అన్వేషించండి

Shocking: ఇదేందయ్యా ఇది..  ఒలింపిక్ పతకాలకు తుప్పు, నాసిరకం మెడల్స్ సరఫరాపై నాలిక కరుచుకున్న నిర్వాహకులు

ఒలింపిక్ పతక విలువను తగ్గించేలా పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రవర్తించారు. నాసిరకం మెడల్స్ తో ఐఓసీ పరువు తీశారు. ఇప్పుడు నష్ట నివారణకు దిగారు.దీనిపై ప్లేయర్లు, క్రీడాభిమానులు ఫైరవుతున్నారు. 

Rust On Olympic Medals: ఒలింపిక్ మెడల్ అంటే ఎంతో ప్రత్యేకమో మనకు తెలియనిది కాదు. జీవితకాలంలో కనీసం ఒక్క పతకమైన సాధించాలని ఎంతోమంది ప్లేయర్లు కలలు కంటుంటారు. ఇక భారత్ కు సంబంధించి, చాలాఎడిషన్లలో సింగిల్ డిజిట్ లోనే పతకాలు వస్తున్నాయి. పక్కదేశమైన చైనా, క్వింటాళ్ల కొద్ది పతకాలు సాధిస్తుంటే, మనమేమో ఒక్క పతకం సాధించిన అపూర్వమని భావిస్తుంటాం. పతకం సాధించిన ప్లేయర్లకు కనకవర్షం కురిపిస్తాం. 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఆరు పతకాలు వచ్చాయి. అందులో ఒక సిల్వర్, ఐదు రజత పతాలకు కావడం గమనార్హం. అయితే తమక ఇచ్చిన పతకాలు తుప్పు పడుతున్నాయని, రంగు వెలిసి పోతున్నాయని భారత ప్లేయర్లు కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా డబుల్ ఒలింపిక్ మెడల్ విన్నర్ మనూ భాకర్, తనకిచ్చిన రెండు పతకాలు ఖరాబ్ అయ్యాయని కంప్లైంట్ చేసింది. రంగు వెలిసి పోయాయని వాపోయింది. ఇలాంటి ఫిర్యదులు బాగా రావడంతో నష్ట నివారణ చర్యలకు అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సీల్ (ఐఓసీ) దిగింది. 

నిషేధిత పదార్థమే దీనికి కారణమా..?
నిజానికి పారిస్ లోని కాయిన్ల ముద్రణాలయం, మింట్.. ఒలింపిక్ పతకాలను ముద్రించిందని తెలుస్తోంది. అయితే ఈసారి కొత్తగా నిబంధనలు రూపొందించారు. వార్నిష్ కు సంబంధించి ఒక పదార్థాన్ని వాడకపోవడంతో పతకాలు రంగు వెలిసి, తుప్పు పట్టి పోతున్నాయని తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల నుంచి పతకాల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తలపట్టుకున్న ఐఓసీ.. 2024  పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకుల కమిటీకి దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాడై పోయిన పతకాల స్థానంలో త్వరలో కొత్తవి అందిస్తామని సదరు కమిటీ చావు కబురు చల్లగా చెప్పింది. అలాగే ఫిర్యాదు దారుల సంఖ్యను బట్టి, సీరియల్ నెంబర్ ప్రకారం కొత్త పతకం అందిస్తామని వెల్లడించింది. దీంతో ఇప్పటికే పతకాలు సాధించిన ఆటగాళ్లు తమ మెడల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించుకుని, ఏవైనా లోపాలుంటే నిర్వాహకులకు ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు. 

షూటింగ్ లోనే అత్యధిక పతకాలు..
గత ఏడాది భారీ అంచనాలతో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత్.. కేవలం ఆరు పతకాలకే పరిమితమైంది.  ముఖ్యంగా షూటింగ్లోనే మూడు పతకాలు రావడం విశేషం. వ్యక్తిగత విభాగంతోపాటు సరబ్జోత్ తో కలిసి మనూ భాకర్ రెండు పతకాలు సాధించింది. స్వాతంత్ర భారతవనిలో ఒకే ఎడిషన్ లో రెండు పతకాలు సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా మనూ నిలిచింది. అలాగే స్వప్ని్ కుసాలే కు కూడా కాంస్య పతకం దక్కింది. మరోవైపు రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రవత్ కు కాంస్య పతకం లభించింది. ఇక జావెలిన్ త్రోలో హాట్ ఫేవరెట్, టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు.

గోల్డ్ మెడల్ సాధిస్తాడని అభిమానులు ఆశించిన వెండి పతకంతో సంతృప్తి పొందాడు. మరోవైపు పురుషుల హాకీలో వరుసగా రెండోసారి భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తానికి ఆరు పతకాలు సాధించినట్లయ్యింది. ఇక రెజ్లింగ్ లో వినేశ్ ఫోగట్.. ఫైనల్ కు చేరినా, అధిక బరువు కారణంగా డిస్ క్వాలిఫై అయ్యింది. దీంతో భారత అభిమానులు షాక్ తిన్నారు. ఏదేమైనా వచ్చే టోర్నీలో అయినా డబుల్ డిజిట్ లో ఒలింపిక్స్ మెడల్స్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Also Read: Rohit Vs Gambhir: రోహిత్ తో గంభీర్ కి విబేధాలు.. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తో కూడా.. బీసీసీఐ క్లారిటీ..!

టాప్ హెడ్ లైన్స్

PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Jana Nayagan Producer: 'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
Embed widget