అన్వేషించండి

Bandhu KCR : పేద కుటుంబాలన్నింటికీ రూ. పది ల‌క్షలు ! సాధ్యమా ? రాజకీయమా?

" మాకేంటి " అంటున్న ఇతర వర్గాలకూ కేసీఆర్ వరం ప్రకటించారు. "బంధు" పథకాన్ని పేదలందరికీ వర్తింప చేస్తామన్నారు. అయితే ఇది సాధ్యమా..? రాజకీయ జిమ్మిక్కా..? అనే అనుమానం మాత్రం అందరిలోనూ ఏర్పడుతోంది.


తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఓసీనా.. బీసీనా..మైనార్టీనా అనే తేడా లేకుండా అందరికీ "బంధు" పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అంటే ఒక్కో పేద కుటుంబానికి రూ. పది లక్షలు ఇస్తారన్నమాట. ఆ సొమ్ముతో వారు ఉపాధి పొందవచ్చు.  వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ఒక్క దళితులకే కాదు అందరికీ  "బంధు" పథకం అమలు చేస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. కానీ వారిలోనే ఇది సాధ్యమా అన్న అనుమానం కూడా ప్రారంభమయింది. 

"బంధు"  టెన్షన్‌లో ఉన్న టీఆర్ఎస్ నేతలకు రిలీఫ్..!

ప్రతి పేద కుటుంబానికి  "బంధు"  పథకం వర్తింప చేస్తామన్న కేసీఆర్ ప్రకటన టీఆర్ఎస్ నేతలకు రిలీఫ్ లాంటిది. ఎందుకంటే దళిత బంధు ప్రకటించి అమలు చేయడం ప్రారంభిచిన తర్వాత దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ నేతలకు ఆ పథకం సెగ తగిలింది. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమకూ పథకం వస్తుంది కదా అని కొంత మంది మాట్లాడటం ప్రారంభించారు. మరికొంత మంది తమకు ఎప్పుడు ఇస్తారని ధర్నాలు ప్రారంభించారు. దళితులకు మాత్రమేనా  మేము పేదలం కాదా అని ఇతర వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలంతా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వీరందరికి రిలీఫ్ ఇచ్చేలా కేసీఆర్.. పేద కుటుంబాలన్నింటికీ పథకం వర్తింప చేస్తామని ప్రకటించారు. దీంతో నియోజకవర్గాలకు వెళ్లే టీఆర్ఎస్ నేతలు అందరికీ పథకం వర్తిస్తుందని .. భరోసా ఇచ్చి.. ప్రశాంతంగా ఉండనున్నారు.
Bandhu KCR : పేద కుటుంబాలన్నింటికీ రూ. పది ల‌క్షలు ! సాధ్యమా ? రాజకీయమా?

ఎన్నికల్లోపు అమలు చేయకపోతే కష్టమని ఆందోళన..!

టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైతే కాస్త మనశ్శాంతి పొందుతారు కానీ.. ముందు ముందు చిక్కులు తప్పవన్న భయం వారిలో వెంటాడుతోంది. దీనికి కారణం ప్రజలు ఎంతో కాలం ఎదురు చూడరని.. అమలు చేయాలని ఒత్తిడి చేస్తారని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం దళిత బంధు అమలు చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 21వేల దళిత కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందు కోసం మూడు విడతలుగా ఇప్పటికి రూ. 1200 కోట్లు విడుదల చేశారు. ఇంకా హుజురాబాద్‌లోనే అమలు చేయాలంటే రూ. వెయ్యి కోట్లు విడుదల చేయాలి. ఆగస్టు 16వ తేదీన దళిత బంధు ప్రారంభోత్సవ వేదిక మీద కేసీఆర్ ఒకటి రెండు నెలల్లో హుజురాబాద్‌లో దళిత బంధు అమలు పూర్తి చేస్తామన్నారు. మూడు , నాలుగేళ్లలో రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. అంటే.. ఒక్క దళిత బంధు అమలు చేయడానికే మూడు నాలుగేళ్ల పడుతుంది. కానీ రెండేళ్లలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ లెక్కన చూస్తే ఎన్నికల్లోపు దళిత బంధు కూడా పూర్తిగా అమలు కాదని టీఆర్ఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికల్లోపు దళితులకైనా పూర్తిగా అమలు చేయకపోతే ఇతర వర్గాల్లో నమ్మకం ఏర్పడటం కష్టమని భావిస్తున్నారు. నిజానికి దళిత బంధు పథకానికి రూ. రెండు వేల కోట్లు కేటాయించడమే ప్రభుత్వానికి కష్టంగా ఉంది. హుజూరాబాద్‌కు అవసరమైన నిధుల కోసం ఎన్నో పనులు ఆపేయాల్సి వస్తోంది. అలాంటిది రాష్ట్రం మొత్తం అమలు చేయాలంటే బడ్జెట్ మొత్తం పెట్టినా సరిపోదని ఆర్థిక నిపుణుల లెక్కలేస్తున్నారు.
Bandhu KCR : పేద కుటుంబాలన్నింటికీ రూ. పది ల‌క్షలు ! సాధ్యమా ? రాజకీయమా?

ఇప్పుడే ఇవ్వాలని ప్రజల్ని రెచ్చగొట్టే వ్యూహంలో రాజకీయ పార్టీలు..!

రూ. పది లక్షలంటే చిన్న మొత్తం కాదు. పేద కుటుంబాలకు జీవితం సెటిల్ అయిపోతుంది. అందుకే ఈ పథకం తమకు ఎప్పుడు అందుతుందా అని వర్గాలకు అతీతంగా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. వీరి ఆశల్ని ప్రతిపక్ష పార్టీలు  ప్రభుత్వంపై వ్యతిరేకతగా మార్చే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పుడే పథకం అమలు చేయాలని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించేలా వ్యూహరచన చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో దళిత, గిరిజన దండోరా పేరుతో ప్రతీ జిల్లాకు తిరిగి చెప్పాల్సినదంతా చెబుతున్నారు. మీ సొమ్మే మీకిస్తున్నారు తెచ్చుకోవాలని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా దరఖాస్తుల ఉద్యమాన్నే ప్రారంభించారు. పథకం ప్రజలకు  ఇప్పటికే ప్రతిపక్షాలు దళితకుటుంబాలకే ఇవ్వరని.. పది మందికి ఇచ్చి ఓట్లేయించుకుని మోసం చేస్తారని విమర్శలు చేస్తున్నాయి. దానికి గ్రేటర్ ఎన్నికలకు ముందు వరద సాయం పేరుతో రూ. పదివేలు కొంత మందికి ఇచ్చి ఎన్నికలయిపోయిన తర్వాత పట్టించుకోని అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వం తీరుపై అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నారు.
Bandhu KCR : పేద కుటుంబాలన్నింటికీ రూ. పది ల‌క్షలు ! సాధ్యమా ? రాజకీయమా?

"బంధు" ప్లాన్ బూమరాంగ్ అయితే కష్టమే..! 

తాము అధికారంలోకి వస్తే ఫలానా మేలు చేస్తాం అని చెప్పి రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి. అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ గెలిపిస్తే ఫలానా చేస్తాం అని చెప్పడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారుగా ఎందుకు చేయలేదనే ప్రశ్న వస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు అదే పరిస్థితి ఉంది. "బంధు" ను అమలు చేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కనీసం సగం అమలు చేసినా ప్రజల్లో సానుకూలత వస్తుంది. లేకపోతే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget