Breaking News Live Telugu Updates: నల్కొండ జిల్లాలో కాల్పుల కలకలం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ తీరంలో కోస్తా తమిళనాడు మరియు పరిసర ప్రాంతాలపై తుపాను ప్రసరణ ఇప్పుడు పశ్చిమ, మధ్య మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో ఏపీలో వాతావరణ పరిస్థితులు ఇలా ఉండే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది.
Telangana Weather: తెలంగాణలో ఇలా
హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు నేడు (ఆగస్టు 4) ఉదయం వెల్లడించిన వివరాల మేరకు వచ్చే 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో వచ్చే 3 గంటల్లో అత్యధిక వర్షం కురవనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇక నిన్న తెలంగాణలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని ఎండలు కూడా అధికంగా ఉన్నాయి. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి,హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని నిన్న వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే 10 గ్రాములకు రూ.200 తగ్గింది. వెండి ధర మాత్రం రూ.500 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్లో రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,440 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.63,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.63,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,440గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.63,000 గా ఉంది.
నల్కొండ జిల్లాలో కాల్పుల కలకలం
Nalgonda News : నల్కొండ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. మునుగోడు మండలం ఊగొండి శివారులో బైక్ పై వెళ్తున్న యువకుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఈ కాల్పుల్లో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం, కట్టెల లోడు లారీ బోల్తా, ముగ్గురికి తీవ్ర గాయాలు
ములుగు మంగంపేట మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. కట్టెల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ కింద యువకుడు, ఇద్దరు చిన్నారులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి.





















