అన్వేషించండి

Smita Sabharwal 'స్మితా సభర్వాల్ ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ అన్ ఫిట్' - తనతో సివిల్స్ రాయాలంటూ మాజీ బ్యూరోక్రాట్ బాల లత సవాల్

Telangana News: ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ దివ్యాంగులపై చేసిన పోస్టుపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యలపై మాజీ బ్యూరోక్రాట్, ఐఏఎస్ ట్రైనర్ బాల లత తీవ్రంగా స్పందించారు.

Bala Latha Comments On Smitha Sabharwal Post: ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) దివ్యాంగులపై చేసిన ట్విట్టర్ పోస్టుపై.. మాజీ బ్యూరోక్రాట్, ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాల లత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో స్మితా సభర్వాల్ పెట్టిన పోస్టు.. ఆమె వ్యక్తిగతమా.? లేక ప్రభుత్వ విధానమా.? అని ప్రశ్నించారు. ఆమె అభిప్రాయాలు దివ్యాంగులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. సీనియర్ అధికారిణి అయ్యి ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వ్యక్తుల గురించి ట్వీట్ చేయడం విచారకరం అని పేర్కొన్నారు. స్మితా సభర్వాల్ ఫిజికల్లీ ఫిట్.. మెంటల్లీ అన్ ఫిట్ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. 'స్మితా సభర్వాల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారు. దివ్యాంగులను దూరం పెట్టాలని స్మిత సభర్వాల్ చెబుతున్నారు. రేవంత్ సర్కారు తొలి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇచ్చింది. దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చట్టరీత్యా నేరం. ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. 24 గంటల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఆమెపై సీఎం రేవంత్, సీఎస్ శాంతి కుమారి తగిన చర్యలు తీసుకోవాలి.' అని బాల లత డిమాండ్ చేశారు.

స్మితా సభర్వాల్‌కు సవాల్

'స్మితా సభర్వాల్ మీరు రాజీనామా చేసి రండి.. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దాం. మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం' అంటూ బాల లత ఆమెకు సవాల్ విసిరారు. 'ఆమె ట్వీట్‌తో దివ్యాంగ సమాజం తీవ్ర అవమానానికి గురైంది. ఐఏఎస్ అధికారులకు అందం కాదు మానసిక సామర్థ్యం కావాలి. తెలంగాణలో చాలా మంది అధికారులకు పని లేకపోవడం వల్లే అనవసర విషయాలపై ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. మానసిక పరిస్థితి సరిగా లేని వారే ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారనిపిస్తుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆమె వ్యాఖ్యలను ఖండించాలి. ఆమె 24 గంటల్లోపు దివ్యాంగ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే జైపాల్‌రెడ్డి స్మృతివనం వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగుతాం. ఇలాంటి అధికారులు ఉండబట్టే నా ఉద్యోగాన్ని వదులుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకే హైదరాబాద్‌కు వచ్చాను. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు సైతం స్పందించి స్మితా సభర్వాల్ వ్యాఖ్యలను ఖండించాలి.' అని పిలుపునిచ్చారు.

వివాదం రేపిన ట్వీట్ ఇదే!

'ఆలిండియా సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా అవసరమా.?' అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తాజాగా ట్వీట్ చేశారు. పూజా ఖేడ్కర్‌ ఇష్యూపై స్పందించిన ఆమె తన వ్యక్తిగత ఎక్స్‌ ఖాతాలో.. 'ఈ చర్చ మరింత విస్తృతం అవుతున్న వేళ దివ్యాంగులను గౌరవిస్తూనే... విమానయాన సంస్థల్లో  పైలట్‌గా దివ్యాంగులను తీసుకుంటారా? అలాంటి వ్యక్తి సర్జన్‌గా ఉంటే మీరు ఆ వ్యక్తిపై నమ్మకంతో ఉంటారా? ఆల్‌ ఇండియా సర్వీసులైనా ఐఏఎఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్ అంటేనే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లాలి. గంటలు గంటలు పనిచేయాలి. ప్రయాణాలు చేయాలి. ప్రజల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఓపికతో పాటు శారీరక దృఢత్వం చాలా అవసరం. ఇలాంటి వాటికి దివ్యాంగుల కోటా అవసరమా అని నేను అడుగుతున్నాను' అని ఓ పోస్టు పెట్టారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు సైతం స్మితా సభర్వాల్‌ ట్వీట్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపుతూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read: Smita Sabharwal : తగ్గేదే లేదంటున్న స్మితా సభర్వాల్ - సివిల్స్ డిసేబుల్ కోటాపై మరోసారి కామెంట్స్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget