అన్వేషించండి

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి - గవర్నర్‌కు బీజేపీ లేఖ !

Telangana News : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని బీజేపీ గవర్నర్‌కు లేఖ రాసింది. నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తు కరెక్ట్ అని బీజేపీ చెబుతోంది.

Phone Tapping Case Update In Telangana : ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై సిబిఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ రాష్ట్ర బీజేపీ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ రాధాకృష్ణ‌న్ ను కోరింది.  ట్యాపింగ్ కేసు పూర్తి వివరాలతో ముఖ్య నాయకులంతా ఓ లేఖ రాశారు  ఇప్ప‌టికే ఈ కేసులో న‌లుగురు పోలీస్ ఉన్న‌తాధికారులు అరెస్ట్ అయ్యార‌ని  లేఖలో నేతలు తెలిపారు.  మ‌రికొంద‌రు పోలీసుల పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని ..ఈ ట్యాపింగ్ లో గ‌త పాల‌కుల ప్ర‌మేయం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయని గుర్తు చేశారు.  ఈ కేసులో నిజ‌నిజాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను అభ్య‌ర్ధించింది. లేఖ‌పై బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి, ఎంపి ల‌క్ష్మ‌ణ్ తో పాటు బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు సంత‌కాలు చేశారు.                           


Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి - గవర్నర్‌కు బీజేపీ లేఖ !

ఫోన్ ట్యాపింగ్ కు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. అందుకు సీబీఐకి ఈ కేసును అప్పగిస్తేనే అసలు దోషులు బయటపడతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.  ఫోన్ ట్యాపింగ్ చేయడం అత్యంత దారుణమని అన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిచిందన్న వార్తలు కలవరపెడుతున్నాయన్నారు. సీబీఐకి ఈ కేసును అప్పగించినప్పుడే న్యాయం జరుగుతుందని కె. లక్షణ్ అన్నారు. ప్రభుత్వం కూడా సీబీఐకి అప్పగించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టామ్‌‌ అండ్‌‌ జెర్రీ మాదిరి కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ కొట్టుకుంటున్నాయని సీఎం రేవంత్‌‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి - గవర్నర్‌కు బీజేపీ లేఖ !

దేశ భద్రతకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందని, ఇందులో అసలు సూత్రధారులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రధాని మోదీ పదేండ్ల పాలన, అభివృద్ధిపై చర్చ జరగకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం, ధరణి, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలతో ప్రతిరోజు పతాక శీర్షికల్లో వార్తలు వచ్చేలా రేవంత్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ అవినీతిపై కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసిందని, కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ దానిపై ఇప్పటి వరకు విచారణ జరిపించలేదు. ధరణి పోర్టల్ పై కమిటీ వేసి మసిపూసి మారేడుకాయ చేశారు.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి - గవర్నర్‌కు బీజేపీ లేఖ !

మద్యం విక్రయాలు, విద్యుత్ కొనుగోళ్లలోనూ అవినీతి జరిగింది. వాటిపైనా విచారణ జరిపించడం లేదు” అని ఫైర్ అయ్యారు.  ‘‘2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్లలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిందే ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. గవర్నర్ ట్యాపింగ్ అంశాన్ని సీబీఐకి సిఫారసు చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Vs Revanth Reddy: బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
Raymond Group: అనంతపురంలో  ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
అనంతపురంలో ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
AP Liquor Issue: ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ  లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
Rural Vehicle Sales India: రైతులతో కిటకిటలాడిన షోరూమ్‌లు - పెరిగిన ఆదాయాలు, తగ్గిన GST రేట్లతో సేల్స్‌ ఊపు
షోరూమ్‌లను ముంచెత్తిన రూరల్‌ ఇండియా - బయ్యర్లలో ఎక్కువ మంది గ్రామీణులే
Advertisement

వీడియోలు

WWC 2025 | టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే గెలవాల్సింది ఎన్ని మ్యాచులు?
BCCI Rohit Sharma Virat Kohli | రోహిత్ శర్మ, విరాట్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
Rohit Sharma and Virat Kohli | ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ 3 సెంచరీలు బాదేస్తాడన్న హర్బజన్ సింగ్
KL Rahul Injury |  విండీస్ రెండో టెస్ట్‌లో గాయపడిన కేఎల్ రాహుల్‌
Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Vs Revanth Reddy: బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
Raymond Group: అనంతపురంలో  ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
అనంతపురంలో ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
AP Liquor Issue: ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ  లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
Rural Vehicle Sales India: రైతులతో కిటకిటలాడిన షోరూమ్‌లు - పెరిగిన ఆదాయాలు, తగ్గిన GST రేట్లతో సేల్స్‌ ఊపు
షోరూమ్‌లను ముంచెత్తిన రూరల్‌ ఇండియా - బయ్యర్లలో ఎక్కువ మంది గ్రామీణులే
Commonwealth Games:  అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానున్న భారత్ - అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్
Tata Nexon : లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో Tata Nexon వచ్చేస్తోంది! ఈ దీపావళికి బంపర్ ఆఫర్‌!
లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో Tata Nexon వచ్చేస్తోంది! ఈ దీపావళికి బంపర్ ఆఫర్‌!
Mallareddy College Google agreement: గూగుల్‌తో  మల్లారెడ్డి కాలేజీల ఒప్పందం -  డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభం
గూగుల్‌తో మల్లారెడ్డి కాలేజీల ఒప్పందం - డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభం
TVS Scooty Zest  SXC కొత్త వేరియంట్‌ లాంచ్‌ - డిజిటల్‌ కన్సోల్‌, బ్లూటూత్‌ ఫీచర్లు, కొత్త కలర్స్‌ - ధర కేవలం ₹75,500
TVS Scooty Zest SXC - డిజిటల్‌ కన్సోల్‌తో కొత్తగా ఎంట్రీ, రేటు కేవలం ₹75,500
Embed widget