అన్వేషించండి

Niranjan Reddy : గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా?- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై మంత్రి నిరంజ్ రెడ్డి ఫైర్

Niranjan Reddy On Piyush Goyal : తెలంగాణ రైతుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు.

Niranjan Reddy On Piyush Goyal : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరితంగా మాట్లాడారని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షీయూష్ గోయల్ తో సమావేశం అనంతరం దిల్లీలోని తెలంగాణ భవన్ లో మంత్రులు, ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు. సమావేశానికి ముందే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారన్నారు. తెలంగాణ రైతులను తప్పుదారి పట్టించేందుకు పీయూష్ గోయల్ ప్రయత్నించారన్నారు. రాష్ట్రంలో పండిన పంట కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని మంత్రి అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కేంద్రానికి అవగాహన లేదన్నారు. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు కూడా కేంద్రానికి తేడా తెలియడం లేదన్నారు. వడ్డను వడ్ల రూపంలో సేకరించాలని డిమాండ్ చేశారు. గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు.

ప్రధాని క్షమాపణలు చెప్పిన విషయం మర్చిపోయారా?

కేంద్రం దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి, దాదాపు 700 మంది చావుకు కారణమైందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆఖరికి రైతులకు ప్రధాని క్షమాణలు చెప్పి చట్టాలు వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కొనిపిస్తాం మీరు వరి వేయండని రైతులను మోసం చేశారన్నారు. తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించామన్నారు. కేంద్రంలో పేదల ప్రభుత్వం కాదని, వ్యాపారాత్మక ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు నీళ్లు, కరెంటు ఇచ్చి, రైతుబంధు, రైతు బీమా పథకాలు ద్వారా పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు రైతు వ్యతిరేక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. 

నాన్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది 

2022కి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం పండించిన ధాన్యాన్ని కొనడంలేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి కేంద్రం క్షమాపణలు చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని మంత్రి అన్నారు.  మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టిన విషయం మర్చిపోయారా అని మంత్రి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక సమాఖ్య స్ఫూర్తి మర్చిపోయారని విమర్శించారు. జీడీపీ పెంపుదలలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. నిరుద్యోగాన్ని నియంత్రించడంలోనూ కేంద్రం విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో లేనిచోట ఇతర పార్టీల ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతున్నది వాస్తవం అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Congress North vs South Strategy: రేవంత్ దక్షిణాదివాదం - ఉత్తరాదిన కాంగ్రెస్‌కు ఇబ్బంది కాదా?
రేవంత్ దక్షిణాదివాదం - ఉత్తరాదిన కాంగ్రెస్‌కు ఇబ్బంది కాదా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటకం ముగిసింది.. ఇక తెలంగాణ కేబినెట్ పంచాయతీ - మార్పు చేర్పుల సిగ్నల్ రేవంత్‌కు అందిందా?
కర్ణాటకం ముగిసింది.. ఇక తెలంగాణ కేబినెట్ పంచాయతీ - మార్పు చేర్పుల సిగ్నల్ రేవంత్‌కు అందిందా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Smoking With Tea : టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget