అన్వేషించండి

Telangana Govt Vs Governer : ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం.. బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?

దాడికి గురైన ఎంపీ అర్వింద్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు గవర్నర్ తమిళిశై. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇప్పుడు బీజేపీ ఎంపీకి గవర్నర్ ఫోన్ చేసి పరామర్శించడం కొత్త చర్చకు కారణం అవుతోంది.


తెలంగాణ ప్రభుత‌్వం, గవర్నర్ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా గవర్నర్ తమిళిశై  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఫోన్ చేశారు. రెండు రోజుల కిందట తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగింది. ఈ  దాడి ఘటనపై ఆరా తీశారు. దాడి వివరాలతో పాటు నిజామాబాద్ సీపీ, పోలీస్ ల తీరును గవర్నర్ కు ఎంపీ వివరించారు. పోలీసుల పర్యవేక్షణలో తన హత్యకు ప్లాన్ జరిగిందని, ముందస్తు సమాచారం ఇచ్చినా రౌడీ మూకలను అదుపు చేసే ప్రయత్నం జరగలేదని అర్వింద్ వివరించినట్లుగా తెలుస్తోంది. సొంత నియోజకవర్గంలో పోలీసులు కనీస భద్రత కల్పించలేదని గవర్నర్ కు ఎంపీ అర్వింద్ ఆరోపిస్తున్నారు. 

బీజేపీ ఎంపీకి గవర్నర్ నేరుగా ఫోన్ చేసి దాడి ఘటనపై ఆరా తీయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే రిపబ్లిక్ డే రోజున గవర్నర్‌తో కలిసి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. కనీసం మంత్రులను కూడా పంపలేదు.  సాధారణంగా గణతంత్ర దినోత్సవ  వేడుకల్ని పరేడ్‌ గ్రౌండ్‌ లేదా పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి మాత్రం రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. సాధారణంగా రాష్ట్ర ప్రగతిపై ప్రభుత్వం అందించే గణాంకాలను గవర్నర్‌ చదువుతుంటారు.  ప్రతీ చోటా అదే జరుగుతుంది. ఏపీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్.. కొత్త జిల్లాల గురించీ కూడా ప్రస్తావించారు. కానీ తెలంగాణ గవర్నర్ ప్రసంగం మాత్రం భిన్నంగా సాగింది. 

గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రధాని మోదీని రెండు సార్లు పొగిడారు. మోదీ దూరదృష్టి కారణంగా దేశం వివిధ రంగాల్లో దూసుకెళుతోందని ప్రశంసించారు. ప్రధాని నిరంతర శ్రమ వల్ల ప్రపంచంలోనే భారత్‌ను ఒక ముఖ్యమైన శక్తిగా పరిగణిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలకు మంత్రుల్ని కూడా పంపకపోవడం రాజ్‌భవన్‌తో  తెలంగాణ సర్కార్‌కు పెరిగిన దూరానికి సాక్ష్యంగా అంచనా వేస్తున్నారు. 

బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇంత కాలం తమిళిశై మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. రెండు , మూడు సార్లు అభినందించారు కూడా.  ఇప్పుడు బీజేపీతో యుద్ధం అనే స్ట్రాటజీని ఎంచుకున్న కేసీఆర్ దూరం పాటిస్తున్నట్లుగా భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే గవర్నర్ రాజకీయ దాడుల విషయంలో పరామర్శలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ముందు ముందు విభేదాలు తీవ్రమైతే గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మారే పరిస్థితి రావొచ్చంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget