అన్వేషించండి

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

వచ్చే సంవత్సరం జరిగనున్న ఐపీఎల్‌లో 10 జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు టోర్నీ ఫార్మాట్ కూడా మారనుంది. కొత్త ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉండనున్నాయంటే?

ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 జట్లు తలపడనున్నాయి. నేడు ముగిసిన బిడ్డింగ్‌లో అహ్మదాబాద్, లక్నో జట్లను సీపీసీ, ఆర్పీఎస్‌జీ కంపెనీలు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. జట్ల సంఖ్య 10కి పెరిగింది కాబట్టి టోర్నీ ఫార్మాట్ కూడా కాస్త మారనుంది.

ఐపీఎల్ 2022 ఫార్మాట్ ఎలా ఉండనుంది?
వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు ఉండనున్నాయి. ప్రతి జట్టూ ఏడు మ్యాచ్‌లను సొంత మైదానంలో, ఏడు మ్యాచ్‌లను ప్రత్యర్థి మైదానంలో ఆడనున్నాయి. 2011 ఐపీఎల్ తరహాలో ఈ సీజన్ జరగనుందని తెలుస్తోంది. అప్పుడు మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. అంటే ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ప్రతీ జట్టూ.. తమ గ్రూపులో జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. మరో గ్రూపులోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని, మిగిలిన జట్టుతో రెండు మ్యాచ్‌లను ఆడతాయి. అంటే ప్రతి జట్టూ ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయన్న మాట.

లీగ్ దశ ముగిసిన అనంతరం.. అన్ని జట్లను వాటి పాయింట్లు, నెట్ రన్‌రేట్ ప్రకారం ర్యాంక్ చేస్తారు. ఈ జాబితాలో టాప్-4 జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయి. ఈ ప్లేఆఫ్స్‌లో మాత్రం ప్రస్తుతం ఉన్న మోడల్‌లోనే క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి.

పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లూ క్వాలిఫయర్ 1 ఆడతాయి. ఇక్కడ గెలిచిన టీం నేరుగా ఫైనల్స్‌కు వెళ్లిపోతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికి వెళ్లిపోతుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు, క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్ ఆడతాయి. ఫైనల్‌లో గెలిచిన జట్టు టోర్నీ విజేతగా నిలుస్తుంది.

వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్‌లో అహ్మదాబాద్, లక్నో జట్లు కొత్తగా పోటీ పడనున్నాయి. బిడ్డింగ్‌లో సీవీసీ క్యాపిటల్, ఆర్పీఎస్‌జీ కంపెనీలు ఈ జట్లను దక్కించుకున్నాయి. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ లక్నో ఫ్రాంచైజీని రూ.7,090 కోట్లకు దక్కించుకోగా, సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.5,166 కోట్లకు చేజిక్కించుకుంది. మొత్తం 22 కంపెనీలు రూ.10 లక్షల విలువైన టెండర్ డాక్యుమెంట్‌ను దక్కించుకున్నాయి. 

ఐపీఎల్ కొత్త జట్ల బిడ్డింగ్‌లో బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోనే, రణ్‌వీర్ సింగ్ కూడా కన్సార్షియం ద్వారా పాల్గొంటారని వార్తలు వచ్చాయి. కానీ బిడ్డింగ్‌లో మాత్రం వారి పేర్లు వినిపించలేదు.

Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

Also Read: పాక్‌ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!

Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget