అన్వేషించండి

Sports Year Ender 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మెరిసిన భారత ప్లేయర్లు - మనూ భాకర్‌కి రెండు పతకాలు, 6 పతకాలతో ఆకట్టుకున్న ఆటగాళ్లు

Paris Olympics: ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. మొత్తం ఆరు పతకాలతో ఆకట్టుకున్నారు. 

Flashback 2024: నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ ఈ ఏడాది జరిగింది. పారిస్‌లో జరిగిన ఈ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఆరు పతకాలు సాధించారు. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్యాలున్నాయి. జూలై 26 నుంచి ప్రారంభమైన ఈ మెగాటోర్నీలో ఏడుగురు రిజర్వ్ ఆటగాళ్లతో కలిపి 117 మంది ఆటగాళ్లను భారత్.. పారిస్‌కు పంపింది. అలాగే వాళ్లతో పాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారులు కూడా వెళ్లారు. 

సత్తా చాటిన మనూ భాకర్..
ఇక జూలై 28న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మనూ భాకర్ కాంస్యం సాధించింది. ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచి మెడల్ కైవసం చేసుకుంది. ఒలింపిక్ షూటింగ్‌లో పతకం గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే 10 మి. మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో కాంస్యం గెలిచింది. దీంతో షూటింగ్‌లో రెండు పతకాలు సాధించిన మనూ భాకర్ సత్తా చాటింది. టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి పతకం సాధించింది. పతక పోరులో దక్షిణ కొరియాను ఓడించింది. 

అదర గొట్టిన కుసాలే..
ఇక పురుషుల షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుసాలే భారత్‌కు మూడో పతకాన్ని అందించాడు. పురుషుల 50 మి. రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని పొందాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా స్వప్నిల్ నిలిచాడు. నిజానికి ఈ విభాగంలో పతకం ఆశలు లేకపోయినప్పటికీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పతకాన్ని దక్కించుకున్నాడు. 

కాంస్య పతకాన్ని నిలబెట్టుకున్న భారత్..
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి 41 సంవత్సరాల పతక కరువును తీర్చిన భారత జట్టు.. ఈ ఎడిషన్‌లోనూ మళ్లీ కాంస్య పతకాన్ని సాధించింది. నిజానికి భారత ఆటతీరును బట్టి, బంగారు పతకాన్ని సాధిస్తుందని అనిపించింది. కానీ బ్యాడ్ లక్ వెంటాడటంతో కాంస్యానికే పరిమితమైంది. పతక పోరులో స్పెయిన్‌ను సునాయాసంగా ఓడించింది. 

నీరజ్ చోప్రా.. సిల్వర్ త్రో..
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి సంచలనం రేకెత్తించిన నీరజ్ చోప్రా.. మళ్లీ అదే ప్రదర్శనను పునరావృతం చేయలేక పోయాడు. 89.45 మీటర్లు ఈటెను విసిరి రెండో స్థానాన్ని దక్కించుకుని, సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ సాధించిన ఏకైక సిల్వర్ మెడల్ ఇదే కావడం విశేషం. 
ఇక చివరగా పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 57 కేజీల ఈవెంట్లో అమన్ సెహ్రావత్ కాంస్యాన్ని సాధించాడు. ఆగస్టు 9న జరిగిన ఈ పోరులో ప్యూర్టొరికో ప్లేయర్‌ను ఓడించి పతకాన్ని దక్కించుకున్నాడు. రెజ్లింగ్ విభాగంలో భారత్ సాథించిన ఏకైక పతకం ఇదే కావడం విశేషం. మరోవైపు వినేశ్ ఫోగట్.. తన విభాగంలో ఫైనల్‌కు చేరినా, బరువు సమస్యతో డిస్ క్వాలిఫై అయింది.  

Also Read: Virat Kohli  Record: సచిన్ సరసన కోహ్లీ, ఎలైట్ క్లబ్ లోకి ప్రవేశం- ఆసీస్ పై ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఘనత 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
AP Politics: ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
AP Politics: ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
3 Roses Season 2 Web Series: మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Nikhil Maliyakkal - Chinni Serial: 'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
'చిన్ని' సీరియల్‌లో కావ్యతో పాటు నిఖిల్ కూడా... మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్
Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Embed widget