![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BRS Vinod comments : 6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసింది జీరో - రైతుల్ని ఆదుకోవాలి - బీఆర్ఎస్ డిమాండ్
Telangana News : ఆరు నెలల్లో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. రైతుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇచ్చింది.
![BRS Vinod comments : 6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసింది జీరో - రైతుల్ని ఆదుకోవాలి - బీఆర్ఎస్ డిమాండ్ BRS has made it clear that Revanth Governament has not done anything in six months BRS Vinod comments : 6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసింది జీరో - రైతుల్ని ఆదుకోవాలి - బీఆర్ఎస్ డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/6c1f2621af7ff22889b73a39f88c833e1716025127644228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BRS Vinod comments : ఆరు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ఆరో మాసం లోకి ప్రవేశించిందని.. ఎవరికైనా గ్రేడింగ్ ఇవ్వాలంటే మొదటి ఆర్ నెలలు ముఖ్యమైనవన్నారు. రేవంత్ రెడ్డి ఈ ఆరునెలల్లో తన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదని విమర్శించారు. కేబినెట్ సమావేశం లో మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నామన్నారు.
రైతు బంధు దేశం లోనే మొదటి సారి అమలు చేసిన ఘనత కేసీఆర్దేనని బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. పీఎం సహా అనేక రాష్ట్రాల సీఎం లు రైతు బంధు ను ప్రశంసించారు ..ఇదే అనేక రైతు పెట్టుబడి సాయం పథకాలకు స్ఫూర్తి అని తెలిపారు. రైతుబంధు అనేది కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ అని తెలిపారు. రోహిణీ కార్తె లో తొలకరి జల్లులు వస్తాయి .. రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చారన్నారు. దున్నెపుడే రైతుకు పెట్టుబడి సాయం వస్తే ఉపశమనం గా ఉంటుందని.. రేవంత్ యాసంగి రైతు బంధు పంటలు కోసే సమయానికి ఇచ్చారన్నారు. ఈ సారి అలాంటి తప్పు చేయకుండా రైతు భరోసా ను రోహిణి కార్తె లో విడుదల చేసేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
జూన్ మొదటి వారం లోనే రైతులకు ఎకరాకు 7500 రూపాయలు విడుదల చేయాలి ..ఆ దిశగా కేబినెట్ లో నిర్ణయించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. వర్షా కాలం లోనే ఎక్కువగా సన్న రకాల ధాన్యం పండిస్తారని.. రబీ లో నూకల శాతం ఎక్కువగా ఉంటుందని రైతులు సన్న రకాలు సాగు చేయరనితెలిపారు. క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనన్నారు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తిట్ల మీద కాకుండా రైతులకు మేలు చేయడం పై కేబినెట్ మీటింగ్ లో చర్చించాలన్నారు. బోనస్ ను బోగస్ గా మార్చకండిని.. రేవంత్ కు ఇదే కీలకమైన కేబినెట్ సమావేశం ..మంచి నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. న్నికలకు ముందు సన్నవడ్లకే బోనస్ అని సీఎం అంటే కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కావన్నారు. తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఎంత ఉన్నా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)