అన్వేషించండి

Sanchar Saathi App: సంచార్‌సాథీ యాప్‌ వివాదంలో కీలక పరిణామం! నిఘా విమర్శలతో వెనక్కి తగ్గిన కేంద్రం! ఇంతకీ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటీ?

Sanchar Saathi App: ఇకపై అమ్మే ప్రతి మొబైల్‌ ఫోన్‌లో సంచార్‌ సాథీ యాప్ తప్పని సరిగా ఇన్‌స్టాల్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశం పెను దుమారాన్ని రేపింది. ప్రజలపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న విమర్శలు వచ్చాయి. 

Sanchar Saathi App: ఈ మధ్య కాలంలో కేంద్రం జారీ చేసిన ఓ ఉత్తర్వు వివాదాల కేంద్రంగా మారింది. ఇకపై వచ్చే ప్రతి మొబైల్‌లో సంచార్ సాంథీ యాప్ తప్పనిసరిగా ఉండాలంటూ ప్రకటించడాన్ని అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రతి ఫోన్‌లో ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఉండాలని, దాన్ని వినియోగదారులు తొలగించడానికి లేకుండా చేయాలని కూడా పేర్కొంది. అన్ని వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాల తర్వాత ఆ ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులు చేసింది. వినియోగదారులకు ఇష్టం ఉంటే కంటిన్యూ చేయవచ్చని లేకుంటే తొలగించకోవచ్చని పేర్కొంది.  

వెనక్కి తగ్గిన కేంద్రం

టెలికమ్యూనికేషన్స్‌ సైబర్ సెక్యూరిటీ అమెండ్‌మెంట్‌ రూల్స్‌, 2025 ప్రకారం నవంబర్‌ 28న టెలికామ్‌ డిపార్ట్మెంట్‌ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలతో గోప్యత, పర్యవేక్షణ, సమస్యలపై తీవ్ర ఆదోళన వ్యక్తమైంది. వినియోగదారులకు ఈ యాప్‌ను ఉపయోగించాలా వద్దా అనే నిర్ణయించుకునే అవకాశఁ లేకుండా పోయింది. ఎందుకంటే ఇది తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసి వస్తుంది. అంతే కాకుండా వారు డిలీట్ చేసే వీలు లేకుండా ఉంది. కానీ అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, ఐటీ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో సంచార్‌ సాథీ యాప్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఊరట కల్పించినప్పటికీ ప్రజల వినియోగించే గాడ్జెట్స్‌పై ప్రభుత్వం నిఘా పెట్టిందనే ఆందోళన ఇంకా తొలగిపోలేదు. 

ఇష్టం లేకుంటే డిలీట్ చేయవచ్చు

ప్రస్తుతం నెలకొన్న గడబిడపై టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక ప్రకటన చేశారు. యాప్‌ను తొలగించాలనుకుంటే తొలగిచుకోవచ్చు, ఇది తప్పనిసరికాదు అని తేల్చి చెప్పారు. దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ మోసాలు, సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ యాప్‌ తీసుకొచ్చామన్నారు. చాలా మందికి ఈ యాప్ గురించి తెలియదని అందుకే ప్రతి సెల్‌ఫోన్‌లో కచ్చింతగా ఇన్‌స్టాల్ చేయాలనే ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఉత్తర్వులు సవరించామన్నారు. యాప్‌ను ఉపయోగించుకోకూడదు అనుకుంటే తొలగించుకోవచ్చని, లేదనుకుంటే అలా ఇన్‌యాక్టివ్‌గా వదిలివేయవచ్చని వెల్లడించారు. ఇందులో వినియోగదారునికి పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు.   

యాప్ ఉద్దేశం మంచిదే కానీ... 

పెరిగిపోతున్న డిజిటల్ మోసాలు, సెల్‌ చోరీలు, వాటి ఆధారంగా జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ఈ సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చింది కేంద్రం. చోరీకి గురైన మొబైల్‌ ఫోన్‌లను వెతికి పట్టుకోవడానికి, నకిలీ లేదా క్లోనింగ్ చేసిన ఐఎంఈఐలను గుర్తించడానికి, వాటిని బ్లాక్ చేయడానికి, మోసపూరిత కాల్స్‌ను కట్టడి చేయడానికి, మెసేజ్‌లను రిపోర్ట్ చేయడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. యాప్ తీసుకొచ్చిన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, కచ్చితంగా ప్రతి ఫోన్‌లో డిలీట్ చేసేందుకు అవకాశం లేని విధంగా ఇన్‌స్టాల్ చేయాలనే ఆదేశాలు మాత్రం వివాదానికి కారణమయ్యాయి. 

అన్నింటీని యాక్సెస్ చేయగలదు

సంచార్‌ సాథీ యాప్‌ వినియోగదారుడికి ఫోన్‌లో ఎలాంటి డేటాను యాక్సెస్ చేస్తుందో ఒకసారి పరిశీలిస్తే... మొదటిది ఫోన్ కాల్స్‌ను మేనేజ్ చేయడం. అఁటే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని నెంబర్‌లను గుర్తించడానికి పర్మిషన్ అడుగుతుంది. టెలికామ్‌ డిపార్ట్‌మెంట్‌కి అటోమేటిక్‌ మెసేజ్‌ పంపడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. యాప్‌లోని సేవలను ఉపయోగించి మోసపూరిత కాల్స్‌ను ఎస్‌ఎంఎస్‌లను రిపోర్ట్‌ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. చోరీ అయిన లేదా పోయిన మొబైల్‌ ఫోన్‌లను రిపోర్ట్ చేసేటప్పుడు లేదా మోసపూరిత సందేశాల ఇమేజ్‌లను అప్లోడ్ చేయానికి కూడా పర్మిషన్ అడుగుతుంది. ఐఎంఈఐ బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా దాని ప్రామాణికతను తనిఖీ చేయడానికి కూడా కెమెరా పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆండ్రాయిట్‌లో యూజర్‌ సమ్మతి లేకుండానే ఫోన్ నెంబర్‌తో ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. మొదట్లో చెప్పుకున్నట్టు మీరు ఫోన్‌లో సిమ్ వేసిన వెంటనే దీని నుంచి టెలికాం డిపార్ట్మెంట్‌కు సందేశం వెళ్లిపోతుంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది. ఆపిల్‌ ఫోన్‌లో మాత్రం ఈ ఆటోమెటిక్‌గా మెసేజ్ పంపేందుకు వీలు లేదు. మిగతా వాటి యాక్సెస్‌ మాత్రం కచ్చితంగా అడుగుతుంది. 

ఇప్పుడు అందుబాటులో ఉన్న యాప్‌ ఫోటోలు, వీడియోలు, కాల్‌ లాగ్స్‌, ఫోన్‌ నెంబర్‌లు, కాల్ యాక్టివ్‌గా ఉందా లేదా అనే వివరాలను గుర్తించే ఫీచర్స్ ఉన్నాయి. వాటిని యాక్సెస్ చేయగలదు. అందుకే దీనిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పర్శనల్‌ సమాచారం అడిగినప్పుడు డేటాను రక్షించడానికి తగిన భద్రతా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ వినియోగదారుల హక్కుల గురించి మాత్రం స్పష్టమైన ప్రకటన లేదు. ఇవన్నీ ఈ యాప్‌లో ప్రధాన లోపాలుగా చెబుతున్నారు. ఇవేవీ జీవోలో కానీ, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కానీ చెప్పలేదు. యాప్ రిజిస్ట్రేషన్ టైంలో మాత్రం ఫోన్ నెంబర్లు, ఫోటోలు, కాల్‌, మేసేజ్‌లు, సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే దీనిపై సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Embed widget