అన్వేషించండి

BSNL 5G: త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ - ప్రకటించిన కేంద్ర మంత్రి - ఎప్పుడు రానుందంటే?

బీఎస్ఎన్ఎల్ రాబోయే ఐదు నుంచి ఏడు నెలల్లో 4జీ, 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

BSNL 5G Launch Update: టెలికాం దిగ్గజాలు Airtel, Jio దేశంలోని అనేక పెద్ద నగరాల్లో తమ వినియోగదారుల కోసం 5G సేవను ప్రారంభించాయి. దీంతో BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులు కూడా 5జీ సేవ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర కమ్యూనికేషన్లు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై మరోసారి అప్‌డేట్ ఇచ్చారు. వైష్ణవ్ ఒక కార్యక్రమంలో BSNL 5జీ సేవకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.

BSNL తన 5జీ నెట్‌వర్క్‌ను ఎప్పుడు ప్రారంభిస్తుంది?
రానున్న 5 నుంచి 7 నెలల్లో BSNL తన 4జీ సర్వీస్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేయనుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటు దేశంలో ఉన్న 1.35 లక్షల టవర్లతో ఇది ప్రారంభమవుతుందని వైష్ణవ్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ చాలా బాగుందని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ స్థానం ఇప్పుడు మరింత పటిష్టం కాబోతోందని అన్నారు.

టాటా సహకారంతో
బీఎస్ఎన్ఎస్ తన 5జీ సేవను ప్రారంభించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) తన సపోర్ట్‌ను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ తన 5జీ సేవను పరీక్షించడానికి టీసీఎస్ నుంచి ఎక్విప్‌మెంట్‌ను కూడా డిమాండ్ చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఆ తర్వాతే కంపెనీ 5జీ ట్రయల్‌ను ప్రారంభించనుంది. మీడియా నివేదికల ప్రకారం ప్రైవేట్ టెలికాం కంపెనీల నెట్‌వర్క్ ఇంకా చేరుకోని చోట బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్ మొదటిగా చేరుకుంటుంది.

ఇప్పటివరకు 5G నెట్‌వర్క్ ఎక్కడికి చేరుకుంది?
ప్రస్తుతం జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. అయితే, వీఐ (వోడాఫోన్ ఐడియా) ఇంకా దాని 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించలేదు. దాని గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు 4జీ నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించలేదు, అయితే త్వరలో కంపెనీ దేశంలో 4G, 5G నెట్‌వర్క్‌లను కూడా ప్రారంభించనుంది.

ఎయిర్‌టెల్, జియో 5జీని ఎక్కడ ప్రారంభించాయి?
జియో గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో తన 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది, తద్వారా గుజరాత్ దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా 5జీ నెట్‌వర్క్ రాష్ట్రంగా అవతరించింది. ఇది కాకుండా జియో ట్రూ 5జీ సేవ ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పూణె, కోల్‌కతా, బనారస్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు నాథద్వారా (రాజస్థాన్) వంటి ప్రాంతాలకు కూడా చేరుకుంది. ఎయిర్‌టెల్ తన 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ను ఢిల్లీ, నాగ్‌పూర్, పానిపట్, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, గౌహతి, పాట్నా వంటి నగరాల్లో ప్రారంభించింది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BSNLIndia (@bsnlcorporate)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
గూగుల్ మ్యాప్స్‌లో బిగ్ అప్‌డేట్! ఏఐ అప్‌గ్రేడ్‌తో మారిన నావిగేషన్ రూపురేఖలు!
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget