అన్వేషించండి

IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?

IT Rules 2021 Amendments:మారుతున్న టెక్నాలజీతోపాటు పెరిగిపోతున్న ఫేక్ కంటెంట్‌ నియంత్రణపై కేంద్రం దృష్టి పెట్టింది. అందుకే ఇప్పటి వరకు ఉన్న చట్టానికి పదును పెట్టాలని చూస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐటీ రూల్స్ 2021లో మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది.
  • స్వతంత్ర కంటెంట్ క్రియేటర్ల పర్యవేక్షణ పెంచాలని యోచిస్తోంది.
  • ఏప్రిల్ 14 లోపు అభిప్రాయాలను సేకరించనున్న ప్రభుత్వం.
  • డీప్‌ఫేక్, ఏఐ నకిలీ కంటెంట్‌పై కఠిన చర్యలు.

IT Rules 2021 Amendments:భారత్‌లోని డిజిటల్ రంగంలో భావప్రకటనా స్వేచ్ఛ, నియంత్రణలపై మరోసారి చర్చ మొదలైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఐటీ రూల్స్‌ 2021ను మార్చాలని కేంద్రం చూస్తోంది. ఇందులో చేపట్టబోయే మార్పులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్‌ కంటెంట్‌పై కేంద్రం మరింత పట్టు సాధించే దిశగా చర్యలు తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. 

ఇప్పటి వరకు ప్రభుత్వ గుర్తించిన మీడియా, పబ్లిషర్స్‌ను మాత్రమే నియంత్రించగలిగేది. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఇతర స్వతంత్ర కంటెంట్ క్రియేటర్లు పెట్టే కంటెంట్‌ను నియంత్రించడం కానీ, ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకురావచ్చు. అంటే నేరుగా అవన్నీ కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి.

ముఖ్యంగా పార్ట్‌III(రూల్‌8) మార్పుల ప్రకారం, అధికారికంగా వార్తా సంస్థలుగా గుర్తించిన వ్యక్తులు చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు లేదా పబ్లిక్‌ అఫైర్స్ కంటెంట్‌ను హోస్ట్‌ చేసే ప్లాట్‌ఫామ్‌లపై పర్యవేక్షణ పెరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్‌ను చదివిన తర్వాత మీరు దానిపై స్పందిస్తే కచ్చితంగా ఆ విషయం ప్రభుత్వ నియంత్రలోకి వస్తుంది. అంటే దానిపై ప్రభుత్వం రూల్స్‌కు లోబడి ఉందా లేదా అనేది పరిశీలించవచ్చు. 

కొత్తగా రూపొందించిన రూల్స్‌పై ప్రభుత్వం అభిప్రాయసేకరణ చేస్తోంది. వీటిపై మీకు ఉన్న అభిప్రాయాన్ని ఏప్రిల్ 14వ తేదీ లోపు చెప్పాల్సి ఉంటుంది. అప్పటి వరకు వివిధ వర్గాల నుంచి వచ్చిన స్పందనలను క్రోడీకరించి బిల్లులో మార్పులు చేర్పులు చేయనున్నారు. 

ఐటీ చట్టం సెక్షన్ 79, సేఫ్‌ హార్బర్‌ రూల్స్‌

ప్రతిపాదిత మార్పుల ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, సలహాలు, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద సేఫ్‌ హార్బర్‌ ప్రయోజనాలను పొందాలంటే ప్లాట్‌ఫామ్‌లు ఈ మార్గదర్శకాలను పాటించడం తప్పనిసరి అని రూల్‌ 3(4) స్పష్టం చేస్తోంది. 

దీనిపై ఐఎఫ్‌ఎఫ్‌ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం ఎక్కువ అవుతుందని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని రూల్స్‌ బహిర్గతం కాకపోవచ్చని, దీని వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని అంటున్నారు. ఇది రాజ్యాంగ సూత్రాలు విరుద్ధమని వాదిస్తున్నారు.

ముప్పు పొంచి ఉందంటున్న ప్రభుత్వం 

మారుతున్న టెక్నాలజీని అందరూ సక్రమంగా వాడుకోవడం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఐటీ చట్టంలో తీసుకొచ్చే మార్పులపై స్పందించిన మంత్రి అశ్విని వైష్ణవ్‌ డీప్‌ఫేక్, ఏఐ కంటెంట్‌ను చూపిస్తున్నారు. వీటి ద్వారా సృష్టించే నకిలీ కంటెంట్‌ వల్ల భారీ ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఇలాంటి కంటెంట్‌కు బ్రేక్ వేయడానికే చట్టానికి పదును పెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తీసుకుంటున్నాయని వివరించారు. 

Frequently Asked Questions

ఐటీ రూల్స్ 2021లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయాలని చూస్తోంది?

ప్రభుత్వం ఐటీ రూల్స్ 2021ను మార్చాలని చూస్తోంది, దీని ద్వారా ఆన్లైన్ కంటెంట్పై, ముఖ్యంగా స్వతంత్ర కంటెంట్ క్రియేటర్ల పోస్టులపై మరింత పట్టు సాధించాలని భావిస్తోంది.

పార్ట్ III (రూల్ 8) లోని మార్పుల వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది?

అధికారికంగా వార్తా సంస్థలుగా గుర్తించబడిన వ్యక్తులు చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు లేదా పబ్లిక్ అఫైర్స్ కంటెంట్ను హోస్ట్ చేసే ప్లాట్ఫామ్లపై పర్యవేక్షణ పెరుగుతుంది.

కొత్తగా రూపొందించిన రూల్స్ పై ప్రభుత్వం అభిప్రాయ సేకరణ ఎప్పటివరకు చేస్తోంది?

కొత్త రూల్స్ పై ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ లోపు అభిప్రాయాలను సేకరిస్తోంది. ఆ తర్వాత వచ్చిన స్పందనల ఆధారంగా బిల్లులో మార్పులు చేయనుంది.

ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద సేఫ్ హార్బర్ ప్రయోజనాలను పొందడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏమి చేయాలి?

సేఫ్ హార్బర్ ప్రయోజనాలను పొందాలంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, సలహాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను తప్పనిసరిగా పాటించాలి.

ఐటీ రూల్స్ మార్పులపై ప్రభుత్వం ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తోంది?

మారుతున్న టెక్నాలజీని అందరూ సక్రమంగా ఉపయోగించుకోవడం లేదని, డీప్ఫేక్, ఏఐ కంటెంట్ వంటి నకిలీ కంటెంట్ వల్ల భారీ ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!
OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!
Advertisement

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhuma Mounika Reddy: రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
Telangana Govt Jobs News: తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
తెలంగాణ నిరుద్యోగులకు భారీ ఊరట! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 44కు పెంపు!
Matsyakarula Sevalo Scheme: మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన సీఎం చంద్రబాబు, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
మత్స్యకారుల ఖాతాల్లో రూ.20000 జమ చేసిన ఏపీ ప్రభుత్వం, జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలంటే!
Woman Harassment: చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
చైన్ స్నాచర్లే కాదు చీరలెత్తి చూసే దరిద్రులూ ఉన్నారు - హైదరాబాద్‌లో జరిగిన ఈ సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసహ్యం వేస్తుంది!
Global Economy: పెట్రోల్, బంగారం, స్టాక్ మార్కెట్ , ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు! జూన్ 10లోపు ఏం జరగబోతోంది?
పెట్రోల్, బంగారం, స్టాక్ మార్కెట్ , ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు! జూన్ 10లోపు ఏం జరగబోతోంది?
New FASTag Category Planned: టోల్ మిన‌హాయించిన‌ వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ - కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్
టోల్ మిన‌హాయించిన‌ వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ - కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్
Ram Pothineni: అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
పెరిగిన CNG ధరలు.. Tata Punch, Maruti Swift కార్లలో ఫుల్ ట్యాంక్‌కు ఎంత ఖర్చవుతుంది?
పెరిగిన CNG ధరలు.. Tata Punch, Maruti Swift కార్లలో ఫుల్ ట్యాంక్‌కు ఎంత ఖర్చవుతుంది?
Embed widget