అన్వేషించండి

Telangana Panchayat Elections 2025: సర్పంచ్‌గా నెగ్గిన చనిపోయిన వ్యక్తి, కొడుకుపై తండ్రి.. అత్తపై కోడలు విజయం.. పంచాయతీ ఎన్నికల్లో సిత్రాలు..

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో దశలోనూ ఫలితాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. అత్త మీద కోడలు విజయం, కుమారుడిపై తండ్రి గెలుపొందడం లాంటి విశేషాలున్నాయి.

Telangana Panchayat Elections 2025 | హైదరాబాద్: తెలంగాణలో జరిగిన రెండు విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుదారులు అధిక స్థానాల్లో గెలుపొందగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలుడగా 415 గ్రామ సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 3,911 సర్పంచులు, 29,917 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం ఓటర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటు వేసి ఫలితాలు డిసైడ్ చేశారు.

రెండో విడతలో 85.86 శాతం పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ 11న జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28 శాతం కన్నా ఇది 1.58 శాతం ఎక్కువ.  ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్‌ పార్టీ 2,297 సర్పంచ్, బీఆర్ఎస్ 1,191, బీజేపీ 257, ఇతరులు 578 సర్పంచ్ స్థానాలు నెగ్గారు. వీరిలో సీపీఐ మద్దతుతో 28 మంది, సీపీఎం మద్దతుదారులు 33 చోట్ల గెలుపొందారు. చాలాచోట్ల ఇద్దరు అభ్యర్థులకు ఓకే సంఖ్యలో ఓట్లు రావడంతో డ్రా తీయడం, లేక టాస్ వేయడం ద్వారా విజేతను నిర్ణయించారు. పలుచోట్ల కేవలం ఒక్క ఓటు తేడాతో విజేతగా నిలిచి సంబరాలు చేసుకున్నారు.

తప్పిన ఏకగ్రీవం.. ఒకే ఒక్క ఓటుతో గెలుపు
వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆశాలపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. గ్రామంలో ఏకైక ఎస్సీ ఓటర్‌గా ఉన్న కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవం అవుతారని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆమె ఏకగ్రీవం అని అంతా భావించారు. అయితే, చివరి క్షణంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక ఎస్సీ యువతి పోటీలోకి రావడంతో ఏకగ్రీవం తప్పింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఈ పోరులో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన కొంగర మల్లమ్మకు 824 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థికి 823 ఓట్లు రాగా, మొదట ఏకగ్రీవం అనుకున్న  మల్లమ్మ చివరకు ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు.

తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..
తెలంగాణలో డిసెంబర్ 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు 2,334 మంది గెలుపొందగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారులు 1,69 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 189 మంది సర్పంచులుగా గెలుపొందారు. ఇతరులు 538 మంది సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం తెలిసిందే.

సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గిన చనిపోయిన వ్యక్తి
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్ పల్లిలో 9 ఓట్ల తేడాతో సర్పంచ్ గా చల్కి రాజు గెలుపొందారు. అయితే కాంగ్రెస్ మద్దతు తెలిపిన చల్కిరాజు ఇటీవల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఇక్కడ మరోసారి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. 

అత్తపై విజయం సాధించిన కోడలు
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఘన్ శ్యాందాస్ నగర్‌లో అత్త నర్సమ్మపై కోడలు రమ 18 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

ఎన్నికల్లో నెగ్గిన చనిపోయిన అభ్యర్థి
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండం మంచర్లగూడెంలో 8వ వార్డు నుంచి పోటీ చేసిన పల్లె లత వార్డు సభ్యురాలిగా నెగ్గారు. డిసెంబర్ 7న ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుండెపోటు రావంతో లత మృతిచెందారు.

సర్పంచ్ ఎన్నికల్లో ఓటమితో అభ్యర్థి మృతి
ఆ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటమిచెందిన బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందారు. మునుగోడు మండలం కిష్టాపురంలో సర్పంచ్ ఎన్నికల్లో చెన్నగోని కాటంరాజ్ ఓడిపోయారు. తీవ్ర మనస్తాపానికి లోనన కాటంరాజ్ కు ఛాతీలో నొప్పి రావడంతో చనిపోయారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామం చెర్లపాలెంలో రెబల్ క్యాండిడెట్ మహేందర్ విజయం సాధించారు.

కుమారుడ్ని ఓడించిన తండ్రి.. మూడోసారి సర్పంచ్‌గా
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ పంచాయతీ ఎన్నికల్లో కుమారుడిపై తండ్రి విజయం సాధించారు. కుమారుడు వెంకటేశ్ పై తండ్రి రామకిష్టయ్య గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుదారు అయిన రామకిష్టయ్య మూడోసారి ఝాన్సీలింగాపూర్ సర్పంచ్‌గా విజయం సాధించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget