అన్వేషించండి

KCR for Farmers: రైతుల కోసం పోరాటం- రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు

కాంగ్రెస్ ప్రభుత్వం రైత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని, వారికిచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్: రైతు బంధు, పంట బోనస్ లాంటి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. మొదట ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిన విమర్శించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఆపై లోక్ సభ ఎన్నికలు రాగానే రైతు సమస్యలను లేవనెత్తుతూ కేసీఆర్ పొలం బాట పట్టి రైతులను పరామర్శించారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం (మే 16న) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

సన్న వడ్లకు అనడం రైతుల్ని మోసం చేయడమే 
పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని.. ఇప్పుడు  సన్న వడ్లకు మాత్రమే బోనస్ అనడం రైతులను మరోసారి వంచించడం, మోసం చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే బోనస్ ఎట్లా ప్రకటిస్తదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ప్రకటన ద్వారా రాష్ట్ర రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందన్నారు. ఓట్లు పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిపోయింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు?

ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు అన్నారు. ఇప్పటికీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా ఆగ్రహంతోనే ఉన్నారు. అసలే రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా కూడా ఇయ్యకుండా రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని విమర్శించారు. రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల కోసం పోరాడుతుందని, పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని గులాబీ బాస్ కేసీఆర్ బుధవారం నాడు పిలుపునిచ్చారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో  వడ్లను కొనకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఏడిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర రైతులకు భరోసా కల్పించడానికి ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు పోయి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Also Read: ఆడ రాక పాత గజ్జెలు అనే సామెత గుర్తొస్తుంది: కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు ఫైర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget