అన్వేషించండి

India Becomes Number 1: అమెరికా, చైనా వివాదంలో భారత్‌కు భారీ లాభం.. డ్రాగన్ కంట్రీని వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానం

Tariff war between US and China : ఆపిల్ కంపెనీ సంవత్సరానికి 22 కోట్లకు పైగా ఐఫోన్లు విక్రయిస్తోందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఇటీవల చైనాను వెనక్కినెట్టి భారత్ నెంబర్ వన్ అయింది.

న్యూఢిల్లీ: భారతదేశం ఆపిల్ ఐఫోన్ల విషయంలో అద్భుత విజయం సాధించింది. ఐఫోన్ల తయారీలో డ్రాగన్ కంట్రీ చైనాను కూడా వెనక్కి నెట్టింది. మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ ఓమ్డియా తాజా రిపోర్ట్ ప్రకారం, అమెరికాకు ఐఫోన్లను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.

తాజా నివేదిక ప్రకారం, ఏప్రిల్‌లో భారతదేశంలో తయారైన దాదాపు 30 లక్షల ఐఫోన్లు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో, చైనా నుండి ఐఫోన్ల ఎగుమతి 76 శాతం తగ్గింది, కేవలం 9 లక్షల యూనిట్లకు మాత్రమే పరిమితమైంది.

చైనాతో టారిఫ్ యుద్ధం.. భారతదేశానికి ప్రయోజనం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో తయారు చేయని వస్తువులపై 25 శాతం టారిఫ్ విధించే హెచ్చరికలు భారతదేశానికి ప్రయోజనం చేకూర్చాయి. అమెరికా టారిఫ్‌లతో చైనా దేశంలో ఆపిల్‌కు తీవ్రమైన సవాలు ఎదురవుతోంది. ట్రంప్ ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ను భారతదేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేయకూడదని ఇటీవల కోరడం తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత అమెరికాకు భారత్ ఐఫోన్ల ఎగుమతిపై ఈ నివేదిక వచ్చింది. చైనాతో అమెరికా దూరం పెంచుకుంది, దాంతో యాపిల్ భారతదేశంలో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించింది. 

రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఆపిల్ కంపెనీ ఏడాదికి 22 కోట్లకు పైగా ఐఫోన్లను విక్రయిస్తుంది. యాపిల్ ఐఫోన్ల అతిపెద్ద మార్కెట్లలో అమెరికా, చైనా, యూరప్ ఉన్నాయి. 

అమెరికాలో తయారైన ఐఫోన్ ధర ఎంత?
ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం, అమెరికా పూర్తిగా తయారు చేసే వ్యవస్థ లేకపోవడం వల్ల 'మేడ్ ఇన్ యుఎస్ఏ' ఆపిల్ ఐఫోన్ ధర 3,500 డాలర్లు (2,98,000 రూపాయలకు పైగా) ఉండవచ్చు. దేశంలో ప్రస్తుతం ప్రతి త్రైమాసికంలో దాదాపు 2 కోట్ల ఐఫోన్ల విక్రయాలకు డిమాండ్ ఉంది. 

భారతదేశంలో తయారైన ఐఫోన్లను తమిళనాడులోని ఫాక్స్‌కాన్ కంపెనీ కర్మాగారంలో అసెంబుల్ చేస్తుంటారు. టాటా ఎలక్ట్రానిక్స్ కూడా మరో ప్రధాన తయారీదారుగా ఉంది. టాటా కంపెనీ, ఫాక్స్‌కాన్ కలిసి ఐఫోన్ ఉత్పత్తిని పెంచడానికి దేశంలో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, నిపుణుల ప్రకారం, అమెరికాలో పెరిగే ఐఫోన్ల డిమాండ్లను తీర్చడానికి భారత్‌కు మరికొంత టైం పడుతుంది. భారతదేశంలో ఉత్పత్తి పెంచడం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, మన ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget