అన్వేషించండి

Telangana Govt Vs Governer : ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం.. బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?

దాడికి గురైన ఎంపీ అర్వింద్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు గవర్నర్ తమిళిశై. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇప్పుడు బీజేపీ ఎంపీకి గవర్నర్ ఫోన్ చేసి పరామర్శించడం కొత్త చర్చకు కారణం అవుతోంది.


తెలంగాణ ప్రభుత‌్వం, గవర్నర్ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా గవర్నర్ తమిళిశై  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఫోన్ చేశారు. రెండు రోజుల కిందట తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగింది. ఈ  దాడి ఘటనపై ఆరా తీశారు. దాడి వివరాలతో పాటు నిజామాబాద్ సీపీ, పోలీస్ ల తీరును గవర్నర్ కు ఎంపీ వివరించారు. పోలీసుల పర్యవేక్షణలో తన హత్యకు ప్లాన్ జరిగిందని, ముందస్తు సమాచారం ఇచ్చినా రౌడీ మూకలను అదుపు చేసే ప్రయత్నం జరగలేదని అర్వింద్ వివరించినట్లుగా తెలుస్తోంది. సొంత నియోజకవర్గంలో పోలీసులు కనీస భద్రత కల్పించలేదని గవర్నర్ కు ఎంపీ అర్వింద్ ఆరోపిస్తున్నారు. 

బీజేపీ ఎంపీకి గవర్నర్ నేరుగా ఫోన్ చేసి దాడి ఘటనపై ఆరా తీయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే రిపబ్లిక్ డే రోజున గవర్నర్‌తో కలిసి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. కనీసం మంత్రులను కూడా పంపలేదు.  సాధారణంగా గణతంత్ర దినోత్సవ  వేడుకల్ని పరేడ్‌ గ్రౌండ్‌ లేదా పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి మాత్రం రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. సాధారణంగా రాష్ట్ర ప్రగతిపై ప్రభుత్వం అందించే గణాంకాలను గవర్నర్‌ చదువుతుంటారు.  ప్రతీ చోటా అదే జరుగుతుంది. ఏపీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్.. కొత్త జిల్లాల గురించీ కూడా ప్రస్తావించారు. కానీ తెలంగాణ గవర్నర్ ప్రసంగం మాత్రం భిన్నంగా సాగింది. 

గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రధాని మోదీని రెండు సార్లు పొగిడారు. మోదీ దూరదృష్టి కారణంగా దేశం వివిధ రంగాల్లో దూసుకెళుతోందని ప్రశంసించారు. ప్రధాని నిరంతర శ్రమ వల్ల ప్రపంచంలోనే భారత్‌ను ఒక ముఖ్యమైన శక్తిగా పరిగణిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలకు మంత్రుల్ని కూడా పంపకపోవడం రాజ్‌భవన్‌తో  తెలంగాణ సర్కార్‌కు పెరిగిన దూరానికి సాక్ష్యంగా అంచనా వేస్తున్నారు. 

బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇంత కాలం తమిళిశై మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. రెండు , మూడు సార్లు అభినందించారు కూడా.  ఇప్పుడు బీజేపీతో యుద్ధం అనే స్ట్రాటజీని ఎంచుకున్న కేసీఆర్ దూరం పాటిస్తున్నట్లుగా భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే గవర్నర్ రాజకీయ దాడుల విషయంలో పరామర్శలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ముందు ముందు విభేదాలు తీవ్రమైతే గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మారే పరిస్థితి రావొచ్చంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget