అన్వేషించండి

Congress Vs BRS : 13న తెలంగాణ రాజకీయాల్లో జల యుద్ధం- కాంగ్రెస్, బీజేపీ ఏం చేయబోతున్నాయంటే ?

Water War : మంగళవారం కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యేక రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ నల్లగొండలో బహిరంగసభ నిర్వహిస్తూండగా.. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసింది.

Water politics between Congress BRS: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతూండంతో తెలంగాణ రాజకీయ పార్టీలు మరోసారి కార్యకలాపాల్ని వేగం పెంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వేగంగా  కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించడానికి బీఆర్ఎస్  కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని అందుకుంది. కాంగ్రెస్ పోటీగా చలో మేడిగడ్డ కు పిలుపునిచ్చింది. 

13న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్ని మేడిగడ్డుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12తో ముగియనున్నాయి. 12న అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల, చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ అప్రప్రియేషన్ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.          

11వ తేదీన సీఎల్పీ సమావేశం 

అంతకంటే ముందు 11వ తేదీన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇరిగేషన్ చర్చపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. 13వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు.  ఈనెల 13వ తేదీన ఉదయం 10.30 గంటలకు 119 ఎమ్మెల్యేలు, 40మంది శాసన మండలి సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం తీసుకెళ్తుందని అసెంబ్లీలో రేవంత్ ప్రకటించారు.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా 12న అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చలో పాల్గొనాలని, 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని కోరుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాక.. ప్రతిపక్ష నేతను ప్రత్యేకంగా ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అనుకున్నారు. అయితే మేడిగడ్డ సందర్శనకు ఉత్తమ్ ఆహ్వానిస్తారని  తెలియడంతో ఆయన ఆగిపోయారని అంటున్నారు                 

13న నల్లగొండలో బీఆర్ఎస్ సభ                       
 
13వ తేదీన బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కట్ పల్లి -అద్దంకి హైవేకి ఆనుకునిఉన్న విశాలమైన స్థలంలో సభను నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ తలపెట్టిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తేదీని ఖరారు చేసింది. దీంతో తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రాజెక్టుల  అంశంపై రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరినట్లయింది.                                   

టాప్ హెడ్ లైన్స్

SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget