అన్వేషించండి

Global Outage: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?

మెటా యాజమాన్యంలోని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కొన్ని గంటలపాటు డౌన్ అయ్యాయి. వినియోగదారులు తమ ఖాతాల్లోకి వెళ్లలేకపోయారు. వెంటనే స్పందించిన మెటా సంస్థ, సమస్యను పరిష్కారం చేసినట్లు తెలిపింది.

రోజుల్లో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ రావడంతో అందరూ సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. తమకు నచ్చిన అంశాలను ఇతరులతో పంచుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాలో నుంచి తల తిప్పని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సోషల్ మీడియా ఒక్కసారిగా పని చేయకపోతే? అస్సలు ఏమీ తోచదు. సరిగ్గా నిన్న మెటా యాజమన్యంలోని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా వాడుతున్న వినియోగదారులకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఈ మూడు సేవలు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయి.  

2 గంటల పాటు పని చేయని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్

నిన్న(సోమవారం) రాత్రి సమయంలో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్  యాప్స్ చాలా సేపు పని చేయలేదు. వీటిని వాడుతున్న వినియోగదారులు  సేవలను పొందలేకపోయారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాస్తవానికి మెటా యాజమాన్యంలోని 3 యాప్స్ సుమారు 2 గంటల పాటు పని చేయలేదని యూజర్లు పోస్టులు పెట్టారు.

అంతరాయంపై స్పందించిన మెటా యాజమాన్యం

ఈ అంతరాయం పట్ల మెటా యాజమాన్యం స్పందించింది. వినియోగదారులకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది. ఎక్కడో జరిగిన పొరపాటు కారణంగా యూజర్లకు ఇబ్బంది కలిగిందని చెప్పింది. వెంటనే సేవలను పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా సమస్యలను సరి చేస్తామని వెల్లడించింది.  

సోమవారం రాత్రి సమయంలో సమస్యలు

సోమవారం రాత్రి 9 గంటల సమయంలో  వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పలువురు నెటిజన్లు వెల్లడించారు.  ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు సుమారు 20 వేలకు పైగా వినియోగదారులు ఫిర్యాదు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపు 13,000 మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నట్లు వివరించారు. 5,400 మంది ఫేస్ బుక్, 1,870 మంది వినియోగదారులు వాట్సాప్‌లలో అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఈ యాప్స్ సేవలు నిలిచిపోయినట్లు యూజర్లు నివేదించారు.

భారత్ లో అంతరాయం అంతంత మాత్రమే!

అయితే, ఈ సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా లేవని కంపెనీ తెలిపింది. భారతదేశంలో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను పొందినట్లు వెల్లడించింది.  దేశంలో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.  అటు వాట్సప్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

టెక్నాలజీకి సంబంధించిన సమస్యల కారణంగా గతంలోనూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యాయి.  వేలమంది ప్రజలకు ఈ సోషల్ మీడియా సైట్లతో సమస్య తలెత్తింది. ప్రపంచ నంబర్ వన్ యాప్ వాట్సాప్‌పై కూడా దీని ప్రభావం పడింది. 

Read Also: న్యూస్ యాంకర్లకు ఇక ముప్పే - వార్తలు చదివి వినిపిస్తున్న AI న్యూస్ ప్రెజెంటర్, మన పక్క రాష్ట్రంలోనే!

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi AIrport: 'సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' - ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ స్పందన
'సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' - ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ స్పందన
IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP DesamRohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABPInd vs Eng Semi Final 2 Match Highlights | ఇంగ్లండ్ పై ఘనవిజయం T20 WorldCup 2024 Finalకు భారత్ | ABPSouth Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi AIrport: 'సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' - ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ స్పందన
'సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' - ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ స్పందన
IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Airtel: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
US Presidential Debate: ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
Rishab Shetty: ‘కల్కి‘ బుజ్జితో ‘కాంతార’ స్టార్ ఫ్యామిలీ సరదాలు- నెట్టింట్లో ఫోటోలు వైరల్
‘కల్కి‘ బుజ్జితో ‘కాంతార’ స్టార్ ఫ్యామిలీ సరదాలు- నెట్టింట్లో ఫోటోలు వైరల్
Embed widget