అన్వేషించండి

BJP MLAs Meet Revanth Reddy : రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?

Telangana Politics : రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ అయ్యారు. రైతుల సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిశామని వారు చెబుతున్నారు.

BJP MLAs met with Revanth Reddy :  తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు హఠాత్తుగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను కలిసేందుకు   బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి,( Alleti Maheshwar Reddy ) ఎమ్మెల్యేలు రామారావు పటేల్,( MLA Ramarao Patel ) పైడి రాకేష్ రెడ్డిలు( MLA Paidi Rakesh Reddy ) వచ్చారు. వారితో రేవంత్ రెడ్డి అరగంటపాటు సమావేశం అయ్యారు.  రైతు సమస్యలు అదేవిధంగా ధాన్యం కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు వారు సమర్పించిన వినతి పత్రాన్ని మీడియాకు రిలీజ్ చేశారు. 

బీజేపీలో చర్చనీయాంశం అయిన ఎమ్మెల్యేల భేటీ                 

ముఖ్యమంత్రితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ కావడంతో బీజేపీలోనూ చర్చనీయాంశం అయింది. మాములుగా అయితే  వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్యమంత్రిని కలిసేందుకు బీజేపీ శాసనసభాపక్షం మొత్తం కలిసి వెళ్తుంది. ప్రత్యేకంగా ముగ్గురు వెళ్లే అవకాశం ఉండదు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ ఉద్దేశంతో వెళ్లారన్నదానిపైనా బీజేపీలో చర్చ జరుగుతోంది. బీజేపీ శాసనసభాపక్షం నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరపునే పోటీ చేయాల్సి ఉంది. కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందట బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. 

ఇద్దరు కాంగ్రెస్ లో పని చేసి బీజేపీలో చేరిన వారే                

ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆయనపై కీలక ఆరోపణలు చేశారు. మంత్రి పదవి  ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తానని తనతో చెప్పారని కానీ తాను పట్టించుకోలేదన్నారు. రామారావుపటేల్ కూడా  కాంగ్రెస్ నేతనే. ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి గెలిచారు. పైడి రాకేష్ రెడ్డి వ్యాపారవేత్తగా పేరు గడించి బీజేపీలో చేరారు. ఆర్మూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వీరు మగ్గురికీ బీజేపీతో అంతంతమాత్రంగానే అనుబంధం ఉండటం.. ప్రత్యేకంగా సీఎం రేవంత్ ను కలవడంతో గుసగుసలు ప్రారంభమయ్యాయి. 

రాజకీయం ఏమీ లేదని అంచనా                                 

అయితే ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారన్నది సమస్య కాదని.. ఎవరు అడిగినా అపాయింట్ మెంట్ ఇస్తానని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రేవంత్ రెడ్డిని కలిశారు. వారిలో చాలా మందిపై పార్టీ మార్పు ప్రచారం జరిగింది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు భిన్నం. అందుకే వారిపై పెద్దగా ఇలాంటి చర్చలు జరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Embed widget