అన్వేషించండి

KCR for Farmers: రైతుల కోసం పోరాటం- రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు

కాంగ్రెస్ ప్రభుత్వం రైత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని, వారికిచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్: రైతు బంధు, పంట బోనస్ లాంటి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. మొదట ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిన విమర్శించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఆపై లోక్ సభ ఎన్నికలు రాగానే రైతు సమస్యలను లేవనెత్తుతూ కేసీఆర్ పొలం బాట పట్టి రైతులను పరామర్శించారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం (మే 16న) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

సన్న వడ్లకు అనడం రైతుల్ని మోసం చేయడమే 
పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని.. ఇప్పుడు  సన్న వడ్లకు మాత్రమే బోనస్ అనడం రైతులను మరోసారి వంచించడం, మోసం చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే బోనస్ ఎట్లా ప్రకటిస్తదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ప్రకటన ద్వారా రాష్ట్ర రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందన్నారు. ఓట్లు పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిపోయింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు?

ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు అన్నారు. ఇప్పటికీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా ఆగ్రహంతోనే ఉన్నారు. అసలే రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా కూడా ఇయ్యకుండా రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని విమర్శించారు. రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల కోసం పోరాడుతుందని, పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని గులాబీ బాస్ కేసీఆర్ బుధవారం నాడు పిలుపునిచ్చారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో  వడ్లను కొనకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఏడిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర రైతులకు భరోసా కల్పించడానికి ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు పోయి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Also Read: ఆడ రాక పాత గజ్జెలు అనే సామెత గుర్తొస్తుంది: కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు ఫైర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget