అన్వేషించండి

BRS News : బీఆర్ఎస్‌కు మరో ఎమ్మెల్సీ గుడ్ బై ? - కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన కల్వకుర్తి నేత

మరో ఎమ్మెల్సీ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.


BRS News :  ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో  అవకాశం ఉన్న వాళ్లు  అసలు వదిలి పెట్టడం లేదు. ఇటీవలే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి చెందిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని లాంఛనంగా కాంగ్రెస్‌లో చేరికే మిగిలిందని చెబుతున్నారు. 

కల్వకుర్తి టిక్కెట్ ఆశించిన కసిరెడ్డి 
 
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం టిక్కెట్ ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిక్కెట్ ను ఖరారు చేశారు. దీంతో టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డి తన దారి తాను చూసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు పార్టీ అగ్రనేతలతో చర్చించారని తెలిసింది. రెండు మూడు రోజుల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.

కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆఫర్ 
 
 అధికార పార్టీ బీఆర్ఎస్‌లో టికెట్​దక్కుతుందని ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డికి హైకమాండ్ షాక్ ఇచ్చింది. దీంతో  ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనంటూ ఆయన అనుచరులు  కసిరెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయంగా ఉనికి కోల్పోతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పెద్దలు ఎమ్మెల్సీ కసిరెడ్డిని బుజ్జగించారు. ఆయన కూడా పోటీకి దూరంగా ఉండాలనే అనుకున్నారు. కానీ   క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇదే సమయంలో  మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు రేవంత్​రెడ్డిలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపారు. ఆయనకు కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. దాంతో చేరికను ఖరారు చేసుకున్నారు. 

టిక్కెట్ త్యాగం చేస్తున్న వంశీచంద్ రెడ్డి 

ఈ స్థానం నుంచి వంశీచంద్​రెడ్డి పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ సీడబ్లూసీలో ప్రత్యేక ఆహ్వానితుడుగా వంశీచంద్ రెడ్డి ఉన్నారు. పార్టీ పనుల్లో బిజీగా ఉంటారు.  అందుకోసం ఆ నియోజకవర్గంలో గెలుపు లక్ష్యంగా అభ్యర్థిని గుర్తించి కసిరెడ్డి నారాయణరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోసారి కసిరెడ్డి తమ అనుచరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈనెల 29వ తేదీన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఢిల్లీ కాంగ్రెస్​పెద్దల సమక్షంలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. 

బీఆర్‌ఎస్‌లో ఉంటూ సీటు దక్కదని తేలడంతో పార్టీ మారైనా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని అనేక మంది భావిస్తున్నారు. కేసీఆర్  పెద్దగా మార్పులు లేకుండానే సిట్టింగ్‌లందరికీ దాదాపుగా సీట్లు ఖరారు చేశారు. దీంతో అసంతృప్త నేతలు ఒక్కొక్కరు తమ దారి తాము చూసుకుంటున్నారు.                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget