అన్వేషించండి

IPL 2022: ఐపీఎల్‌ రూల్స్‌ మార్చిన బీసీసీఐ - ఇకపై 2 DRSలు, కరోనా సోకితే!

IPL Rules Changed: ఐపీఎల్ లీగులో కొన్ని నిబంధనలు మారుతున్నాయి. ఇకపై మ్యాచుకు ముందు ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడితే ఏం చేయాలో స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే డీఆర్‌ఎస్‌ల సంఖ్యను పెంచారు.

Major changes to IPL playing conditions: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL) కొన్ని నిబంధనలు మారుతున్నాయి. సీజన్‌ ఆరంభానికి ముందు కొన్ని కొత్త రూల్స్‌ తీసుకొస్తున్నారు. ఇకపై మ్యాచుకు ముందు ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడితే ఏం చేయాలో స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే డీఆర్‌ఎస్‌ల (DRS) సంఖ్యను  పెంచారు.

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ 15 సీజన్ మొదలవుతోంది. మార్చి 26న చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి మ్యాచులో తలపడబోతున్నాయి. ఏటా సీజన్ ఆరంభానికి ముందు అవసరమైతే నిబంధనలను మారుస్తుంటారు. ఈ సారీ అలాగే చేయబోతున్నారు. ఎంసీసీ సవరించిన ఒక రూల్‌ను ఇప్పటి నుంచే అమలు చేయబోతున్నారు.

రెండు DRSలు

'ప్రతి ఇన్నింగ్స్‌లో డీఆర్‌ఎస్‌ల సంఖ్యను ఒకటి నుంచి రెండుకు పెంచుతున్నారు. అంటే ప్రతి జట్టు ఒక ఇన్నింగ్స్‌లో రెండు సమీక్షలు కోరవచ్చు. ఎవరైనా క్యాచ్‌ఔట్‌ అయితే బ్యాటర్‌ క్రీజులోంచి కదిలినా, కదలకపోయినా కొత్త బ్యాటరే స్ట్రైకింగ్‌ తీసుకుంటాడు. ఔటైన బంతి ఓవర్లో ఆఖరి కాకపోతే మాత్రం అలా ఉండదు' అని ఫ్రాంచైజీలకు బీసీసీఐ వివరించినట్టు తెలుస్తోంది.

Super over కుదరకపోతే

సూపర్‌ ఓవర్‌ (Super Over) విషయంలోనూ ఒక నిబంధన మారుతోంది. గతంలో మ్యాచ్‌ టై అయితే ఫలితం వచ్చేంత వరకు సూపర్‌ ఓవర్లు ఆడించేవారు. ఇప్పుడలా కాదు. మ్యాచ్‌ ముగిసిన నిర్దేశిత సమయం ఉంటేనే సూపర్‌ ఓవర్‌ ఆడిస్తారు. ఒక వేళ ఫలితం తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ కుదరకపోతే లీగు దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన వారికే  విజయం దక్కుతుంది. ఫైనల్‌ మ్యాచుకూ ఇదే రూల్‌ వర్తిస్తుంది.

'విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ లేదా వరుస సూపర్‌ ఓవర్లు నిర్వహించే సమయం లేకపోతే లీగు దశలో ఎక్కువ పాయింట్లు పొంది, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో ఉన్నవారే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తారు' అని బీసీసీఐ తెలిపింది.

కరోనా సోకితే

కరోనా (Covid 19) వల్ల ఒకవేళ తుది పదకొండు మందిని మైదానంలోకి దించలేకపోతే ఏం చేయాలో టెక్నికల్‌ కమిటీకి వదిలేస్తున్నారు. కరోనా వల్ల ఏడుగురు భారతీయులు, నలుగురు విదేశీయులతో కూడిన జట్టును దించేందుకు అవకాశం లేకపోతే రీషెడ్యూలు చేస్తారు. ఒకవేళ రీషెడ్యూలు చేసేందుకు వీలవ్వకపోతే ఆ అంశాన్ని ఐపీఎల్‌ టెక్నికల్‌ కమిటీకి రిఫర్‌ చేస్తారు. వారు తీసుకున్నదే తుది నిర్ణయం. అంతా దానిని గౌరవించాల్సిందే.

ప్లేఆఫ్‌ మ్యాచుల వేదికలను మార్చే పూర్తి అధికారం బీసీసీఐకే ఉంటుంది. దాంతోపాటు సెంట్రల్‌ రెవెన్యూ తీసుకునే హక్కులు ఉంటాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget