అన్వేషించండి

Cyberabad Police : పొరపాటున వేరే సెంటర్లకు గ్రూప్ 1 అభ్యర్థులు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏంచేశారంటే!

Cyberabad Police : గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయం అందించారు. పొరపాటును వేరే పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చిన అభ్యర్థులను సరైన ఎగ్జామ్స్ సెంటర్స్ కు చేర్చారు.

Cyberabad Police : తెలంగాణలో ఇవాళ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించి పొరపాటున వేరే పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చిన అభ్యర్థులను  గుర్తించి సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సకాలంలో వారిని పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. గ్రూప్-1 పరీక్షల కోసం వచ్చిన ఓ యువతి పొరపాటున కూకట్ పల్లి ప్రగతి డిగ్రీ కాలేజీ వద్దకు వెళ్లింది. ఉన్న కొద్ది సమయంలో తన సెంటర్ కి ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్న యువతిని సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్  పోలీస్ బైక్ రైడర్ పై  సరైన సమయానికి చైతన్య డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్ సెంటర్ కు చేర్చారు. దీంతో తనను పరీక్ష కేంద్రానికి సరైన సమయానికి తీసుకువచ్చిన సైబరాబాద్ పోలీసులకు ఆ యువతి కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే కుకట్ పల్లి ట్రాఫిక్ సీఐ నగేష్ వేరే పరీక్ష కేంద్రానికి పొరపాటున వచ్చిన ఇద్దరు విద్యార్థులను సరైన సమయానికి తమ పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు మొబైల్ వాహనంలో ఇద్దరు విద్యార్థులను పరీక్ష కేంద్రాల వద్దకు సరైన టైంకు చేర్చారు.

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ 

తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తం 75శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 

బయో మెట్రిక్ సమస్యలు  

ఉదయం పదిన్నర గంటలకు మొదలైన గ్రూప్-1 ఎగ్జామ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింది. సెంటర్ల దగ్గర చివరి నిమిషంలో అభ్యర్థులు హడావుడి పడ్డారు. కొన్ని సెంటర్ల దగ్గర బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడంలో ఆలస్యమైంది. ట్యాబ్ లలో ఛార్జింగ్ లేకపోవడం, మరికొన్ని స్లోగా ఉండడంతో ఈ ప్రాసెస్ లేట్ అయింది. చెప్పిన టైంలోపల ఎగ్జామ్ సెంటర్ గేట్ లోనికి వెళ్లిన వారిని అనుమతించారు. 10.15 నిమిషాలకు సెంటర్ లోపలికి వెళ్లాలన్న నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడ్డారు. 

15 నిమిషాల లేట్ రూల్ 

లోపల తల్లులు ఎగ్జామ్ రాస్తుంటే... బయట వారి పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ ఆడిస్తూ కనిపించారు. మరోవైపు వర్షం కారణంగా కొందరు అభ్యర్థులు లేట్ అయ్యారు. మరికొందరికి సెంటర్ అడ్రస్ లు సరిగా దొరకకపోవడంతో ఆలస్యమయ్యారు. దీంతో వారందరినీ తిప్పి పంపారు. కొందరు అభ్యర్థులైతే కొన్ని సెకన్ల గ్యాప్ తో ఎగ్జామ్ మిస్ అయ్యారు.  గతంలో 1 నిమిషం నిబంధన ఉండేదని, ఇప్పుడు 15 నిమిషాల లేట్ రూల్ తీసుకొచ్చారని ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు అంటున్నారు. తాము టైంకే వచ్చినా లోపలికి అనుమతించలేదని ఆబిడ్స్ స్టాన్లీ కాలేజ్ దగ్గర అభ్యర్థులు వాపోయారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget