అన్వేషించండి

Samsung Upcoming Phone: 108 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్.. లాంచ్ అయ్యేది ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో లాంచ్ చేయనున్న గెలాక్సీ ఏ73 స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ73 స్మార్ట్ ఫోన్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి ఎక్కువ సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. గతంలో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కేవలం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే శాంసంగ్ ఉపయోగించేది. గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లు మిడ్ రేంజ్ ప్రీమియం విభాగంలో వస్తాయి. అయితే ఇందులో ఫ్లాగ్ షిప్ ఫోన్లలో అందించే 108 మెగాపిక్సెల్ సెన్సార్‌నే అందిస్తారా.. లేక కొత్త 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందిస్తారా అనే విషయం తెలియరాలేదు.

శాంసంగ్ గెలాక్సీ ఏ73 స్మార్ట్ ఫోన్ 2022లో లాంచ్ కానుందని తెలుస్తోంది. @GaryeonHan అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ ఈ విషయాన్ని మొదట లీక్ చేశారు. దీన్ని శాంసంగ్ మొబైల్ అప్‌డేట్లను అందించే శామ్‌మొబైల్ మొదట తెలిపింది. శాంసంగ్ మొట్టమొదటిసారి గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించింది. తర్వాత దీన్ని ఎస్21 అల్ట్రాలో కూడా అందించారు. అయితే శాంసంగ్ గెలాక్సీ ఏ73లో ఈ ఫోన్లలో అందించే సెన్సార్‌ను అందిస్తుందా... లేక వేరే సెన్సార్‌ను అందిస్తుందా అనే విషయం తెలియరాలేదు.

శాంసంగ్ కూడా ఈ ఫోన్ గురించి అధికారిక సమాచారం ఏదీ ప్రకటించలేదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రాలో ఐసోసెల్ హెచ్ఎం3 సెన్సార్‌ను అందించారు. ఇందులో 1/1.33 అంగుళాల సెన్సార్‌ను అందించారు. దీని పిక్సెల్ సైజు 0.8 నానోమీటర్లుగా ఉంది. గతంలో వచ్చే కథనాల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో మెరుగు పరిచిన 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

హార్డ్‌వేర్‌లో మార్పుల కంటే సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌కు సంబంధించిన అప్‌డేట్లు ఇందులో చేశారని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్‌లో 2022లో లాంచ్ అయ్యే అన్ని ఫోన్లలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ52, ఏ72 ఫోన్లలో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం ఎంట్రీ లెవల్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ22 స్మార్ట్ ఫోన్‌లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉన్న 48 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. శాంసంగ్ లాంచ్ చేసే ఫోన్లలో మోస్ట్ పాపులర్ సిరీస్ గెలాక్సీ ఏ-సిరీసే.

శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను రూపొందిస్తుందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ సెన్సార్‌ను షియోమీ 12 స్మార్ట్ ఫోన్‌లో అందించనున్నారని సమాచారం. అయితే ఒకవేళ శాంసంగ్ నిజంగానే 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను రూపొందిస్తే.. ఆ సెన్సార్ కేవలం షియోమీ 12లోనే కాకుండా.. శాంసంగ్ ఫోన్లలో కూడా ఉండే అవకాశం ఉంది.

Also Read: Affordable iPhone: ఈ చవకైన ఐఫోన్ ఇంక మనదేశంలో లేనట్లే.. మరో రెండు పాత ఐఫోన్లనూ నిలిపివేసిన యాపిల్!

Also Read: Redmi TV: రెడ్‌మీ కొత్త టీవీలు వచ్చేస్తున్నాయి.. రూ.20 వేలలోపే!

Also Read: Infinix: ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. రూ.9 వేలలోపు సూపర్ ఫీచర్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనేయచ్చు!

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Embed widget