అన్వేషించండి

IND vs ENG, 1st Innings Highlights: టీమ్‌ఇండియా 416 ఆలౌట్‌! ఇప్పటికైతే 'ఎడ్జ్‌' మనదే!

IND vs ENG, 5th Test, Edgbaston Stadium: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 84.5 ఓవర్లకు 416 పరుగులకు ఆలౌటైంది.

IND vs ENG, 1st Innings Highlights: ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్‌ఇండియా దాదాపుగా 'ఎడ్జ్‌' సాధించింది. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లకు 416కు ఆలౌటైంది. 98కే 5 వికెట్లు చేజార్చుకున్న భారత్‌ను రిషభ్ పంత్‌ (146; 111 బంతుల్లో 20x4, 4x6), రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) అద్వితీయమైన సెంచరీలతో ఆదుకున్నారు. ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం సాధించగల స్కోరును అందించారు.

రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్‌ స్కోరు 338/7తో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. కేవలం 11.5 ఓవర్లు మాత్రమే ఆడింది. అయితేనేం! 78 పరుగులు సాధించింది. వ్యక్తిగత స్కోరు 83తో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా చక్కని కవర్‌డ్రైవ్‌లతో అలరించాడు. మ్యాటీ పాట్స్‌ వేసిన 78.5వ బంతికి లభించిన జీవనదానాన్ని ఉపయోగించుకున్నాడు. అదే ఓవర్లో ఆఖరి రెండు బంతుల్ని బౌండరీకి పంపించి టెస్టుల్లో మూడో సెంచరీ అందుకున్నాడు. మొత్తంగా 183 బంతుల్లో 13 ఫోర్లతో ఈ ఘనత సాధించాడు. అయితే అండర్సన్‌ వేసిన 82.2వ బంతికి అతడు ఔటయ్యాడు. అంతకు ముందే షమీ ఔటవ్వడంతో భారత్‌ 375/9తో నిలిచింది.

Also Read: జస్ట్‌ 6.14 నిమిషాల్లో రిషభ్‌ పంత్‌ ఊచకోత - వైరల్‌ వీడియో!

Also Read: ఎడ్జ్‌బాస్టన్‌లో 'రాక్‌స్టార్‌'! వరుస బౌండరీలతో జడ్డూ సెంచరీ

జట్టు స్కోరు 400 దాటితే బాగుండూ అనుకుంటున్న తరుణంలో కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా (31*; 16 బంతుల్లో 4x4, 2x6) స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్లో ఏకంగా 35 రన్స్‌ కొట్టి సర్‌ప్రైజ్‌ చేశాడు. వరుసగా 4 Wd5 N6 4 4 4 6 1తో దుమ్మురేపాడు. అండర్సన్‌ వేసిన 84.5వ బంతికి సిరాజ్‌ (2) ఔటవ్వడంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. జిమ్మీ ఆరోసారి టీమ్‌ఇండియాపై 5 వికెట్ల ఘనత అందుకున్నాడు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Pak nationals in Hyderabad: హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
హైదారాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు..  వీసాల తనిఖీలు చేస్తున్న పోలీసులు
War Condoms:  కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
Chaurya Paatam Review - 'చౌర్య పాఠం' రివ్యూ: కొత్త హీరోతో ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తీసిన క్రైమ్ కామెడీ డ్రామా... సినిమా హిట్టా? ఫట్టా?
'చౌర్య పాఠం' రివ్యూ: కొత్త హీరోతో ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తీసిన క్రైమ్ కామెడీ డ్రామా... సినిమా హిట్టా? ఫట్టా?
Pahalgam Terror Attack: ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
ఏపీ, తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్.. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ
Embed widget