అన్వేషించండి

Telangana Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యం.. 27 జిల్లాల్లో హస్తం, 3 జిల్లాల్లో BRS హవా

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో దశలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దుతుదారుల అధిక స్థానాల్లో విజయం సాధించారు.

Telangana Panchayat Elections 2025 | హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా, రెండో విడతలోనూ అదే సీన్ రిపీట్ అయింది. రెండో విడతలో మొత్తం 4,333 సర్పంచ్ స్థానాలలో కొన్ని ఏకగ్రీవం కాగా 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి విజేతల్ని ప్రకటిస్తూ వస్తున్నారు.

కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం
ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల వరకు వెలువడిన ఫలితాల చూస్తే, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థులు 2,297 (ఏకగ్రీవాలతో కలిపి) స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ మద్దతుతో 1191 సర్పంచ్ స్థానాలు, బీజేపీ మద్దతుతో 257 స్థానాలు, ఇతరులు 578 స్థానాల్లో గెలుపొందారు. సీపీఐ మద్దతుదారులు 28 చోట్ల, సీపీఎం మద్దతుతో 33 మంది గెలుపొందారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశలో మొత్తం 4,333 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్ధానాలు, 38,350 వార్డు సభ్యుల పదవులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, ఇందులో 415 గ్రామ సర్పంచ్,  8,307 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మరో ఐదు గ్రామాలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు, ఇంకో 2 గ్రామాలు, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. మిగిలిన 3,911 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో 85.86 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడత 84.28 శాతం కంటే 1.58 శాతం ఎక్కువ పోలింగ్ నమోదైంది. మొత్తం 57,22,465 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియలో 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

27 జిల్లాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం..
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు.

3 జిల్లాల్లో బీఆర్ఎస్, ఒక జిల్లాలో బీజేపీ.. 
కుమురంభీం, సిద్దిపేట, జనగామలలో బీఆర్ఎస్ మద్దతుదారులు అధిక స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు నిర్మల్‌ జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించారు. ఆదిలాబాద్‌లోనూ రెండో స్థానంలో నిలిచారు. 

ఈ దశలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తి మండలం మెంటెపల్లిలో 104 ఏళ్ల మాణిక్యమ్మ వీల్ చైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఓచోట రష్యా నుంచి వచ్చి యువతి ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లికి చెందిన మైసాని నర్సింలు తనకు చూపు లేకపోవడంతో భార్య సాయంతో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భర్త కోసం ఓటు వేసిన మల్లవ్వ రెండో చేతి వేలికి సైతం అధికారులు సిరా వేశారు.

తొలి విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా..
తెలంగాణలో డిసెంబర్ 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు 2,425 మంది గెలుపొందగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారులు 1,68 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 189 మంది సర్పంచులుగా గెలుపొందారు. ఇతరులు 448 మంది సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం తెలిసిందే.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget