అన్వేషించండి

Adilabad Students: గ్రేట్ - ఇంగ్లీష్ బుక్ రాసిన ఐదో తరగతి చిన్నారులు, ఎక్కడంటే?

Fifth Class Students: ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రోత్సాహంతో ఐదో తరగతి చిన్నారులు ఏకంగా ఇంగ్లీష్ బుక్ నే రాశారు.

Fifth Calss Students Wrote English Book: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఓ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో ఏకంగా ఐదో తరగతిలోనే ఇంగ్లీష్ పుస్తకం రాశారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు అందించిన ప్రోత్సాహంతో ఆంగ్ల కథల సంపుటిని రాశారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 11న ఎన్టీఆర్ గార్డెన్ (NTR Garden) లో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించడానికి బాల సాహిత్య రచయితలు డా.వీఆర్ శర్మ, డా.గిరిపెల్లి అశోక్ ల నుంచి అనుమతి లభించింది.

కథలతో ఆసక్తి

ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్ గూడలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు బుక గంగయ్య వినూత్న బోధన పద్ధతులతో పిల్లలతో చేసిన ఈ ప్రయత్నం అందరికీ స్పూర్తిగా నిలుస్తోంది. విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించే ఆలోచనతో గంగయ్య రోజువారీ పాఠ్యాంశాల బోధనలతో భాగంగా ఆటపాటలతో, వివిధ పాత్రలతో కథలను వివరించడం, వాటిని తిరిగి రాయించడంతో పిల్లల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఐదో తరగతి విద్యార్థులు 18 మంది ఇంగ్లీష్ లో కథలు రాశారు. వాటిలో తొలుత కొన్ని తప్పులను గుర్తించిన గంగయ్య.. అన్వయ, వ్యాకరణ దోషాలను గుర్తించి వాటిని సరి చేసేలా హోం వర్క్ గా విద్యార్థులతో రాయించడంతో వారిలో పరిణతి వచ్చింది. తర్వాత వారు రాసిన వాటన్నింటినీ ఓ దగ్గర చేర్చి, పూర్తిగా తప్పులు లేకుండా చేసి.. 'ద స్టోరీస్ ఆఫ్ యాపల్ గూడ చిల్డ్రన్' పేరిట పుస్తకాన్ని ముద్రించారు. ఈ కథలన్నీ నేటి తరానికి దిశానిర్దేశం చేసేలా ఉంటాయని గంగయ్య తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు తురాటి గంగన్న అందించిన ప్రోత్సాహం, విద్యార్థుల ఆసక్తితో పుస్తకం తీసుకురావడం ఆనందంగా ఉందని అన్నారు. ఆధునిక పేర్లతో పాత్రలకు ప్రాణం పోసి చిన్న పదాలతో సంభాషణలను చక్కగా రాశారని వివరించారు.

బుక్ ఫెయిర్

అటు, 36వ హైదరాబాద్ జాతీయ పుస్తకాల ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నుంచి కొలువుదీరనుంది. ఈ ఫెయిర్ లో 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరూ గౌరీశంకర్ తెలిపారు. పుస్తక ప్రదర్శన సాయంత్రం 5 గంటలకు ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని అన్నారు. ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకూ పుస్తక ప్రదర్శన ఉంటుందని.. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకూ ఉంటుందని చెప్పారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరును, వేదికకు సంస్కృత పండితుడు రవ్వా శ్రీహరి పేర్లను నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. 'బాలప్రపంచం' పేరుతో పిల్లలకు పెయింటింగ్, క్విజ్, సంగీతం తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also Read: BRS : గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ - మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్ధీన్ కాంగ్రెస్‌లో చేరిక !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget