అన్వేషించండి

Jagadish Reddy: పవర్ కమిషన్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేఖ, ఏ నష్టం జరగలేదని వెల్లడి

Justice Narasimha Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన విద్యుత్‌ ప్లాంట్లు, విద్యుత్‌ కొనుగోళ్ల విషయంపై విచారణ జరుపుతోన్న జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ రాశారు.

Justice Narasimha Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish reddy)  మెయిల్ ద్వారా లేఖ రాశారు.  శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాసిన లేఖపై వివరణ ఇచ్చారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహా రెడ్డి  మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై లేఖ ద్వారా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు.  

రాష్ట్రం విడిపోయిన సమయంలో తెలంగాణలో ఉన్న విద్యుత్‌ అవసరాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతో నాటి  ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. ఆనాటి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం - 2003 ప్రకారం పీజీసీఐఎల్‌ నిబంధనలకు లోబడే ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ఒప్పందాలు దోహదపడ్డాయే గానీ, వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగలేదన్నారు.  

కేసీఆర్ పై నిందలు మోపాలన్న ఉద్దేశంతోనే.. 
ఛత్తీస్‌గఢ్ నుండి 3.90 పైసలకు విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వ రంగ సంస్థల నుండి రూ.17కు విద్యుత్ కొనుగోలు చేసే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ విషయంలో ఇరుకున పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు కుటిల యత్నాలు చేశారని తెలిపారు. ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుని సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నట్లు ఆరోపించారు.  పీజీసీఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్థతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్నారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా 4.90 పైసలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేశాయని జగదీష్ రెడ్డి వివరించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను నిందించాలన్న ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

డిమాండ్ మేరకే ప్రాజెక్టుల నిర్మాణం
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.  భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామనడంతోనే  కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం బీహెచ్‌ఈఎల్‌ కు అప్పగించినట్లు జగదీష్ రెడ్డి చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్‌, పెరుగుతోన్న విద్యుత్‌ డిమాండ్లను దృష్టిలో పెట్టుకొనే నల్గొండ జిల్లా దామరచర్లలో 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 

పవర్ కమిషన్ తప్పుడు సంకేతాలిస్తుంది
కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే బొగ్గు కేటాయింపు ఉందన్నారు. ప్రతి పవర్ ప్లాంట్ కచ్చితంగా 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్రం రూల్ పెట్టిందన్నారు.  సింగరేణి బొగ్గు ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తాము ఒప్పుకోలేదన్నారు.  కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్కువ రేటుకు ఇస్తే.. ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు ఇచ్చిందన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లలో రూ.6000 కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఛత్తీస్‌గఢ్ నుండి కేసీఆర్ ఒక్కరే ఒప్పందం కుదుర్చుకోలేదని..  కేసీఆర్, రమణ్ సింగ్ ల మధ్య  విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగిందన్నారు. విచారణ కమిషన్ సరిగా లేదని తను రాసిన లేఖలో పేర్కొన్నట్లు తాను రాసిన లేఖలో పేర్కొన్నట్లు జగదీష్ రెడ్డి తెలిపారు.   

టాప్ హెడ్ లైన్స్

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget