అన్వేషించండి

BSNL 5G: త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ - ప్రకటించిన కేంద్ర మంత్రి - ఎప్పుడు రానుందంటే?

బీఎస్ఎన్ఎల్ రాబోయే ఐదు నుంచి ఏడు నెలల్లో 4జీ, 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

BSNL 5G Launch Update: టెలికాం దిగ్గజాలు Airtel, Jio దేశంలోని అనేక పెద్ద నగరాల్లో తమ వినియోగదారుల కోసం 5G సేవను ప్రారంభించాయి. దీంతో BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులు కూడా 5జీ సేవ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర కమ్యూనికేషన్లు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై మరోసారి అప్‌డేట్ ఇచ్చారు. వైష్ణవ్ ఒక కార్యక్రమంలో BSNL 5జీ సేవకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.

BSNL తన 5జీ నెట్‌వర్క్‌ను ఎప్పుడు ప్రారంభిస్తుంది?
రానున్న 5 నుంచి 7 నెలల్లో BSNL తన 4జీ సర్వీస్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేయనుందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటు దేశంలో ఉన్న 1.35 లక్షల టవర్లతో ఇది ప్రారంభమవుతుందని వైష్ణవ్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ చాలా బాగుందని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ స్థానం ఇప్పుడు మరింత పటిష్టం కాబోతోందని అన్నారు.

టాటా సహకారంతో
బీఎస్ఎన్ఎస్ తన 5జీ సేవను ప్రారంభించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) తన సపోర్ట్‌ను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ తన 5జీ సేవను పరీక్షించడానికి టీసీఎస్ నుంచి ఎక్విప్‌మెంట్‌ను కూడా డిమాండ్ చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఆ తర్వాతే కంపెనీ 5జీ ట్రయల్‌ను ప్రారంభించనుంది. మీడియా నివేదికల ప్రకారం ప్రైవేట్ టెలికాం కంపెనీల నెట్‌వర్క్ ఇంకా చేరుకోని చోట బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్ మొదటిగా చేరుకుంటుంది.

ఇప్పటివరకు 5G నెట్‌వర్క్ ఎక్కడికి చేరుకుంది?
ప్రస్తుతం జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించాయి. అయితే, వీఐ (వోడాఫోన్ ఐడియా) ఇంకా దాని 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించలేదు. దాని గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు 4జీ నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించలేదు, అయితే త్వరలో కంపెనీ దేశంలో 4G, 5G నెట్‌వర్క్‌లను కూడా ప్రారంభించనుంది.

ఎయిర్‌టెల్, జియో 5జీని ఎక్కడ ప్రారంభించాయి?
జియో గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో తన 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది, తద్వారా గుజరాత్ దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా 5జీ నెట్‌వర్క్ రాష్ట్రంగా అవతరించింది. ఇది కాకుండా జియో ట్రూ 5జీ సేవ ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పూణె, కోల్‌కతా, బనారస్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు నాథద్వారా (రాజస్థాన్) వంటి ప్రాంతాలకు కూడా చేరుకుంది. ఎయిర్‌టెల్ తన 5జీ ప్లస్ నెట్‌వర్క్‌ను ఢిల్లీ, నాగ్‌పూర్, పానిపట్, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, గౌహతి, పాట్నా వంటి నగరాల్లో ప్రారంభించింది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BSNLIndia (@bsnlcorporate)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Embed widget