IT raids on Bhatti Vikramarka house: ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంటిపై ఐటీ దాడులు - రహస్యంగా ఉంచారు - హరీష్ రావు సంచలన ఆరోపణలు
Harish Rao: ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని హరీష్ఆ రావు ఆరోపించారు. అక్కడ చాలా స్వాధీనం చేసుకున్నా బయటకు తెలియనివ్వలేదన్నారు.

Harish Rao alleges IT raids on Bhatti Vikramarka house in Delhi :తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలోని ఇంటిపై ఒక నెలకు ముందు ఆదాయపు పన్ను (IT) విభాగం దాడి చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్ రావు ఆరోపించారు. గురుగావ్లో భట్టి ఇంటితో పాటు అత్తమామలు ఉంటున్న ఇళ్లల్లో సోదాలు చేసి ఐటీ అధికారులు హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు తీసుకెళ్లారని అన్నారు. హరీశ్ రావు శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. భట్టి విక్రమార్క ఢిల్లీలోని ఇంటిపై ఐటీ దాడి జరిగినా, అది ప్రజలకు తెలియలేదన్నారు. BJP-కాంగ్రెస్ మధ్య ఎలాంటి ఒప్పందం ఉంటే ఇలా దాస్తారని ఆయన ప్రశ్నించారు.
హరీశ్ రావు ఆరోపణల్లో మరో కీలక అంశం, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ED దాడులు. 2024 సెప్టెంబర్ 27న ED, పొంగులేటి ఇంట్లోపాటి ప్రాంగణాలపై దాడి చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ దాడి జరిగినా, ED నుంచి అధికారిక ప్రకటన లేదని హరీశ్ విమర్శించారు. ‘ED దాడి తర్వాత కూడా ఎలాంటి స్టేట్మెంట్ లేదు. ఇది BJP-కాంగ్రెస్ మధ్య ఒప్పందానికి సంకేతమా?’ అని ప్రశ్నించారు. ED దాడిలో పొంగులేటి సంబంధిత వ్యక్తుల ఆస్తులు, డాక్యుమెంట్లు పట్టుకున్నట్లు సమాచారం, కానీ అధికారికంగా ఏమీ వెల్లడి కాలేదు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంతో తెలంగాణ ప్రభుత్వం ‘బిగ్ కాంట్రాక్టర్ బిల్లులు’ క్లియర్ చేసినట్లు హరీశ్ రావు ఆరోపించారు. ‘ఈ బిల్లులు ఎంత మొత్తం? ఎవరికి ప్రయోజనం? BJP-కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో డబ్బు పంచుకున్నారా?’ అని ప్రశ్నించారు. ‘వైట్ పేపర్ విడుదల చేసి ప్రజలకు వివరాలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
IT Raids on Dy CM Bhatti Vikramarka’s Delhi house were hidden - BRS MLA Harish Rao expose
— Naveena (@TheNaveena) November 8, 2025
IT raids happened at Dy CM's house in Delhi a month ago. At his in-law's house in Gurgaon, and hard disks and computers were seized. If BJP and Congress aren’t working together, why hide… pic.twitter.com/V3koAWQbVo
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించేందుకు హరీష్ రావు ఈ వివరాలు వెల్లడించారు. అయితే నిజంగా భట్టి విక్రమార్క అత్తమామలు గురుగావ్ లో నివాసం ఉంటారా.. వారి ఇంట్లో ఐటీ దాడులు జరిగాయా అన్నదానిపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేదు. ఒక వేళ ఉన్నా.. భట్టి విక్రమార్క కు అక్కడి ఐటీ దాడులతో సంబంధం ఏముంటుందన్న ప్రశ్న వస్తోంది. అయితే ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడతో రహస్యంగా ఉంచారని.. అది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఒప్పందం అని హరీష్ రావు ఆరోపించడానికి కారణం అయింది.




















