అన్వేషించండి

Breaking News Live: విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ క్లాసులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
AP Telangana Breaking News Live Updates on 15 January 2022 Breaking News Live: విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ క్లాసులు
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో గత మూడు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం పెరిగింది.

కోస్తాంధ్ర, యానాంలో జనవరి 17వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. వారానికి పైగా వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు సైతం తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జనవరి 18 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురవనున్నాయి.  కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

తెలంగాణ వెదర్ అప్‌డేట్..
గత ఐదు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు జనవరి 17 వరకు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. మరి కొన్ని రోజులపాటు వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే బంగార ధర వరుసగా మూడో రోజు పుంజుకుంది. మరోవైపు వెండి ధర పడిపోయింది. తాజాగా హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,000 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,100గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,900కి దిగొచ్చింది.

ఏపీ మార్కెట్లో బంగారం ధర నిన్న సాయంత్రం రూ.200 మేర పెరిగింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,000కు చేరుకుంది. వెండి 1 కిలోగ్రాము ధర రూ.65,900 వద్ద మార్కెట్ అవుతోంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 27 పైసలు తగ్గగా లీటర్ ధర రూ.107.69 అయింది. డీజిల్‌పై 25 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 కి పతనమైంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్‌ లీటర్ ధర రూ.94.35గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.32 అయింది. ఇక్కడ డీజిల్ ధర రూ.96.41కి తగ్గింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.35 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్ ధర 0.33 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.51 కు చేరింది.

Also Read: Gold Silver Price Today: మళ్లీ భగ్గుమన్న బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Also Read: Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్‌.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం

Also Read: బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలు వెంటనే చెల్లించాలి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

19:24 PM (IST)  •  15 Jan 2022

మంచిర్యాలలో విషాదం.. గాలిపటం మాంజాతో గొంతు తెగి వ్యక్తి మృతి

మంచిర్యాలలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. అతడి భార్యతో కలిసి వెళ్తున్న సమయంలో గాలిపటం ఎగరేసేందుకు వినియోగించిన మంజా దారం దారికి అడ్డంగా ఉంది. అది కనిపించని వాహనదారుడు అలాగే వెళ్లాడు. దారం కారణంగా వ్యక్తి గొంతుకు కోసుకుపోయింది.  అతడి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. ఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. 

15:02 PM (IST)  •  15 Jan 2022

విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ క్లాసులు

ఈ నెల 17 నుంచి 31 వరకు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నా్రు. కొవిడ్ దృష్ట్యా ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో ఈ నెలాఖరు వరకూ.. ఆన్ లైన్ తరగతులు జరపనున్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget