అన్వేషించండి

Adilabad Students: గ్రేట్ - ఇంగ్లీష్ బుక్ రాసిన ఐదో తరగతి చిన్నారులు, ఎక్కడంటే?

Fifth Class Students: ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రోత్సాహంతో ఐదో తరగతి చిన్నారులు ఏకంగా ఇంగ్లీష్ బుక్ నే రాశారు.

Fifth Calss Students Wrote English Book: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఓ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో ఏకంగా ఐదో తరగతిలోనే ఇంగ్లీష్ పుస్తకం రాశారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు అందించిన ప్రోత్సాహంతో ఆంగ్ల కథల సంపుటిని రాశారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 11న ఎన్టీఆర్ గార్డెన్ (NTR Garden) లో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించడానికి బాల సాహిత్య రచయితలు డా.వీఆర్ శర్మ, డా.గిరిపెల్లి అశోక్ ల నుంచి అనుమతి లభించింది.

కథలతో ఆసక్తి

ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్ గూడలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు బుక గంగయ్య వినూత్న బోధన పద్ధతులతో పిల్లలతో చేసిన ఈ ప్రయత్నం అందరికీ స్పూర్తిగా నిలుస్తోంది. విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించే ఆలోచనతో గంగయ్య రోజువారీ పాఠ్యాంశాల బోధనలతో భాగంగా ఆటపాటలతో, వివిధ పాత్రలతో కథలను వివరించడం, వాటిని తిరిగి రాయించడంతో పిల్లల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఐదో తరగతి విద్యార్థులు 18 మంది ఇంగ్లీష్ లో కథలు రాశారు. వాటిలో తొలుత కొన్ని తప్పులను గుర్తించిన గంగయ్య.. అన్వయ, వ్యాకరణ దోషాలను గుర్తించి వాటిని సరి చేసేలా హోం వర్క్ గా విద్యార్థులతో రాయించడంతో వారిలో పరిణతి వచ్చింది. తర్వాత వారు రాసిన వాటన్నింటినీ ఓ దగ్గర చేర్చి, పూర్తిగా తప్పులు లేకుండా చేసి.. 'ద స్టోరీస్ ఆఫ్ యాపల్ గూడ చిల్డ్రన్' పేరిట పుస్తకాన్ని ముద్రించారు. ఈ కథలన్నీ నేటి తరానికి దిశానిర్దేశం చేసేలా ఉంటాయని గంగయ్య తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు తురాటి గంగన్న అందించిన ప్రోత్సాహం, విద్యార్థుల ఆసక్తితో పుస్తకం తీసుకురావడం ఆనందంగా ఉందని అన్నారు. ఆధునిక పేర్లతో పాత్రలకు ప్రాణం పోసి చిన్న పదాలతో సంభాషణలను చక్కగా రాశారని వివరించారు.

బుక్ ఫెయిర్

అటు, 36వ హైదరాబాద్ జాతీయ పుస్తకాల ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నుంచి కొలువుదీరనుంది. ఈ ఫెయిర్ లో 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరూ గౌరీశంకర్ తెలిపారు. పుస్తక ప్రదర్శన సాయంత్రం 5 గంటలకు ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని అన్నారు. ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకూ పుస్తక ప్రదర్శన ఉంటుందని.. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకూ ఉంటుందని చెప్పారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరును, వేదికకు సంస్కృత పండితుడు రవ్వా శ్రీహరి పేర్లను నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. 'బాలప్రపంచం' పేరుతో పిల్లలకు పెయింటింగ్, క్విజ్, సంగీతం తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also Read: BRS : గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ - మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్ధీన్ కాంగ్రెస్‌లో చేరిక !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
KTR On Congress Ruling: తెలంగాణపై దరిద్రం దండయాత్ర.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్, కేటీఆర్ ఫైర్
తెలంగాణపై దరిద్రం దండయాత్ర.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్, కేటీఆర్ ఫైర్
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
Hydra AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భారీ ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
Embed widget