అన్వేషించండి

DK Aruna: ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగురవేయాలి - డీకే అరుణ

DK Aruna: హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా బీజేపీ నేతలు కార్యాలయంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ప్రతి ఇంటిపై జెండా ఎగుర వేయాలని సూచించారు. 

DK Aruna: హైదారాబాద్ బీజేపీ జాతీయ కార్యాలయంలో.. నేతలంతా కలిసి రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో పర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా కృశి చేస్తామని డీకే అరుణ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా సదస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా.. సంబురాల్లో ప్రజలను భాగ స్వామ్యం చేయాలని ప్రధాని మోదీ నిర్మయించినట్లు తెలిపారు. మన దేశభక్తిని, జాతీయ భావాన్ని అందరం క‌లిసి చాటి చెప్పాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, బూతు స్థాయి వరకు ఈ కార్యక్రమం జరుపుకోవాలి డీకే ఆరుణ అ్ననారు. ప్రతి ఇంటి పైనా త్రివర్ణ పతాకం ఎగుర వేయాలని చెప్పారు.

వందేమాతరం అంటూ ప్రచారం చేస్తాం..

ఆగష్టు 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కార్యక్రమంపై ప్రచారం చేస్తామన్నారు. మన దేశ  జెండా గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 20 కోట్ల ఇళ్లపై జెండాలు ఎగుర వేయించాలని లక్ష్యం గా పెట్టుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఏపీలో కూడా అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమం లొ భాగస్వామ్యం కావాలని సూచించారు. ఆగష్టు 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గ్రామీణ ప్రజలే లక్ష్యంగా రఘుపతి రాఘవ రాజారాం, వందేమాతరం అంటూ ప్రచారం చేస్తామని చెప్పారు. ఆగష్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజులు ప్రతి ఇంటి పైనా జాతీయ జెండా రెపరెపలాడాలన్నారు. ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థ లు, పరిశ్రమలు.. ఇలా ప్రతీ డాబా పైన జెండా ఎగరాలని వివరించారు. విద్యార్దుల్లో దేశ భక్తి పెంపొందించేలా పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీం.. వీటి కోసమే పని ‌చేస్తుందని డీకే ఆరుణ వ్యాఖ్యానించారు. మన జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేసి.. నివాళులతో స్మరించుకోవాలన్నారు. అలాగే ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. మీరు చేపట్టే కార్యక్రమాన్నిసోషల్ మీడియాలో పోస్ట్ చేయమని సలహా ఇచ్చారు. వీటి కోసం ఒక లింక్ కూడా అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. బీజేపీ... కుటుంబ పాలనకు వ్యతిరేకమని వివరించారు. చాలా మంది బేజీపీలో చేరేందుకు వస్తున్నారు...

విభజన సందర్భంగా ముంపు మండలాలను ఏపీలో కలిపారని.. కానీ కేసీఆర్ ఇప్పుడు రాజకీయ కారణాలతో మాట్లాడుతున్నారని డీకే అరుణ మండి పడ్డారు. అక్కడి ప్రజలు తెలంగాణలో‌ కలపాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని... అక్కడ కీసన వసతులు లేవు, కనీస అవసరాలు తీర్చ లేదని ఆమె పేర్కొన్నారు. అందుకే ప్రజల నుంచి డిమాండ్ లు పెరుగుతున్నాయని చెప్పారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారన్నారు. పెద్ద నాయకుల నుండి కింది స్థాయి నాయకుల వరకు అంతా ఉన్నారని చెప్పారు. ఏ సమయంలో చేర్చుకోవాలో మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించారు. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

షర్మిల ఏపీలో పార్టీ ఎందుకు పెట్టలేదు?

కాళేశ్వరం విషయంలో జగన్, కేసిఆర్ పై మంచి అండర్ స్టాండింగ్ ఉందని విమర్శించారు. ఓట్లు సమయంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారని దుయ్యబట్టారు. సెంటిమెంట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నారని.. వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారని చెప్పారు. గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదని, పని చేయ లేదని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సెంటిమెంట్ ఉన్నంత వరకు... ఆంధ్రా వాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించరన్నారు. షర్మిల ఏపీలోనే పోటీ చేయవచ్చు కదా... తెలంగాణ లో ఎందుకు పార్టీ పెట్టారని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో కూడా షర్మిల ఏపీలోనే ప్రచారం చేశారని గుర్తు చేశారు. అప్పుడు తెలంగాణ లో ఆమె ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎపి లో ఎందుకు పోటీ‌ చేయడం లేదో ఆమే చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Sridhar Babu Morphed Videos: మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
Akhil Raj: ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్
ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget