Ind vs Afg Series: భారత్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలిసారి వన్డే సిరీస్.. BCCI అధికారిక షెడ్యూల్ విడుదల
IPL 2026 తర్వాత భారత జట్టు సొంతగడ్డపై జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో చారిత్రాత్మకమైన ఒక టెస్ట్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్ జరగడం ఇదే మొదటిసారి.

టి20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లతో టీమిండియా బిజీగా ఉన్న సమయంలో బీసీసీఐ మరో కొత్త సిరీస్ ప్రకటించింది. భారత క్రికెట్ అభిమానులకు ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2026 తర్వాత జూన్ నెలలో భారత జట్టు తన సొంత గడ్డపై ఒక కొత్త సవాలుకు సిద్ధం కానుంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్తో తలపడబోతోంది. అయితే ఇది సాధారణ సిరీస్ మాత్రం కాదు. ఆ జట్టుకు గుర్తుండిపోయే మెమరీ ఇది. ఇది రెండు దేశాల మధ్య తొలి వన్డే సిరీస్ కావడంతో అఫ్గాన్ జట్టుకు ప్రాధాన్యత సంతరించుకుంది.
మొదటిసారిగా ద్వైపాక్షిక వన్డే సిరీస్
టీమిండియా ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్తో ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్ వంటి పెద్ద వేదికలపై వన్డే మ్యాచ్లు ఆడింది. కానీ 2 దేశాల మధ్య ఇప్పటి వరకు ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ కూడా జరగలేదు. అందుకే జూన్ 2026లో జరగనున్న ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ చరిత్రలో మొదటిసారిగా నమోదు కానుంది.
ఈ పర్యటన ఏకైక టెస్ట్ మ్యాచ్తో ప్రారంభమవుతుంది. చండీగఢ్లో జూన్ 6 నుండి జూన్ 10 మధ్య రెండు జట్లు తొలి జట్టులో తలపడనున్నాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇది రెండవ టెస్ట్ మ్యాచ్ మాత్రమే. అంతకుముందు రెండు జట్ల మధ్య 2018లో కేవలం ఒకే ఒక టెస్ట్ జరిగింది. 2018లో జరిగిన ఆ టెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం.
🚨 News 🚨
— BCCI (@BCCI) March 2, 2026
Here's a look at the schedule for Afghanistan Men’s Team’s tour of India in June 2026 🗓️
Details ▶️ https://t.co/OkJVip4AhJ#TeamIndia | #INDvAFG pic.twitter.com/CQhIliTf2E
జూన్లో ప్రారంభం కానున్న వన్డే యాక్షన్
ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత జూన్ 14 నుండి భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చారిత్రాత్మక వన్డే సిరీస్ కూడా జరగనుంది. దీని మొదటి మ్యాచ్ ధర్మశాలలో జరగనుండగా, రెండవ మ్యాచ్ లక్నో వేదికగా, మూడవ మ్యాచ్ చెన్నైలో నిర్వహించనున్నారు. ప్రపంచంలోని బలమైన జట్లలో ఒకటైన భారత్తో వారి స్వదేశంలో ఆడే అవకాశం రావడం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు పెద్ద పరీక్షగా మారవచ్చు. కానీ వారికి ఇలాంటి సిరీస్ లు రావడం ఆఫ్గన్ క్రికెట్కు మేలు చేస్తుంది.
భారత్-ఆఫ్ఘనిస్తాన్ వన్డే షెడ్యూల్:
-
మొదటి వన్డే మ్యాచ్: 14 జూన్ 2026, ధర్మశాల
-
రెండవ వన్డే మ్యాచ్: 17 జూన్ 2026, లక్నో
-
మూడవ వన్డే మ్యాచ్: 20 జూన్ 2026, చెన్నై
మరోవైపు ఇండియాకు ఈ సిరీస్ 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాల దిశగా మొదటి అడుగుగా భావిస్తున్నారు. స్వదేశంలో కొత్త వ్యూహాలను, ఆటగాళ్లను పరీక్షించడానికి ఇది ఒక మంచి అవకాశం కానుంది.
సీనియర్ ఆటగాళ్ల కం బ్యాక్..
ఈ సిరీస్లో భారత జట్టు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తిరిగి జట్టుతో చేరతారు. మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు మళ్లీ మైదానంలో దిగి ఆడనున్నారు. అయితే ఇప్పటి వరకు భారత జట్టును అధికారికంగా ప్రకటించలేదు. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత సెలెక్టర్లు జట్టును ప్రకటించే అవకాశం ఉంది.





















