అన్వేషించండి

Disha Encounter Case: తుది ఘట్టానికి దిశ ఎన్ కౌంటర్ కేసు, మరో రెండు వాయిదాల్లో తీర్పు వచ్చే అవకాశం!

Disha Encounter Case: దిశ ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి, ఎన్కౌంటర్ బాధితుల తరపున లాయర్ కృష్ణమాచార్య వాదనలు వినిపించారు. 

Disha Encounter Case: దిశ ఎన్ కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి, ఎన్ కౌంటర్ బాధితుల తరపున లాయర్ కృష్ణమాచార్య కోర్టులో వాదనలు వినిపించారు. ఇపు వర్గాల వైపు వాదనలు విన్న హైకోర్టు ఈ కేసును జూన్ 21కి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే బాధితుల తరఫున వాదించిన లాయర్ కృష్ణమాచార్య మాట్లాడుతూ.. ఎన్కౌంటర్ లో పాల్గొన్న 10 మంది పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఎన్కౌంటర్ సమయంలో సీపీగా ఉన్న సజ్జనార్ కూడా నోటీస్ అందుకున్నట్లు చెప్పారు. నోటీసులో తమ వాదన వినిపించాలని హైకోర్టు పేర్కొంది. మరోవైపు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై 302 పెట్టాలని హైకోర్టును కోరినట్లు వెల్లడించారు. దీంతో పాటే బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా కోరినట్లు లాయర్ కృష్ణమాచార్య స్పష్టం చేశారు. నష్టపరిహారం అంశంలో ధర్మాసనం సానుకూలంగా ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. దిశ కేసు తుది ఘట్టానికి చేరుకున్నట్టు తెలుస్తోందని.. మరో రెండు వాయిదాల్లో తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు కేసును జూన్ 21కి వాయిదా వేసింది. 

అసలేం జరిగిందంటే..? 
దిశ హత్య, ఆ తరువాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంతా సంచలనం సృష్టించింది. అయితే నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రజల  నుండి అంతలా వ్యతిరేకత రానప్పటికీ మానహక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. డిసెంబర్ 19వ తేది 2019 లో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసారు. సీన్ రీకనస్ట్రక్షన్ లో భాగంగా నిందితులను స్పాట్ కు తీసుకెళ్తే , పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో ఎన్ కౌంటర్ చే ామంటూ పోలీసులు తరుపున వాదనలు వినిపిస్తుంటే, ఇదింతా ఫేక్ ఎన్ కౌంటర్ అంటూ సుప్రీం కోర్టు నియమంచిన జుడిషియల్ కమీషన్ సుప్రీకోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ తెలంగాణా హైకోర్టులో జరపాలంటూ సుప్రీం ఆదేశించడంతో ఇప్పటికే దిశ ఎన్ కౌంటర్ లో బాధితుల తరుపున వాదనలు ముగిశాయి.

తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు అనేక కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దిశ ఎన్ కౌంటర్ వ్యవహారంపై ప్రభుత్వం తరుపు వాదనలను వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ తీరుపై తీవ్ర అంసతృప్తిని వక్తం చేసినట్లు సమాచారం.   మొత్తం ఐదు ఇంప్లీడ్ పిటీషన్లపై అంగీకరించిన  హైకోర్టు , అప్పటి షాద్ నగర్ సీఐ శ్రీధర్ తోపాటు పోలీస్ ఆఫీసర్స్ సంఘం , రిటైర్డ్ పొలీస్ ఆఫీసర్స్, దిశా కుంటుంబం తరుపు న్యాయవాదుల వాదనలు విన్నది .        

ఈ కేసులో షాద్ నగర్ సీఐ శ్రీధర్ తరుపున వాదించిన సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ రఘురామ్, జుడీషియల్ కమీషన్ నివేదికను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. మరోపు సిఐ శ్రీదర్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రెండో ఎఫ్ ఐఆర్ అవసరం లేదన్నారు.క మీషన్ రిపోర్ట్ ను కేవలం ఒక్క ఆధారంగా చూడాలని,  రిపోర్ట్ లో ఉన్నది ఉన్నట్లు ఆర్డర్ ఇవ్వాలని  లేదన్నారు.  గతంలో ఎన్ కౌంటర్ వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదిక పై సెషన్స్ కోర్టులో విచారణ జరపాలని దిశ కుటుంబసభ్యుల తరుపు న్యాయవాది కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Embed widget