Proffessor Saibaba: ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
Hyderabad News: ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. 10 రోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

Proffessor Saibaba Passed Away: ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన 10 రోజుల క్రితం నిమ్స్లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. ఈ క్రమంలో దాదాపు 9 ఏళ్లు ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి 5వ తేదీన బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంతో నాగపూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. మానవహక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా సాయిబాబా గుర్తింపు పొందారు.
Also Read: Revanth Reddy : సొంత ఊరు దశ మార్చేసిన రేవంత్ రెడ్డి - ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారంటే ?
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు























