధంగా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ గురు సేవాలాల్ మహారాజ్ సీతల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకనాడు గ్యాస్ ధర 400 రూపాయలు ఉన్న ఇప్పుడు రూ.1130 పెంచిందని రోజువారి కూలీ సైతం నిత్యావసర వస్తువులకే ధరల కొనుగోలుకి కూలి సరిపోతుందని పలువురు ప్రజలు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు సామాన్య ప్రజలను మోసం చేస్తూ.. తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారని రేవంత్ ఆరోపంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, పేదలకు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గింపు, వంటగ్యాస్ ధర 500 కి ఇవ్వడం, ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయల అందించి ఇండ్ల నిర్మాణాలకు తోడ్పాటు అందించడం, కులవృత్తుల వారికి తోడ్పాటు అందించడం, గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ జయంతి వేడుకలకు ప్రభుత్వం చేయూతను అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget