అన్వేషించండి

Jagadish Reddy: పవర్ కమిషన్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేఖ, ఏ నష్టం జరగలేదని వెల్లడి

Justice Narasimha Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన విద్యుత్‌ ప్లాంట్లు, విద్యుత్‌ కొనుగోళ్ల విషయంపై విచారణ జరుపుతోన్న జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ రాశారు.

Justice Narasimha Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish reddy)  మెయిల్ ద్వారా లేఖ రాశారు.  శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాసిన లేఖపై వివరణ ఇచ్చారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహా రెడ్డి  మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై లేఖ ద్వారా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు.  

రాష్ట్రం విడిపోయిన సమయంలో తెలంగాణలో ఉన్న విద్యుత్‌ అవసరాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతో నాటి  ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. ఆనాటి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం - 2003 ప్రకారం పీజీసీఐఎల్‌ నిబంధనలకు లోబడే ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ఒప్పందాలు దోహదపడ్డాయే గానీ, వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగలేదన్నారు.  

కేసీఆర్ పై నిందలు మోపాలన్న ఉద్దేశంతోనే.. 
ఛత్తీస్‌గఢ్ నుండి 3.90 పైసలకు విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వ రంగ సంస్థల నుండి రూ.17కు విద్యుత్ కొనుగోలు చేసే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ విషయంలో ఇరుకున పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు కుటిల యత్నాలు చేశారని తెలిపారు. ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుని సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నట్లు ఆరోపించారు.  పీజీసీఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్థతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్నారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా 4.90 పైసలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేశాయని జగదీష్ రెడ్డి వివరించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను నిందించాలన్న ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

డిమాండ్ మేరకే ప్రాజెక్టుల నిర్మాణం
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.  భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామనడంతోనే  కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం బీహెచ్‌ఈఎల్‌ కు అప్పగించినట్లు జగదీష్ రెడ్డి చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్‌, పెరుగుతోన్న విద్యుత్‌ డిమాండ్లను దృష్టిలో పెట్టుకొనే నల్గొండ జిల్లా దామరచర్లలో 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 

పవర్ కమిషన్ తప్పుడు సంకేతాలిస్తుంది
కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే బొగ్గు కేటాయింపు ఉందన్నారు. ప్రతి పవర్ ప్లాంట్ కచ్చితంగా 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్రం రూల్ పెట్టిందన్నారు.  సింగరేణి బొగ్గు ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తాము ఒప్పుకోలేదన్నారు.  కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్కువ రేటుకు ఇస్తే.. ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు ఇచ్చిందన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లలో రూ.6000 కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఛత్తీస్‌గఢ్ నుండి కేసీఆర్ ఒక్కరే ఒప్పందం కుదుర్చుకోలేదని..  కేసీఆర్, రమణ్ సింగ్ ల మధ్య  విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగిందన్నారు. విచారణ కమిషన్ సరిగా లేదని తను రాసిన లేఖలో పేర్కొన్నట్లు తాను రాసిన లేఖలో పేర్కొన్నట్లు జగదీష్ రెడ్డి తెలిపారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget