అన్వేషించండి

IPL 2023: ఫ్యూచర్లో CSK ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ధోనీ - ఆ రూల్‌ వర్తించదన్న సెహ్వాగ్‌!

IPL 2023: ఎంఎస్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌ జాబితాకు సరిపోడని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అంటున్నాడు. కెప్టెన్సీ కోసమే అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడుతున్నాడని గుర్తు చేశాడు.

IPL 2023, MS Dhoni: 

ఎంఎస్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌ జాబితాకు సరిపోడని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అంటున్నాడు. కెప్టెన్సీ కోసమే అతడు చెన్నై సూపర్‌  కింగ్స్‌కు ఆడుతున్నాడని గుర్తు చేశాడు. నాయకుడిగా అతడి అవసరం 20 ఓవర్లూ ఉంటుందన్నాడు. ఒకవేళ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే భవిష్యత్తులోనూ సారథిగా కొనసాగుతాడే కానీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉండడని అంచనా వేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌ నేపథ్యంలో వీరూ మాట్లాడాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) మొదటి ఆటగాడిగా ఉంటాడని లేదంటే రిటైర్మెంట్‌ తీసుకుంటాడని వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) అంటున్నాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ క్రైటీరియాకు అతడు సరిపోడని పేర్కొన్నాడు. 'పూర్తి ఫిట్‌నెస్‌ ఉంటే 40 ఏళ్ల తర్వాత క్రికెట్‌ ఆడటం కష్టమేమీ కాదు. ఈ ఏడాది ఎంఎస్ ధోనీ సామర్థ్యం మేరకు బ్యాటింగ్‌ చేయలేదు. మోకాలి గాయాన్ని పెద్దది చేసుకోవాలని అతడు కోరుకోవడం లేదు. తరచుగా అతడు ఆఖరి రెండు ఓవర్లు ఆడేందుకే క్రీజులోకి వస్తున్నాడు. ఈ సీజన్లో అతడు ఎదుర్కొన్న బంతుల్ని లెక్కపెడితే 40-50 కన్నా ఎక్కువేం ఉండవు' అని వీరూ అన్నాడు.

Also Read: మొతేరాలో ఫైనల్‌ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్‌, నెగెటివ్స్‌ ఇవే!

'ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఎంఎస్ ధోనీకి నప్పదు. ఎందుకంటే అతడు కెప్టెన్సీ కోసమే ఆడుతున్నాడు. నాయకత్వం కోసం అతడు మైదానంలో కచ్చితంగా ఉండాలి. బ్యాటింగ్‌ చేసి ఫీల్డింగ్‌కు రాకుండా, బౌలింగ్‌ చేసి బ్యాటింగ్‌కు రాకుండా ఉండేవాళ్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. ధోనీ కచ్చితంగా 20 ఓవర్లు మైదానంలో ఉండాల్సిందే. అతడు కెప్టెనే కానప్పుడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఎందుకు ఆడతాడు? అలాంటప్పుడు అతడిని మెంటార్‌ లేదా కోచ్‌ లేదా డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌గా చూడొచ్చు' అని వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు.

వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో మాత్రం వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయంతో విభేదించాడు. ఎంఎస్‌ ధోనీ భవిష్యత్తులో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడేందుకు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఉపయోగపడుతుందని అంటున్నాడు. దీంతో అతడి కెరీర్‌ను పొడగించుకోవచ్చని పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో మహీ మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక మ్యాచులో తనను ఎక్కువగా పరుగెత్తించొద్దని రవీంద్ర జడేజాకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

ఇక ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ రిజర్వు డేకు మారిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం ఆడలేదు. ఇకపై సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సోమవారం ఫైనల్‌కు రిజర్వ్‌ అయింది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం ఆటను చెడగొట్టింది. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా చాలా సేపు వర్షం ఆగుతుందా అని ఎదురుచూశారు. కానీ వర్షం ఆగలేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP E Crop 2025: రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
Telangana News: రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
CM Chandrababu: దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
TGSRTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
Advertisement

వీడియోలు

చిట్టి రోబో లాంటి ఫ్రెండ్..  టెక్ ప్రపంచాన్ని షేక్ చేయనున్న ఏజెంటిక్ AI
India vs Pakistan Asia Cup 2025 Final | నేడే ఆసియా కప్ ఫైనల్
Asia Cup Final India vs Pakistan | ఇండియా, పాక్ మ‌ధ్య మ‌రో కాంట్ర‌వ‌ర్సీ
India vs Pakistan Final Revange Asia Cup 2025 | ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ!
Salman Agha on Shake Hand Controversy | Asia Cup Final 2025 | భారత్ తో మ్యాచ్ అంటే ఒత్తిడే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP E Crop 2025: రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
Telangana News: రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
CM Chandrababu: దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
TGSRTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్త డిపోలు, బస్ స్టేషన్ల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల
NTR: నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు
Telugu TV Movies Today: చిరు ‘రౌడీ అల్లుడు’, బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ to విజయ్ ‘జిల్లా’, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ వరకు - ఈ సోమవారం (సెప్టెంబర్ 29) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరు ‘రౌడీ అల్లుడు’, బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ to విజయ్ ‘జిల్లా’, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ వరకు - ఈ సోమవారం (సెప్టెంబర్ 29) టీవీలలో వచ్చే సినిమాలివే
Navaratri Day 8: నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు మూలా నక్షత్రం రోజు శ్రీసరస్వతి దేవి అలంకారం -  పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!
నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు మూలా నక్షత్రం రోజు శ్రీసరస్వతి దేవి అలంకారం - పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!
Andhra Pradesh News: అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీ చేయడంలో నామీ ఐలాండ్‌ విధానం అమలుకు ఏపీ రెడీ!
అమరావతిని బ్లూ - గ్రీన్ సిటీ చేయడంలో నామీ ఐలాండ్‌ విధానం అమలుకు ఏపీ రెడీ!
Embed widget