అన్వేషించండి

Raja Shyamala Yagam : మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న కేసీఆర్! కానీ చిన్న మార్పు!

Raja Shyamala Yagam : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈసారి వేదిక మాత్రం మారింది. అసలు ఆ సెంటిమెంట్ ఏంటి? మారిన వేదిక ఏంటి?

 Raja Shyamala Yagam : ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం సాయంత్రం దిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. వారం రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. అయితే ప్రతి పర్యటన లాంటిది కాదు ఇది. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2018 డిసెంబర్ 13నే ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేశారు కేసీఆర్. అంటే రేపటికి నాలుగేళ్లు పూర్తై.... రెండో టర్మ్ లో ఆఖరి ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇవాళ దిల్లీకి వెళ్తున్న కేసీఆర్... రేపు,ఎల్లుండి అక్కడే రాజశ్యామల యజ్ఞం చేయబోతున్నారు. 2018 నవంబర్ లో అంటే ముందస్తు ఎన్నికలకు సుమారు 2 వారాల ముందు కేసీఆర్ తన ఫాంహౌస్ లో ఇదే యజ్ఞాన్ని నిర్వహించారు. అప్పుడు 88 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కొన్ని చేరికలతో కలుపుకుని అసెంబ్లీలో బలాన్ని 104కు పెంచుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఏడాదికి అంటే డిసెంబర్ 2019లో 5 రోజుల పాటు సహస్ర మహాచండి యజ్ఞాన్ని నిర్వహించారు. 

జాతీయ రాజకీయాలకు సిద్ధం 

ఇప్పుడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలకు సిద్ధమవుతుండటమే కాక... ఎన్నికలకు ఇంకో సంవత్సరం ఉందనగా మరోసారి ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఇది కేసీఆర్ కు సెంటిమెంట్ లాంటిదని, ఈసారి కూడా అధికారంలోకి రావడం కోసమే ఈ యజ్ఞం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే జాతీయ రాజకీయాలను, BRS విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఈసారి యజ్ఞ వేదికను దిల్లీకి మార్చినట్టు తెలుస్తోంది.  2018లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాల ముందు కేసీఆర్ రాజశ్యామల యజ్ఞం నిర్వహించారు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు మరోసారి వెళ్తారని విపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు కొందరు చర్చించుకుంటున్నారు. 2018లో ఎన్నికలకు ముందు యజ్ఞం చేసినట్టుగానే ఇప్పుడూ చేస్తున్నారని, అంటే త్వరలోనే ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదని అంతా అనుకుంటున్నారు. 

స్వార్థం కోసం యాగమని ప్రతిపక్షాల విమర్శలు 

అయితే కేసీఆర్ చేయబోతున్న ఈ రాజశ్యామల యాగంపై అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ఇది స్వార్థం కోసం చేస్తున్న యాగం అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ముందుగా తెలంగాణ ఎన్నికలు పూర్తి చేసుకుంటే ఆ తర్వాత దేశంలో మిగతా రాష్ట్రాలపై దృష్టి పెట్టొచ్చనేది కేసీఆర్ ప్రణాళికగా చెప్పుకుంటున్నారు. మరో 4-5 నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ జేడీఎస్ కు BRS మద్దతు తెలపడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంతే కాక ఆంధ్రప్రదేశ్ లోనూ BRS విస్తరణపై కాన్సట్రేట్ చేశారని, విజయవాడలో కార్యాలయం కోసం భూముల కోసం చూస్తున్నట్టు సమాచారం. సో ఓవరాల్ గా చూసుకుంటే రేపు, ఎల్లుండి దిల్లీలో చేయబోతున్న రాజశ్యామల యాగం పూర్తైన తర్వాత ఎన్నికల దిశగా పరిణామాలు వేగంగా మారే అవకాశాలు లేకపోలేదు.  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ రాజశ్యామల యాగం ఏర్పాట్లను పర్యవేక్షించారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth : 99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
Israel Iran War: యుద్ధం మొదలైన మరుసటిరోజు అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ? నివేదికలో సంచలన విషయాలు
యుద్ధం మొదలైన మరుసటిరోజు అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ? నివేదిక సంచలనం
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Finn Allen Century: 33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Underwater Tunnel In India: నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
Embed widget