అన్వేషించండి

Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !

Congress party : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం తమ ప్రభుత్వం ఇచ్చిన జీవో 29ను సమర్థించుకుంటూంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాత్రం విపక్షాల వాయిస్ వినిపించడం సంచలనంగా మారింది.

Congress party own MLC Theenmar Mallanna Gave Shock to Party :  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీసీ సంఘాలతో కలిసి గవర్నర్ ను కలిశారు.జీవో 29పై ఫిర్యాదు చేశారు. ఈ జీవో వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. జీవో 29 ప్రకారం పరీక్షలు నిర్వహించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పరీక్షలు ముందుకు వెళ్లేవి కాదని స్పష్టం చేశారు. దీనికి ఖచ్చితంగా అడ్డుకట్ట పడుతుందన్నారు. EWS రిజర్వేషన్లు అక్రమం అని.. గవర్నర్‌కు నివేదించామని మా నాయకడు రాహుల్ గాంధీ కులాలవారీగా జనాభాను బట్టి అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారన్నారు. ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్లు, బీసీల హక్కులను కాలరాయడానికి ఎవరు ప్రయత్నించినా అది మా పార్టీ అయినా సరే వదిలి పెట్టబోమని ఆయన హెచ్చరించారు.

తీన్మార్ మల్లన్న ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన ఎప్పుడూ పార్టీ పాలసీని పట్టించుకోవడం లేదు. తన సొంత అభిప్రాయాల మేరకే రాజకీయం చేస్తున్నారు.తాజాగా జీవో 29 విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతా ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తోంది. ఈ  జీవో వల్ల ఎవరికీ అన్యాయం జరగదని పైగా.. బడుగు, బలహీన వర్గాలకే మేలు అని వాదిస్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న మాత్రం .. ఈ జీవో వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని.. ఓ వర్గం వారికి ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారని ఆరోపిస్తూ సొంత పార్టీ పై బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.                        

గ్రూప్‌ 1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ- జోక్యం చేసుకోలేమని స్పష్టం

జీవో 29ను ఎప్పుడో ఫిబ్రవరిలో ఇస్తే ఇప్పుడే పరక్షల ముందు ఎందుకు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతా రాజకీయ పరమైన కుట్ర అని వారంటున్నారు. న్యాయస్థానాల్లోనూ ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పులు రావడంతో పరీక్షలను అనుకున్న సమయానికే నిర్వహిస్తున్నారు.  అయితే ఈ పరీక్షలు నిలబడేవి కూడా కావని తీన్మార్ మల్లన్న అంటున్నారు. మల్లన్న తీరు వల్ల.. పరీక్షలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ పై విపక్షాలు విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది.                        

వాలంటీర్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!

తీన్మార్ మల్లన్న గతంలో సొంతగా రాజకీయం చేసేవారు. కేసీఆర్ హయాంలో అనేక కేసులు నమోదు కావడంతో జైలుకెళ్లారు. బెయిల్ వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలు చోట్ల నుంచి టిక్కెట్ ఆశించినా దక్కలేదు. చివరికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు నేరుగా సీఎం రేవంత్ ను.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కాంగ్రెస్ పార్టీలోనే సంచలనంగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
Allu Arjun : నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
TSPSC Group 1 Exam: తెలంగాణలో గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం- అభ్యర్థులకు ఆల్‌ ద బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం- అభ్యర్థులకు ఆల్‌ ద బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి
Railway Rules: రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది
రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియోDonald Trump works at McDonald's | స్వయంగా ఫ్రైంచ్ ఫ్రైస్ వేయించి అమ్మిన ట్రంప్ | ABP DesamOwaisi on Palestine: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదనవయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
Allu Arjun : నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
TSPSC Group 1 Exam: తెలంగాణలో గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం- అభ్యర్థులకు ఆల్‌ ద బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం- అభ్యర్థులకు ఆల్‌ ద బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి
Railway Rules: రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది
రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది
Katrina Kaif : 'ఓ మగాడికి ఇంతకు మించి లైఫ్​లో ఏమి కావాలి?' కత్రినా కైఫ్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇవే
'ఓ మగాడికి ఇంతకు మించి లైఫ్​లో ఏమి కావాలి?' కత్రినా కైఫ్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇవే
Naga Chaitanya and Sobhita Dhulipala : నాగచైతన్య శోభిత పెళ్లి పనులు షురూ... పసుపు దంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కొత్త పెళ్లి కూతురు 
నాగచైతన్య శోభిత పెళ్లి పనులు షురూ... పసుపు దంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కొత్త పెళ్లి కూతురు 
Telangana Group 1 Exams: గ్రూప్‌ 1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ- జోక్యం చేసుకోలేమని స్పష్టం
గ్రూప్‌ 1 పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ- జోక్యం చేసుకోలేమని స్పష్టం
Raa Macha Song  : నిన్న జపాన్, నేడు కొరియా,  ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్న ‘రా మచ్చా‘ సాంగ్
నిన్న జపాన్, నేడు కొరియా, ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతున్న ‘రా మచ్చా‘ సాంగ్
Embed widget