అన్వేషించండి

KTR: మహిళా కమిషన్ ముందు విచారణకు కేటీఆర్ - ఇరువర్గాల పోటా పోటీ నినాదాలు, తీవ్ర ఉద్రిక్తత

Hyderabad News: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

KTR Attended Infront Of The Women Commission: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలపై చేసిన వ్యాఖ్యల క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్‌లోని (Hyderabad) తెలంగాణ భవన్ (Telangana Bhawan) నుంచి మహిళా నేతలతో కలిసి బయల్దేరిన ఆయన.. ట్యాంక్ బండ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, పోలీసులు కేవలం కేటీఆర్‌ను మాత్రమే లోపలికి అనుమతించారు. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, నేతలను అడ్డుకోగా వాగ్వాదం చోటు చేసుకుంది. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో అక్కడకు కాంగ్రెస్ మహిళా నేతలు సైతం చేరుకుని పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

'కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి'

మహిళా లోకాన్ని కేటీఆర్ అవమానించారని.. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, ఇతర నేతలు డిమాండ్ చేశారు. బుద్ధభవన్ మహిళా కమిషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోటాపోటీ నినాదాలు, ఆందోళనలతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మహిళా నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. 

అసలు కారణం ఇదే..

తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సుల్లో కుట్లు, అల్లికలు, అల్లం - వెల్లుల్లి వలవడం వంటి పనులు చేసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో కుట్లు, అల్లికలు తాము వద్దనట్లేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారని.. ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బస్సుల సంఖ్య పెంచాలని మాత్రమే తాము కోరుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. కాగా, ఇప్పటికే తన వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణ చెప్పారు. 

కేటీఆర్ సంచలన ట్వీట్

కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులున్నాయని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని తెలిపారు. ఎంపీ ఎన్నికల వేళ నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులెవరని ప్రశ్నించారు. 'హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాలకు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయి. వాల్మీకి స్కాంకు సంబంధించి రాష్ట్రంలో సిట్, సీఐడీ సోదాలు జరిగాయి. ఈ వార్తలు బయటకు రాకుండా అణచివేశారు. రూ.90 కోట్ల అవినీతి జరిగిందని కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలుతుందని కర్ణాటక మంత్రి సతీశ్ అన్నారు. ఆయన అలా ఎందుకన్నారు.?. ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు.?' అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.

Also Read: Telangana: తెలంగాణ‌లో రూ. 300 ల‌కే ఇంట‌ర్నెట్, కేబుల్ టీవీ ప్ర‌సారాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget