అన్వేషించండి

Quetta Blast: బాంబ్ బ్లాస్ట్ కారణంగా ఆగిన పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ - ఇక ఆసియా కప్ కష్టమే!

పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్ కారణంగా పీఎస్ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆగిపోయింది.

Pakistan Super League: పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు తర్వాత క్రికెట్ మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. నిజానికి పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ జట్లు తలపడ్డాయి.

బాబర్ ఆజం, సర్ఫరాజ్ ఖాన్ ఈ రెండు జట్లకు కెప్టెన్లుగా ఉన్నారు. అయితే పేలుడు తర్వాత మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. క్వెట్టాలోని మూసా మసీదు సమీపంలో ఈ బాంబు పేలుడు జరిగినట్లు పాక్ మీడియా పేర్కొంది. పేలుడు జరిగిన ప్రదేశం నగరానికి కేవలం 15 నుంచి 20 నిమిషాల దూరంలో ఉంది. అయితే ఈ బాంబు పేలుడుతో మ్యాచ్‌ మధ్యలోనే నిలిచిపోయింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్
మీడియా కథనాల ప్రకారం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు స్టేడియంలో హింసకు పాల్పడ్డారు. వాస్తవానికి చాలా మంది అభిమానులు స్టేడియంలో, చుట్టుపక్కల రాళ్లు రువ్వడం కనిపించింది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి.

ఈ బాంబు పేలుడులో కనీసం ఐదుగురు గాయపడినట్లు సమాచారం. క్వెట్టా పోలీస్ లైన్స్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. గాయపడిన పోలీసులు నగరంలోని సివిల్ ఆసుపత్రిలో చేరారు. ఘటనా స్థలాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని పోలీసు అధికారులు తెలిపారు.

ఆగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్
పోలీసు అధికారుల ప్రకారం భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు నిషేధితం అయిన తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ప్రకటించింది. భద్రతా అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు పేలుడు తర్వాత టీటీపీ తెలిపింది. పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో బాంబు పేలుడు సంభవించడం గమనార్హం. ఇక పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగడం కష్టమే.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం కూడా ఈరోజే జరిగింది. బీసీసీఐ కార్యదర్శి జైషా, పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నజామ్ సేథీ భేటీ అయ్యారు. అయితే వీరిద్దరి మధ్య పెద్దగా చర్చలేమీ జరగలేదని సమాచారం. దీంతో ఆసియా కప్ 2023 నిర్వహణ ఎక్కడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 

పలు నివేదికల ప్రకారం.. ఆసియా కప్- 2023 సీజన్ యూఏఈలో జరగనున్నట్లు సమాచారం. ఈ విధంగా జైషా, నజామ్ సేథీలు తమ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. మార్చిలో ప్రకటించనున్నట్లు సమాచారం. పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ సేథీ తమ ఉద్దేశాన్ని జైషాతో చెప్పినట్లు నివేదికలు తెలిపాయి. 'పాక్ వేదికగా జరిగే ఆసియా కప్ లో భారత్ పాల్గొనకపోతే... భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచకప్ లో తమ జట్టు పాల్గొనదు' అనే విషయాన్ని నజామ్ సేథీ జైషా దృష్టికి తీసుకెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా కూడా చెప్పారు. 

అయితే ఈ ఏడాది ఆసియా కప్ యూఏఈలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాక్ ఆతిథ్యం ఇస్తే భారత్ ఆడదని ఇప్పటికే జైషా అన్నారు. ఒకవేళ టీమిండియా ఆడకపోతే ఆసియా కప్ వెలవెలబోతుంది. పాక్- భారత్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అలాగే ఆదాయం కూడా బాగా వస్తుంది. కాబట్టి భారత్ లేకుండా ఆసియా కప్ నిర్వహించడం అసాధ్యమే. అయితే భారత్ ఆడాలంటే వేదిక మార్చడం అనివార్యం. కాబట్టి భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా పాక్ అనుసరించాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ABP Southern Rising Summit 2025: చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
Embed widget