అన్వేషించండి

Breaking News Live Telugu Updates: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు!

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
AP Telangana Breaking News Telugu Live Updates 223 August Updates Breaking News Live Telugu Updates: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు!
Breaking News Live Telugu Updates

Background

Breaking News Live Telugu Updates: ఏపీలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద నిధులు ఇవాళ విడుదల చేయనున్నారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి  వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా నిధులను జమ చేయనున్నారు. క్రిష్ణా జిల్లా మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ లోని పెడన మండలం తోటముూల గ్రామం ఇందుకు వేదిక కానుంది. ఆ సందర్భంగానే ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మచిలీపట్నం నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటైన తరువాత సీఎం అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి.

ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోగి రమేష్ సొంత అసెంబ్లీ నియోజకవర్గం కూడా అదే కావడంతో వైఎస్ జగన్ పర్యటన, బహిరంగ సభ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆయనతో పాటు తలసీల రఘురామ్, మాజీ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ రంజిత్, ఎస్పీ జోషువా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

అధికారుల అంచనా మేరకు ఈ బహిరంగ సభకు దాదాపు 50 వేల మంది వరకూ హాజరవుతారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్క పెడనలోనే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద లబ్దిదారులు 3,161 వేల మంది ఉన్నారు. వారందరినీ ఈ బహిరంగ సభకు పిలవాలని నిర్ణయించారు. అందులో నుంచి 20 మంది నేతన్నలను ఎంపిక చేసి సీఎం జగన్ తో ఫోటో దిగేందుకు ప్రణాళిక చేయనున్నారు. ఈ ప్రాంతం కళంకారీ కళకు ప్రసిద్ధి అయినందున ప్రత్యేకంగా రూపొందించిన కళంకారీ ఫ్రేమును ముఖ్యమంత్రినిక బహూకరించనున్నట్లుగా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు.

పథకం లక్ష్యం ఇదీ

చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు, వారికి ఆర్థిక సాయం అందించడం ఈ పథకం లక్ష్యం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.24 వేలు నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారు. అలా ఐదేళ్ల కాలంలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1.2 లక్షలు అందుతుంది.

పథకం అర్హత
ఈ పథకం కింద, దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా ఉండాలి. దరఖాస్తుదారుడు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, అతను లేదా ఆమె తప్పనిసరిగా వృత్తి పరంగా నేత అయి ఉండాలి. ఈ పథకం కింద, దరఖాస్తుదారు చేనేత సంఘంలో నమోదు చేసుకోవాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. మగ్గాలు ఎన్ని ఉన్నా ఒక కుటుంబంలో ఒకరికే ప్రయోజనం అందుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి? కావాల్సిన పత్రాలు
సచివాలయాలు సిద్ధం చేసిన లిస్టును వెరిఫై చేసి లబ్ధిదారులను గుర్తిస్తారు. వాలంటీర్లు, సిబ్బంది బయోమెట్రిక్ తీసుకుని ఎంట్రీ చేస్తారు. ఆ విధంగా ఎంట్రీ చేసిన లిస్టు MPDO లేదా MC లు మరోసారి ధ్రువీకరించి చేనేత శాఖ ద్వారా ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు.

* పత్రాలు అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ వంటివి, రాష్ట్ర చేనేత సంఘం జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెల్ల రేషన్ కార్డు/దారిద్య్ర రేఖ (BPL) సర్టిఫికెట్ బ్యాంక్ ఖాతా వివరాలు కావాలి.

వీటితో రాష్ట్ర/జిల్లా స్థాయిలో అమలు చేసే ఏజెన్సీని సంప్రదించాలి.

గ్రామ సచివాలయాలు సిద్ధం చేసిన నేతన్న నేస్తం లబ్ధిదారుల లిస్టు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. సచివాలయాలలో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టును పెడతారు.

19:30 PM (IST)  •  23 Aug 2022

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు 

Mla Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  రిమాండ్ ను  నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. 41  సీఆర్సీపీ కండిషన్ ను పోలీసులు పాటించలేదని  కోర్టు అభిప్రాయపడింది. పోలీసులు రిమాండ్ చేసిన విధానం సరిగా లేదన్న కోర్టు...  రాజా సింగ్ రిమాండ్ ను తిరస్కరించింది.  వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే అంతకు ముందు రాజాసింగ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు వార్తలు వచ్చాయి. 

18:25 PM (IST)  •  23 Aug 2022

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు 14 రోజుల రిమాండ్ 

Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రాజాసింగ్ ను చంచల్ గూడా జైలుకి తరలించారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. అనర్హత పిటిషన్లు కొట్టివేత
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. అనర్హత పిటిషన్లు కొట్టివేత
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
Embed widget