అన్వేషించండి

Telangana సీఎం రేవంత్ తెరవాల్సింది కాంగ్రెస్ గేట్లు కాదు, ప్రాజెక్టు గేట్లు- లక్షల రైతులతో సెక్రటేరియట్ ముట్టడి: హరీష్ రావు

Harish Rao News: రేవంత్ తెరవాల్సింది కాంగ్రెస్ గేట్లు కాదు, ప్రాజెక్టు గేట్లు అని.. నష్టపోయిన పంటలు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వకపోతే లక్షల రైతులతో సెక్రటేరియట్ ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు.

Harish Rao Demands Congress Govt to implement Guranties to Farmers: హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తెరవాల్సింది కాంగ్రెస్ పార్టీ గేట్లు కాదు, రైతుల పంట పొలాలకు నీళ్ల కోసం ప్రాజెక్టు గేట్లు తెరవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) రైతులకు అండగా ఉంటుందని, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులు వెళ్లి రైతుల (Telangana Farmers) సమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేసినట్లు హరీష్ రావు తెలిపారు. దేశంలోనే తొలిసారి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ (Telangan Former CM KCR) అని కొనియాడారు. రైతు బీమా పథకం దేశంలో, ప్రపంచంలో మరెక్కడా లేదని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేసిందన్నారు. దురదృష్టవశాత్తూ రైతు చనిపోతే వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5 లక్షల రైతు బీమా కేసీఆర్ తెచ్చారని గుర్తుచేశారు. 

రైతులకు ఎకరానికి 25 వేల ఆర్థికసాయం
బీఆర్ఎస్ తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఎండిపోయిన, అకాల వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు సూచించారు. రైతులకు నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.25 వేలు ఆర్టికసాయం చేసి వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ప్రకృతి విపత్తుల కిందకు వస్తుందని, దీనికి ఎలక్షన్ కోడ్ లాంటివి అడ్డంకి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు నేటికీ రైతు బంధు అందలేదని, మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీకి రైతులు అంటే అసలు ఇష్టం ఉందని రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. కరువు పరిస్థితిని సమీక్షించాలని కేంద్రం అడగదు, మరోవైపు రాష్ట్రం పట్టించుకోవడం లేదు. మధ్యలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ చేరికలపై ఫోకస్ చేస్తోంది. కానీ రైతుల కన్నీళ్లు తుడవడం, వారికి సాగునీళ్లు, కరెంట్ ఇవ్వడంపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి.. కరువు వల్ల, అకాల వర్షాలు, ఇతర కారణాలతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి వారికి ఎకరానికి రూ.25 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ అప్పులు తిరిగి చెల్లించకూడదని, మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే బీఆర్ఎస్ దృష్టికి తీసుకొస్తే తాము అండగా ఉంటామన్నారు. అసెంబ్లీలోనూ ఈ విషయంపై కోట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలపై దిగి రాకపోతే, లక్షలాది మంది రైతులతో సెక్రటేరియల్ ముట్టడికి వెనుకాడమని హెచ్చరించారు. మిమ్మల్ని ఇంతలా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో అన్నదాతలు కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు.

అధికారం కోసం ఓకే.. ఇక మారరా!
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు సోషల్ మీడియాను వాడుకుని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ నేతల తీరు మారలేదు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలను అమలు చేయడం కాదు, కేసీఆర్ అమలు చేసిన పాత పథకాలను కూడా అమలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదంటూ మండిప్డారు. నాణ్యమైన కరెంట్ లేదు, కాలువలకు నీళ్లు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా ఊసే లేదని.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు వడ్లు వస్తున్నాయి, హామీ ఇచ్చినట్లుగా మద్దతు ధరతో పాటుగా క్వింటాల్ కు రూ.500 బోనస్ కలిపి కొనుగోలు చేయాలని.. ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Embed widget