అన్వేషించండి

BSNL 5G: త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ - ప్రకటించిన కేంద్ర మంత్రి - ఎప్పుడు రానుందంటే?

బీఎస్ఎన్ఎల్ రాబోయే ఐదు నుంచి ఏడు నెలల్లో 4జీ, 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

BSNL 5G Launch Update: టెలికాం దిగ్గజాలు Airtel, Jio దేశంలోని అనేక పెద్ద నగరాల్లో తమ వినియోగదారుల కోసం 5G సేవను ప్రారంభించాయి. దీంతో BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులు కూడా 5జీ సేవ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర కమ్యూనికేషన్లు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై మరోసారి అప్‌డేట్ ఇచ్చారు. వైష్ణవ్ ఒక కార్యక్రమంలో BSNL 5జీ సేవకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.

BSNL తన 5జీ నెట్‌వర్క్‌ను ఎప్పుడు ప్రారంభిస్తుంది?
రానున్న 5 నుంచి 7 నెలల్లో BSNL తన 4జీ సర్వీస్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేయనుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటు దేశంలో ఉన్న 1.35 లక్షల టవర్లతో ఇది ప్రారంభమవుతుందని వైష్ణవ్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ చాలా బాగుందని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ స్థానం ఇప్పుడు మరింత పటిష్టం కాబోతోందని అన్నారు.

టాటా సహకారంతో
బీఎస్ఎన్ఎస్ తన 5జీ సేవను ప్రారంభించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) తన సపోర్ట్‌ను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ తన 5జీ సేవను పరీక్షించడానికి టీసీఎస్ నుంచి ఎక్విప్‌మెంట్‌ను కూడా డిమాండ్ చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఆ తర్వాతే కంపెనీ 5జీ ట్రయల్‌ను ప్రారంభించనుంది. మీడియా నివేదికల ప్రకారం ప్రైవేట్ టెలికాం కంపెనీల నెట్‌వర్క్ ఇంకా చేరుకోని చోట బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్ మొదటిగా చేరుకుంటుంది.

ఇప్పటివరకు 5G నెట్‌వర్క్ ఎక్కడికి చేరుకుంది?
ప్రస్తుతం జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. అయితే, వీఐ (వోడాఫోన్ ఐడియా) ఇంకా దాని 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించలేదు. దాని గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు 4జీ నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించలేదు, అయితే త్వరలో కంపెనీ దేశంలో 4G, 5G నెట్‌వర్క్‌లను కూడా ప్రారంభించనుంది.

ఎయిర్‌టెల్, జియో 5జీని ఎక్కడ ప్రారంభించాయి?
జియో గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో తన 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది, తద్వారా గుజరాత్ దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా 5జీ నెట్‌వర్క్ రాష్ట్రంగా అవతరించింది. ఇది కాకుండా జియో ట్రూ 5జీ సేవ ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పూణె, కోల్‌కతా, బనారస్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు నాథద్వారా (రాజస్థాన్) వంటి ప్రాంతాలకు కూడా చేరుకుంది. ఎయిర్‌టెల్ తన 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ను ఢిల్లీ, నాగ్‌పూర్, పానిపట్, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, గౌహతి, పాట్నా వంటి నగరాల్లో ప్రారంభించింది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BSNLIndia (@bsnlcorporate)

టాప్ హెడ్ లైన్స్

Elon Musk: పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
WhatsApp కాకుండా Telegram App మీద నిషేధం ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది ?
WhatsApp కాకుండా Telegram App మీద నిషేధం ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది ?
Telegram Ban: టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం.. నీట్ రీఎగ్జామ్ వేళ కేంద్రం కీలక నిర్ణయం
MiOffice AI: డేటా సెక్యూరిటీతో 150కిపైగా డిజిటల్‌ టూల్స్ ఒకే చోట! వండర్‌ఫుల్ అప్‌డేట్ ఇచ్చిన MiOffice AI
డేటా సెక్యూరిటీతో 150కిపైగా డిజిటల్‌ టూల్స్ ఒకే చోట! వండర్‌ఫుల్ అప్‌డేట్ ఇచ్చిన MiOffice AI

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Assembly Strategy: డీఎస్సీతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలోనే వార్ - వైఎస్ జగన్ డిసైడయ్యారా?
డీఎస్సీతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలోనే వార్ - వైఎస్ జగన్ డిసైడయ్యారా?
US Iran Peace Deal: హర్మూజ్‌లో నేవీ దిగ్బంధనాన్ని ఎత్తేసిన అమెరికా, నౌకలకు లైన్ క్లియర్- అయినా ట్రంప్ ట్విస్ట్ !
హర్మూజ్‌లో నేవీ దిగ్బంధనాన్ని ఎత్తేసిన అమెరికా, నౌకలకు లైన్ క్లియర్- అయినా ట్రంప్ ట్విస్ట్ !
Fake Paneer: హైదరాబాద్‌లో ఫేక్ పనీర్‌ కలకలం.. తనిఖీల్లో 825 కేజీల చీజ్ అనలాగ్ స్వాధీనం- మీ ఆరోగ్యం జాగ్రత్త
హైదరాబాద్‌లో ఫేక్ పనీర్‌ కలకలం.. తనిఖీల్లో 825 కేజీల చీజ్ అనలాగ్ స్వాధీనం- మీ ఆరోగ్యం జాగ్రత్త
India Smashes Record Total: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భార‌త్ అరుదైన రికార్డు.. ఆ ఫీట్ సాధించిన రెండో టీమ్ గా ఘ‌న‌త‌!
ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భార‌త్ అరుదైన రికార్డు.. ఆ ఫీట్ సాధించిన రెండో టీమ్ గా ఘ‌న‌త‌!
Hyderabad ఔటర్ రింగ్ రోడ్డుపై 11 ఏళ్ల బాలుడితో కారు డ్రైవింగ్.. తండ్రి అరెస్ట్, కారు స్వాధీనం
Hyderabad ఔటర్ రింగ్ రోడ్డుపై 11 ఏళ్ల బాలుడితో కారు డ్రైవింగ్.. తండ్రి అరెస్ట్, కారు స్వాధీనం
Gade Sai Krishna Missing Issue: సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ మాత్రమే కాదు.. సీపీ, డీజీపీలపై మర్డర్ కేసు పెట్టాలి - సీబీఐ దర్యాప్తునకు వైఎస్ జగన్ డిమాండ్!
సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ మాత్రమే కాదు.. సీపీ, డీజీపీలపై మర్డర్ కేసు పెట్టాలి - సీబీఐ దర్యాప్తునకు వైఎస్ జగన్ డిమాండ్!
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
Embed widget