అన్వేషించండి

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి - గవర్నర్‌కు బీజేపీ లేఖ !

Telangana News : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని బీజేపీ గవర్నర్‌కు లేఖ రాసింది. నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తు కరెక్ట్ అని బీజేపీ చెబుతోంది.

Phone Tapping Case Update In Telangana : ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై సిబిఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ రాష్ట్ర బీజేపీ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ రాధాకృష్ణ‌న్ ను కోరింది.  ట్యాపింగ్ కేసు పూర్తి వివరాలతో ముఖ్య నాయకులంతా ఓ లేఖ రాశారు  ఇప్ప‌టికే ఈ కేసులో న‌లుగురు పోలీస్ ఉన్న‌తాధికారులు అరెస్ట్ అయ్యార‌ని  లేఖలో నేతలు తెలిపారు.  మ‌రికొంద‌రు పోలీసుల పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని ..ఈ ట్యాపింగ్ లో గ‌త పాల‌కుల ప్ర‌మేయం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయని గుర్తు చేశారు.  ఈ కేసులో నిజ‌నిజాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను అభ్య‌ర్ధించింది. లేఖ‌పై బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి, ఎంపి ల‌క్ష్మ‌ణ్ తో పాటు బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు సంత‌కాలు చేశారు.                           


Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి - గవర్నర్‌కు బీజేపీ లేఖ !

ఫోన్ ట్యాపింగ్ కు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. అందుకు సీబీఐకి ఈ కేసును అప్పగిస్తేనే అసలు దోషులు బయటపడతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.  ఫోన్ ట్యాపింగ్ చేయడం అత్యంత దారుణమని అన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిచిందన్న వార్తలు కలవరపెడుతున్నాయన్నారు. సీబీఐకి ఈ కేసును అప్పగించినప్పుడే న్యాయం జరుగుతుందని కె. లక్షణ్ అన్నారు. ప్రభుత్వం కూడా సీబీఐకి అప్పగించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టామ్‌‌ అండ్‌‌ జెర్రీ మాదిరి కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ కొట్టుకుంటున్నాయని సీఎం రేవంత్‌‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి - గవర్నర్‌కు బీజేపీ లేఖ !

దేశ భద్రతకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందని, ఇందులో అసలు సూత్రధారులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రధాని మోదీ పదేండ్ల పాలన, అభివృద్ధిపై చర్చ జరగకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం, ధరణి, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలతో ప్రతిరోజు పతాక శీర్షికల్లో వార్తలు వచ్చేలా రేవంత్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ అవినీతిపై కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసిందని, కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ దానిపై ఇప్పటి వరకు విచారణ జరిపించలేదు. ధరణి పోర్టల్ పై కమిటీ వేసి మసిపూసి మారేడుకాయ చేశారు.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి - గవర్నర్‌కు బీజేపీ లేఖ !

మద్యం విక్రయాలు, విద్యుత్ కొనుగోళ్లలోనూ అవినీతి జరిగింది. వాటిపైనా విచారణ జరిపించడం లేదు” అని ఫైర్ అయ్యారు.  ‘‘2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్లలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిందే ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. గవర్నర్ ట్యాపింగ్ అంశాన్ని సీబీఐకి సిఫారసు చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget