అన్వేషించండి

KCR: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ - బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్

Telangana News: ప్రతిపక్ష నేత హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు.

KCR Attended First Time In Assembly: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్‌ ప్రసంగం అయిన తర్వాత ఆయన చర్చలో పాల్గొంటారా.? లేదా.? అనే దానిపై స్పష్టత లేదు. నందినగర్‌లోని నివాసం నుంచి ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పూలవర్షం కురిపించారు. దాదాపు 7 నెలల తర్వాత అసెంబ్లీలో గులాబీ బాస్ అడుగుపెట్టగా.. గురువారం సమావేశాలపై అంతటా ఆసక్తి నెలకొంది. కాగా, ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అటు అధికార, ఇటు విపక్ష సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేద్దామని బుధవారం అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా.. మాజీ మంత్రి కేటీఆర్ సైతం అందుకు సుముఖత వ్యక్తం చేశారు. 

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరు కాలేదు. ఎన్నికల అనంతరం తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగ్గా.. అనారోగ్యంతో ఆయన హాజరు కాలేకపోయారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. అంతకు ముందు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు.

కరీంనగర్‌కు బీఆర్ఎస్ నేతలు

గురువారం శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడగడ్డకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం లోయర్ మానేరు డ్యాం పరిశీలిస్తారు. అనంతరం రాత్రి రామగుండం చేరుకుని అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అనంతరం మేడిగడ్డ సందర్శనకు బయలుదేరుతారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాల క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. మేడిగడ్డ వరదల నుంచి బయటపడిందంటూ ఇటీవల బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించగా.. దీనికి కాంగ్రెస్ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు.

కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నా కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన చేపట్టినట్లు తెలిపారు.

Also Read: Telangana: తెలంగాణ ప్రజలకు తీపికబురు- గృహజ్యోతి దరఖాస్తులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతిలో దాడులపై 3 కేసులు నమోదు.. వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు!
అమరావతిలో దాడులపై 3 కేసులు నమోదు.. వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు!
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Hair Mask To Boost Hair Growth : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Embed widget