అన్వేషించండి

Clay Ganesh: 'పర్యావరణహిత మట్టి విగ్రహాలను పూజిద్దాం' - ఈసారి 3.50 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ, మండపాల ఏర్పాటులో ఈ రూల్స్ తప్పనిసరి!

Hyderabad News: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. ఈ ఏడాది 3.50 లక్షల మట్టి గణపయ్యలను పంపిణీ చేయనున్నట్లు మేయర్ వెల్లడించారు.

GHMC Mayor Distributed Clay Ganesh Idols In Hyderabad: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితం కోసం మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజలకు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె ఉద్యోగులు, సిబ్బందికి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని.. పర్యావరణం పట్ల ప్రజలను చైతన్య పరచడంలో భాగంగా జీహెచ్ఎంసీ ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జీహెచ్ఎంసీ ద్వారా 3.10 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 8 ఇంచుల సైజులో 2.70 లక్షలు, ఒక ఫీట్ సైజులో 30 వేలు, ఒకటిన్నర ఫీట్ సైజులో 10 వేల విగ్రహాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంతా మండపాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరేందుకు సిద్ధమవుతున్నారు. ఖైరతాబాద్‌లో భారీ గణపయ్య పూజలందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రధాన పట్టణాలతో పాటు వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్‌తో పాటు పల్లెల్లోనూ మండపాల సందడి నెలకొంది. అయితే, మండపాల ఏర్పాటుకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరని.. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఈ రూల్స్ తప్పనిసరి

  • మండపాల ఏర్పాటుకు ఉత్తమమైన వస్తువులు వాడాలి. విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు.
  • వర్షం పడినా, మండపాల వద్ద ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్నా తగు జాగ్రత్తలు చేపట్టాలి. మండపాల పైభాగం నీరు పడని పరదాలతో కప్పాలి.
  • విద్యుత్ కనెక్షన్లు, లైట్ల ఏర్పాటుకు నాణ్యమైన వాటిని వాడాలి. 
  • సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధిత డీఎస్పీ అనుమతులు కచ్చితంగా తీసుకోవాలి. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడదు.
  • మండపాల వద్ద మద్య నిషేధం అమలులో ఉంటుంది. మండపాల వద్ద ఎలాంటి లక్కీ డ్రా, జూదం నిర్వహించకూడదు.
  • మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఎలాంటి టపాసులు కాల్చకూడదు.
  • మండపాల వద్ద 24 గంటలు కనీసం ముగ్గురు వాలంటీర్లు ఉండాలి. వారి వివరాలు ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
  • అత్యవసర సమయాల్లో పోలీసులకు సమాచారం అందించాలి. 
  • భక్తులు సందర్శించే సమయాల్లో క్యూలైన్ విధానం అమలు చేయాలి. 

Also Read: In Pics: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలకు అంతా రెడీ, కొలువుదీరుతున్న గణనాథులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget