అన్వేషించండి

KTR News: వాల్మీకీ స్కామ్​ గురించి మేం చెప్పిందే నిజమైంది: కేటీఆర్

Valmiki Scam : వాల్మీకీ స్కామ్‌ పైసలే కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్ము వాడుకున్న నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు.

KTR : కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన వాల్మీకి స్కామ్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మేమన్నదే నిజమైందని అన్నారు. వాల్మీకీ స్కామ్‌ పైసలే తెలంగాణ కాంగ్రెస్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని కేటీఆర్ మరోసారి ఆరోపించారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన చార్జిషీట్‌లో పేర్కొందని తెలిపారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారి మళ్లాయని ఆయన ఆరోపించారు. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించిందన్నారు. వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌ అని తేల్చారు.

కాంగ్రెస్ నేతలే కీలకం
తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్‌ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు.  ఇతనికి సంబంధించిన వ్యాపారాల్లోనూ ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు పార్టనర్ లుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారనేది నిర్వివాదంగా పేర్కొన్నారు.  దర్యాప్తు సంస్థలు వాల్మీకీ స్కామ్‌ నిజాలు నిగ్గుతేల్చాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

5114 పేజీల ఛార్జిషీట్
ప్రచారం అవుతున్న రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా దాదాపు రూ. 20 కోట్ల నగదు బండిల్స్ వాడినట్లు కాంగ్రెస్ మాజీ మంత్రి బి.నాగేంద్ర వ్యక్తిగత సహాయకుడు విజయ్ కుమార్ గౌడ్ మొబైల్ ఫోన్ వివరాలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. 5,114 పేజీలతో కూడిన చార్జ్ షీట్‌లో 15 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. నాగేంద్ర, సత్యనారాయణ వర్మ (హైదరాబాద్), ఎటకారి సత్యనారాయణ (తెలంగాణ), జెజి పద్మనాభ (కార్పొరేషన్ మాజీ ఎండీ)తో పాటు మరో 20 మంది ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలు చేసినట్లు నివేదిక పేర్కొంది. వాల్మీకి కార్పొరేషన్ ఎండీగా పద్మనాభం నియామకంతో కుట్రకు తెర లేచింది. ప్రధాన నిందితుడు నాగేంద్ర ఇతర అనుమానితులతో, సన్నిహితులతో ఏకాంత సమావేశాలు నిర్వహించి, కొత్త బ్యాంకు ఖాతా తెరిచి డబ్బు జమ చేయాలని పద్మనాభంను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయం వెలుపల సమావేశం జరిగిందని చార్జిషీట్ పేర్కొంది, “నాగేంద్ర,  అతని సహచరులు చేసిన పెద్ద నగదు డిపాజిట్లు ఉన్నాయి. వాటిని వివరించడంలో మాజీ మంత్రి విఫలమయ్యారు. కుట్ర చేయడం, సాక్ష్యాధారాల ధ్వంసం చేయడం, నిధుల దుర్వినియోగంలో నాగేంద్ర కీలక పాత్ర పోషించినట్లు చార్జిషీట్ వెల్లడించింది. జూలై 12న నాగేంద్ర నివాసం, వాల్మీకి కార్పొరేషన్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో దాడులు చేసి ఇడి అరెస్టు చేసింది.

ఆత్మహత్యతో వెలుగులోకి నిజం
మే 26న శివమొగ్గలోని తన నివాసంలో వాల్మీకి కార్పొరేషన్‌ అధికారి పి.చంద్రశేఖరన్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌లో చంద్రశేఖరన్‌ స్కామ్‌తోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తుల వివరాలను వివరించారు. గతంలో క్రీడలు, యువజన సర్వీసులు, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన నాగేంద్ర జూన్ 6న రాజీనామా చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
EPFO Pension: ఈపీఎఫ్‌వో ఇచ్చే పెన్షన్లు ​​7 రకాలు - ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి
ఈపీఎఫ్‌వో ఇచ్చే పెన్షన్లు ​​7 రకాలు - ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి
Embed widget