Pawan Kalyan: అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Deputy CM: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల్ని కబ్జా చేశారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారు. విజిలెన్స్ చర్యలకు ఆదేశించారు.

Deputy CM Pawan Kalyan releases Peddireddy Encroched forest lands video: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , కుటుంబ సభ్యుల అక్రమ భూమి ఆక్రమణలను బహిర్గతం చేసే సంచలనాత్మక వీడియోను విడుదల చేశారు. రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమించుకుని, వాటిపై అక్రమ కట్టడాలు నిర్మించారని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇటీవల ఏరియల్ సర్వేలో స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించి వీడియోలు తీశారు. విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా తూర్పు కనుమలలోని మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో జరిగిన ప్రత్యేక ఏరియల్ సర్వేలో ఈ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కల్యాణ్ తన తాజా తిరుపతి పర్యటన సందర్భంగా హెలికాప్టర్లో ఈ ప్రాంతాన్ని సందర్శించి, భూమి ఆక్రమణలను డాక్యుమెంట్ చేశారు. వీడియోల్లో కనిపించే దృశ్యాల ప్రకారం, అటవీ మధ్యలో గెస్ట్ హౌస్లు, ఇతర అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఈ భూములు పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వారసత్వ ఆస్తులుగా అధికార దుర్వినియోగంతో రికార్డు మార్చారని ఆయన ఆరోపించారు.
అటవీ భూములు మన పర్యావరణానికి, భవిష్యత్తుకు అమూల్యమైనవి. వీటిని రాజకీయ నేతలు ఆక్రమించుకోవడం అనేది తీవ్రమైన నేరం అని పవన్ స్పష్టం చేశారు. ఈ ఆక్రమణలు వైసీపీ పాలిత దశలో జరిగాయని, తమ ప్రభుత్వం ఇటువంటి అక్రమాలను సహించదని స్పష్టం చేశారు. అధికారులకు జారీ చేసిన ఆదేశాల్లో, విజిలెన్స్ టీమ్లు తక్షణ చర్యలు తీసుకోవాలని, భూములు తిరిగి పొంది చట్టపరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
An exclusive aerial survey has exposed 76.74 acres of illegal encroachment inside the protected Mangalam Peta forest lands in the eastern ghats, linked to former Forest Minister and senior leader Sri Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) garu. Hon’ble Deputy CM… pic.twitter.com/6OxRhJEhmb
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 13, 2025
పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవీ, రెవెన్యూ, విజిలెన్స్ శాఖల అధికారులు తక్షణమే ఫీల్డ్ సర్వే చేపట్టనున్నారు. ఆక్రమిత భూములు తిరిగి పొందడానికి, అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్లాన్. ఇది ఆంధ్రప్రదేశ్లో అటవీ భూముల ఆక్రమణలపై మొదటి పెద్ద చర్యల్లో ఒకటిగా మారనుంది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలనీ నిరాధారమని పెద్దిరెడ్డి కుటుంబం చెబుతోంది





















