అన్వేషించండి

ABP Southern Rising Summit 2025: చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు

ABP Southern Rising Summit | దక్షిణ భారత్ సమస్యలపై రాజకీయ, విద్య, సంగీతం, కళా రంగాలకు చెందిన ప్రముఖులు ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని అభిప్రాయాలు పంచుకుంటారు.

ABP Southern Rising Summit 2025: భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలు పాలన, అక్షరాస్యత, అభివృద్ధి, వినోదం, క్రీడలతో సహా అనేక విషయాలలో దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఈ ఐదు రాష్ట్రాల స్థిరమైన పురోగతి, సాంస్కృతిక అభివృద్ధి, సామాజికంగా తమ పాత్రను లోతుగా అర్థం చేసుకోవడానికి ABP నెట్‌వర్క్ మంగళవారం (నవంబర్ 25, 2025) నాడు చెన్నైలో Southern Rising: Future Ready AI, IT and Industry: Innovation, Inspiration, Transformation థీమ్‌తో ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’ని నిర్వహిస్తోంది.

ABP నెట్‌వర్క్ దక్షిణ భారతదేశ రాష్ట్రాల దూరదృష్టిని, అభివృద్ధి ఆలోచనలు షేర్  చేసుకునేందుకు ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మంగళవారం నాడు చెన్నైలోని ITC గ్రాండ్ చోళాలో ఈ మెగా ఈవెంట్‌ జరుగుతుంది. ఇదివరకే ABP నెట్‌వర్క్ నిర్వహించిన రెండు సదరన్ రైజింగ్ సమ్మిట్ ఎడిషన్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయాలు, క్రీడలు, విజ్ఞానం, సినిమా, పరిశ్రమ, వ్యాపారం  అనేక ఇతర రంగాలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. వీరు తమ రంగాల్లో దక్షిణాది ప్రాముఖ్యతతో పాటు అనేక సమస్యలపై తమ ఆలోచనలను పంచుకుంటారు.

కార్యక్రమం ప్రారంభించనున్న ఉదయనిధి స్టాలిన్

ABP నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’ అనేక సెషన్‌లుగా జరుగుతుంది. ఇందులో అనేక మంది వక్తలు తమ ఆలోచనలను పంచుకుంటారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ‘గ్రోత్ విత్ ఈక్విటీ ఫ్రమ్ ఎ మోడల్ స్టేట్’పై తన ఆలోచనలను పంచుకోవడంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయనిధి స్టాలిన్ తర్వాత తమిళనాడు పాఠశాల విద్యా శాఖ మంత్రి అంబిల్ మహేష్ పొయ్యమోళి విద్యను మరింత ముందుకు తీసుకెళ్లడంపై తన ఆలోచనలను షేర్ చేసుకోనున్నారు.

 ఈ సమ్మిట్‌లో తెలంగాణకు చెందిన మాజీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ రాజకీయాలపై తన అభిప్రాయాలను పంచుకోనుండగా, DMK జాతీయ ప్రతినిధి సేలం ధరణిధరన్, AIADMK జాతీయ ప్రతినిధి కోవై సత్యన్, తమిళనాడు బీజేపీ ప్రతినిధి డాక్టర్ ఎస్జీ సూర్య, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బెనెట్ ఆంటోనీ రాజ్ పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక లోతైన పునఃపరిశీలన (SIR) ప్రక్రియపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు.

సమ్మిట్‌లో పాల్గొనున్న మరికొందరు ప్రముఖులు

ABP నెట్‌వర్క్ నేడు నిర్వహిస్తున్న ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’లో నటి మాళవిక మోహనన్, ప్లే బ్లాక్ సింగర్ కవితా కృష్ణమూర్తి, IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొ. వి. కామకోటి, మాజీ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ అంబుమణి రామదాస్, తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు  అన్నామలై తదితరులు పాల్గొంటారు.

'ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025'ను ఎక్కడ చూడవచ్చు?

చెన్నైలో సమ్మిట్ ITC గ్రాండ్ చోళాలో ఈ ఈవెంట్ జరుగుతుంది. గత రెండు ఎడిషన్ల తరహాలోనే సదరన్ రైజింగ్ సమ్మిట్ కార్యక్రమాన్ని మీరు abpdesam.comతో పాటు www.abplive.com, news.abplive.com, abpnadu.com  లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. దీనిని ABP న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Embed widget