అన్వేషించండి

వివో ఫోన్లకు 5జీ ఈ నెలలోనే - అప్‌డేట్ ఇవ్వనున్న కంపెనీ!

వివో ఫోన్లకు 5జీ అప్‌డేట్ ఈ నెలలోనే రానుంది.

వివో తన 5G హ్యాండ్‌సెట్‌లలో చాలా వరకు స్టాండ్ అలోన్, నాన్-స్టాండ్ అలోన్ 5G నెట్‌వర్క్‌లతో పనిచేసేలా చేయడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. స్టాండ్ అలోన్ నెట్‌వర్క్ 5జీ సిగ్నల్‌ను మాత్రమే ప్రసారం చేస్తుంది. అయితే 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల మిశ్రమంతో కూడిన సిగ్నల్‌ను నాన్-స్టాండలోన్ 5జీ నెట్‌వర్క్ అంటారు.

ప్రస్తుతం రిలయన్స్ జియో స్టాండ్ అలోన్ 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ నాన్-స్టాండలోన్ 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. వివో 5జీ సేవల కోసం 30 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది, ఇవి నాన్-స్టాండలోన్ 5G నెట్‌వర్క్‌కు అనుకూలంగా ఉంటాయి.

‘వివోలో ఆరు కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు 5జీ SA నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తున్నాయి. మా స్మార్ట్‌ఫోన్‌లు చాలా వరకు NSAకి అనుకూలంగా ఉన్నాయి. మేం ఈ నెలలో మా స్మార్ట్‌ఫోన్‌లలో చాలా వరకు 5G SAకి అనుకూలమయ్యే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తాం.’ అని వివో ఇండియా బిజినెస్ స్ట్రాటజీ హెడ్ పైఘమ్ డానిష్ వివో టెక్ డే సందర్భంగా విలేకరులతో అన్నారు.

ఐడీసీ ప్రకారం వివో భారతదేశంలో మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయదారు. ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికంలో వివో మనదేశంలో 17 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 5జీ అనుకూలత సమస్యలను క్రమబద్ధీకరించడానికి, వినియోగదారులందరికీ సేవలను సజావుగా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ఇటీవల టెలికాం ఆపరేటర్లు, స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించింది.

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయిన వివో స్మార్ట్‌ఫోన్‌లో సెకనుకు 1.5 జీబీ సాధించడాన్ని లైవ్‌గా టెక్ డేలో Vivo చూపించింది. ఈవెంట్‌లో కంపెనీ తన ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌ను గ్లోబల్, ఇండియన్ మార్కెట్‌ల్లో లాంచ్ తేదీని వెల్లడించకుండా ప్రదర్శించింది.

ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో 5జీ సేవలను ప్రారంభించారు. అయినప్పటికీ చాలా హ్యాండ్‌సెట్‌లు 5జీ యాక్సెస్‌ని ప్రారంభించడానికి OEMల నుండి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఇంకా అందుకోలేదు. ఐఫోన్ తయారీదారు యాపిల్ తన 5జీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను డిసెంబర్‌లో విడుదల చేయనుంది. అయితే నవంబర్‌లో అప్‌డేట్‌లను విడుదల చేయనున్నట్లు శామ్‌సంగ్ తెలిపింది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by vivo India (@vivo_india)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Embed widget