అన్వేషించండి

CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన

Adilabad: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

CM Revanth Reddy visit to Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కీలకమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బజార్‌హత్నూర్ మండలం  పిప్రి  గ్రామంలో నిర్వహించిన  ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక  బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు  1,238 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. ఆదిలాబాద్‌ను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతం ఇకపై వెనుకబడిన జిల్లాగా ఉండబోదని సీఎం స్పష్టం చేశారు.
 
ముఖ్యమంత్రి తన పర్యటనను బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనంతో ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కోసం 225 కోట్లతో  చేపట్టిన విస్తరణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. తన మనవడికి అక్కడే అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పిప్రి సభలో మాట్లాడారు. నిర్మల్, బోథ్ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపన చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా, రాజకీయాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసమే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
 
ఆదిలాబాద్ రైతాంగం చిరకాల స్వప్నమైన  తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అలాగే, ఆదిలాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద  పారిశ్రామిక కేంద్రంగా  తీర్చిదిద్దేందుకు భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, తద్వారా స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
 
జిల్లా ప్రజల కలల ప్రాజెక్టు అయిన  ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు  గురించి ముఖ్యమంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పటికే అనుమతులు సాధించామని, వీలైతే  జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శిలాఫలకం వేస్తామని ప్రకటించారు. దీనితో పాటు ఆదిలాబాద్‌లో ఒక  యూనివర్సిటీ  ఏర్పాటుకు భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే దానికి కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రతి రెండు నెలలకోసారి జిల్లాకు వచ్చి పనుల పురోగతిని పర్యవేక్షిస్తానని చెప్పారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,  10,000 కోట్లతో అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటికే 5,400 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని ధైర్యంగా చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, తాము పాలకులం కాదు ప్రజల సేవకులమని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: జూన్ 2న ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇండ్ల పండుగకు శ్రీకారం
జూన్ 2న ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇండ్ల పండుగకు శ్రీకారం
Breaking News: కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay: ఎక్కడైనా కొడుకును తండ్రి పోలీసులకు అప్పగిస్తాడా? ఫాల్తుగాళ్లు నాపై దుష్ప్రచారం చేపిస్తున్నారు: బండి సంజయ్
ఎక్కడైనా కొడుకును తండ్రి పోలీసులకు అప్పగిస్తాడా? ఫాల్తుగాళ్లు నాపై దుష్ప్రచారం చేపిస్తున్నారు: బండి సంజయ్
PM Surya Ghar Yojana: విద్యుత్ బిల్లు ఆదాతో పాటు ఆదాయం.. రూ.78 వేల వరకు సబ్సిడీ.. పీఎం సూర్య ఘర్ స్కీమ్ పూర్తి వివరాలు ఇవే!
విద్యుత్ బిల్లు ఆదాతో పాటు ఆదాయం.. రూ.78 వేల వరకు సబ్సిడీ.. పీఎం సూర్య ఘర్ స్కీమ్ పూర్తి వివరాలు ఇవే!
Advertisement

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
AP Green Energy: రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Caste Census 2027: కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
FD Rates 2026: బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ ఎఫ్‌డీల కండీషన్లు మరిచిపోవద్దు
బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ FDల కండీషన్లు మరిచిపోవద్దు
Modi In Italy: మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
Ebola Virus : ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
He Man Telugu Trailer : హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
Embed widget